Pakistan: ద్రోహం, వంచనకు మారుపేరు ‘‘పాకిస్తాన్’’. ఇన్నాళ్లు కష్టకాలంలో ఆర్థికంగా, సైనికంగా రక్షిస్తూ వస్తున్న డ్రాగన్ కంట్రీ చైనాకు పాకిస్తాన్ నమ్మకద్రోహం చేస్తోంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్లు అమెరికా పంచన చేరి, చైనా ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారు. రెండు దేశాల మధ్య పాకిస్తాన్ డేంజరస్ గేమ్ ఆడుతోంది. ఇటీవల, పాకిస్తాన్ ట్రంప్తో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోంది. ముఖ్యంగా, ఇరు దేశాల మధ్య ‘‘ఖనిజ ఒప్పందం’’ కుదిరింది. దీంతో బలూచిస్తాన్…
భారతీయులకు గుడ్న్యూస్ అందింది. భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రత్యక్ష విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించేందుకు రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
India-China: అమెరికన్ సుంకాలు, ట్రంప్ తీరుతో భారత్, చైనాలు తమ సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల చైనాలో జరిగిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీ ఓ) సమావేశంలో మోడీ, జిన్ పింగ్ మధ్య సమావేశాలు ప్రపంచాన్ని ఆకర్షించాయి. ప్రధాని మోడీకి చైనా ఘన స్వాగతం పలికింది. ఇదే సమయంలో పుతిన్, మోడీ, జిన్ పింగ్ ఉన్న ఫోటో వైరల్గా మారింది.
Anant Shastra: పాకిస్తాన్, చైనా సరిహద్ధుల్ని మరింత బలోపేతం చేయడానికి భారత సైన్యం సిద్ధమవుతోంది. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో వైమానిక రక్షణ నెట్వర్క్ను బలోపేతం చేయడానికి భారత సైన్యం ఐదు నుంచి ఆరు రెజిమెంట్ల ‘‘ అనంత శస్త్ర’’ రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయడానికి టెండర్ జారీ చేసింది.
రాగస తుఫాన్ తైవాన్, చైనాలో పెను విధ్వంసం సృష్టించింది. మునుపెన్నడూ లేని విధంగా తైవాన్లో జలప్రళయం విరుచుకుపడింది. 195-200 కి.మీ వేగంతో తీవ్ర గాలులు, కుండపోతగా కురిసిన వర్షంతో తైవాన్ అతలాకుతలం అయింది.
రాగస తుఫాన్ హాంకాంగ్, దక్షిణ చైనా, తైవాన్, ఫిలిప్పీన్స్లో తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఓ వైపు భారీ వర్షాలు.. ఇంకోవైపు 200 కి.మీ వేగంతో గాలులు వీచడంతో ప్రధాన పట్టణాలన్నీ అతలాకుతలం అయ్యాయి. తుఫాన్ కారణంగా తైవాన్లో 14 మంది, ఫిలిప్పీన్స్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
Shaolin Temple: చైనాలో ప్రముఖ బౌద్ధాలయం ‘‘షావోలిన్ టెంపుల్’’ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. షావోలిన్ మఠాధిపతి షి యోంగ్క్సిన్ ఆశ్రమాన్ని వ్యాపార సామ్రాజ్యంగా మార్చారనే ఆరోపణలపై చైనీస్ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. వ్యక్తిగత సంపద కోసం ఆలయ నిధులను దుర్వినియోగం చేసినట్లు అనుమానిస్తూ, చైనా కఠిన చర్యలు ప్రారంభించింది. మత సంస్థల్ని నియంత్రించడానికి, దేశంలో పెరుగుతున్న ‘‘దేవాలయ ఆర్థిక వ్యవస్థ’’ను పారదర్శకంగా ఉంచడానికి అక్కడి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు చెబుతోంది.
రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ పూనుకున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్తో శాంతి ఒప్పందం చేసుకునేందుకు పుతిన్ ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అధిక ఒత్తిడి పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
భారత్పై ట్రంప్ కక్ష కట్టినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే భారత్పై 50 శాతం సుంకం విధించారు. తాజాగా ఓవల్ కార్యాలయంలో ట్రంప్ మాట్లాడుతూ.. భారత్పై మరిన్ని దశలు ఉన్నాయని.. రెండు లేదా మూడో దశ సుంకాలు ఉంటాయని సూచించారు.