Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహ్మద్ యూనస్ చైనా పర్యటనలో ఉన్నాడు. ఇప్పటికే, పాకిస్తాన్తో స్నేహం చేస్తున్న బంగ్లాదేశ్, ఇప్పుడు చైనాతో చెలిమిని పెంచుకునే ప్రయత్నంలో ఉంది. ఇదిలా ఉంటే, మహ్మద్ యూనస్ భారత్ని బెదిరించేలా చైనాలో కామెంట్స్ చేయడమే ఇప్పుడు సంచలనంగా మారింది. భారతదేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాలకు లక్ష్యంగా చేసుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
China: ఇంటి అద్దెను ఆదా చేసుకునే ఉద్దేశంతో ఓ మహిళ ఏకంగా కంపెనీ టాయిలెట్ని మకాంగా మార్చుకుంది. చైనాకు చెందిన 18 ఏళ్ల యువతి యాంగ్, తన పనిచేస్తున్న ఫర్నీచర్ దుకాణంలోని టాయిలెట్ని నివాసంగా చేసుకుంది. దీనికి నెలకు 5 యువాన్లు (రూ. 545) అద్దె చెల్లిస్తుంది. ఖర్చులను తగ్గించుకోవడానికి ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఆమె నెలకు దాదాపుగా రూ. 34,570 సంపాదిస్తుంది. ఆమె సంపాదనలో ఎక్కువ భాగాన్ని ఆదా చేయడానికి ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటుంది.
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు భారీ భూకంపాలతో హడలెత్తిపోయాయి. ఈ ఉదయం బ్యాంకాక్, మయన్మార్లో పెద్ద ఎత్తున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.7గా నమోదైంది. దీంతో భారీ అంతస్తుల బిల్డింగ్లు నేలకూలిపోయాయి. భయంతో జనాలు పరుగులు తీశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2 నుంచి పరస్పర సుంకాలను ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తాజాగా యూఎస్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా, కెనడా, మెక్సికోలతో భారత్ ను పోల్చమని యూఎస్ తెలిపింది. భారత్- అమెరికాల మధ్య వాణిజ్యపరమైన ఒప్పందానికి సంబంధించిన చర్చలు బుధవారం ప్రారంభమయ్యాయి. యూఎస్కు చెందిన వాణిజ్య శాఖ అధికారులు, ఢిల్లీలోని అధికారులతో చర్చల సమయంలో ఈ విషయంపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.
America-China: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల చైనా దిగుమతులపై సుంకాలను రెట్టింపు చేయడంతో చైనా తీవ్రంగా స్పందించింది. అమెరికా యుద్ధమే కోరుకుంటే తాము చివరి వరకూ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చైనా హెచ్చరించింది. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదట చైనా దిగుమతులపై 10 శాతం సుంకాలు విధించారు. కానీ, ఇప్పుడు ఆ సుంకాలను 20 శాతం చేసిన తర్వాత చైనా ప్రతిస్పందించింది. Read Also: Graduate MLC Elections: పట్టభద్రుల…
Donald Trump: ఆఫ్ఘనిస్థాన్ నుంచి బయటకు వచ్చిన అమెరికా, మరోసారి ఆ దేశానికి వెళ్లాలని యోచిస్తోంది. ‘‘జో బైడెన్ వదులుకున్నాడు, మనం దానిని తిరిగి పొందాలని నేను అనుకుంటున్నారు’’ అని ట్రంప్ అన్నారు. అమెరికా వ్యూహాత్మకంగా భావిస్తున్న ఆఫ్ఘాన్లోని బాగ్రామ్ వైమానిక స్థావరం గురించి ట్రంప్ మాట్లాడారు. అమెరికా సాయుధ దళాల కమాండర్ అండ్ చీఫ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి క్యాబినెట్ సమావేశం తర్వాత, ఆయన విలేకరులతో ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘నన్ను…
సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్ని సంఘటనలు ప్రజలను నవ్విస్తాయి. మరి కొన్ని నెటిజన్లను ఆశ్చర్యపరుస్తాయి. ఇలాంటి ఓ ఆశ్చర్య పరిచే ఘటన చైనాలో జరిగింది. వాయువ్య చైనాలోని మంచు పర్వతంపై 18 ఏళ్ల యువకుడు 10 రోజుల పాటు మంచులో చిక్కుకున్నాడు.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం డీప్ సీక్ చైనాలోని అన్ని ఇళ్లలోకి ప్రవేశిస్తోంది. చైనా ప్రజలు డీప్ సీక్ని ఆనందంగా స్వీకరిస్తున్నారు. టీవీలు, ఫ్రిజ్లు, రోబో వ్యాక్యూమ్ క్లినర్లలో డీప్ సీక్ని ఉపయోగిస్తున్నారు. అనేక హోమ్ అప్లికేషన్స్ బ్రాండ్స్ తమ ఉత్పత్తుల్లో డీప్ సీక్ కృత్రిమ మేథను ఉపయోగిస్తామని ప్రకటించారు.
USA: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యూఎస్, రష్యాల మధ్య స్నేహం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. పలుమార్లు ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీతో ట్రంప్కి పొసగడం లేదు. ఉక్రెయిన్ యుద్ధానికి పుతిన్, ట్రంప్ మార్గాలను వెతుకుతున్నారు.
AI Robo: కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – AI) ఆధారంగా రూపొందించిన రోబోలు మనిషి జీవనశైలిలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి. వీటి సహాయంతో పరిశ్రమలు, ఆరోగ్య రంగం, విద్య, భద్రత వంటి అనేక విభాగాల్లో నూతన మార్గాలు సృష్టించబడుతున్నాయి. హ్యూమనాయిడ్ రోబోలు, ముఖ్యంగా, మనుషులను అనుకరించే విధంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఇవి మానవ చర్యలను అర్థం చేసుకోవడం, అందుకు అనుగుణంగా స్పందించడం వంటి పనులు చేస్తాయి. కానీ, తాజా సంఘటనలు ఈ రోబోల భద్రతపై కొత్త చర్చలను…