S-400: చైనా, పాక్లకు హెచ్చరిక.. S-400, S-500 ట్రైనింగ్ కోసం రష్యాకు భారత దళాలు..
- చైనా, పాక్లకు హెచ్చరిక..
- S-400, S-500 ట్రైనింగ్ కోసం రష్యాకు భారత దళాలు..
- డిసెంబర్లో పుతిన్ పర్యటన ముందు కీలక పరిణామాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S-400: పాకిస్తాన్, చైనా దేశాలకు చేదు వార్త. భారత్ రక్షణ దళాలు రష్యాకు బయలుదేరాయి. ఎందుకంటే, ప్రపంచంలోనే అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్లో ఒకటైన S-400 వైమానిక రక్షణ వ్యవస్థలపై అధునాతన శిక్షణ తీసుకోవడానికి మన సైనికులు పెద్ద సంఖ్యలో రష్యాకు వెళ్లారు. రక్షణ వర్గాల సమాచారం ప్రకారం, భారత్ రష్యానుంచి మరో మూడు S-400 యూనిట్లు కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోంది. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి తన వైమానిక రక్షణ వ్యవస్థల్ని బలోపేతం చేయడానికి భారత్ గతంలో ఐదు S-400 వ్యవస్థల్ని కొనుగోలు చేసింది. ఇప్పుడు మరికొన్నింటిని తీసుకోవాలని భావిస్తోంది.
Read Also: CM Chandrababu: దుబాయ్లో సీఎం చంద్రబాబు.. యూఏఈ-ఏపీ మధ్య వాణిజ్య, సాంకేతిక బంధం బలోపేతం..!
Also Read
- Karnataka Tragedy: కర్ణాటకలో ఘోర విషాదం.. ముత్యపుచిప్పల కోసం మృత్యు ఒడిలోకి! నదిలో మునిగి ఎనిమిది మంది మృతి..
- Viral: ఫుడ్ పాయిజనింగ్కు రూ. 65 వేల బిల్లు.. నెట్టింట వైరల్గా మారిన ఆ హాస్పిటల్ దోపిడీ..
- Falta Re-polling Result: అభిషేక్ బెనర్జీ అడ్డాలోనే టీఎంసీ ఖల్లాస్.. ఫల్తా రీపోలింగ్లో బీజేపీ క్లీన్ స్వీప్!
- Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్..
S-400 అడ్వాన్సుడ్ వెర్షన్ S-500 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం కూడా చర్చలు ప్రారంభమయ్యాయని విషయం తెలిసిన వ్యక్తులు చెబుతున్నారు. ఈ ఒప్పందం కుదిరితే , శత్రు దేశాల నుంచి వచ్చే వైమానిక ముప్పులను మరింత సమర్థవంతంగా అడ్డుకుంటుంది. డిసెంబర్ నెలలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వార్తలు వస్తున్నాయి. ఆయన పర్యటనలో భారత్-రష్యాల మధ్య కీలక రక్షణ ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.
ఎస్-400 వ్యవస్థలకు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను గుర్తించి, ట్రాక్ చేసి నాశనం చేసే సత్తా ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ వైమానిక రక్షణ వ్యవస్థలలో ఒకటిగా పరిగణించబడుతోంది. ఇది వివిధ ఎత్తుల్లో వచ్చే వైమానిక ముప్పులైన ఫైటర్ జెట్లు, డ్రోన్లు, బాలిస్టిక్ మిస్సైళ్ల వంటి వాటిని గుర్తించి, గాలిలోనే నాశనం చేయగలదు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్, భారత్ వైపు ప్రయోగించిన చైనీస్ తయారీ పీఎల్-15 వంటి క్షిపణుల్ని కూల్చేసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ (AEW&C) లేదా ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ఎయిర్క్రాఫ్ట్ను దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో విజయవంతంగా ట్రాక్ చేసి నాశనం చేయడం ద్వారా ఎస్-400 సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసింది.
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!