చైనాలో ప్రచండ గాలులు బీభత్సం సృష్టించాయి. శనివారం భారీ గాలులు వీచడంతో రాజధాని బీజింగ్లో చెట్లు కూలిపోగా.. పాత ఇళ్లులు ధ్వంసం అయ్యాయి. భారీగా దుమ్ము తుఫాన్ చెలరేగగా.. పార్కులు మూసేశారు. ఇక భీకర గాలులు కారణంగా వందలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. దాదాపు 700 విమాన సర్వీసులు రద్దైనట్లుగా తెలుస్తోంది. దీంతో బీజింగ్, డాక్సింగ్లో విమానాశ్రయాల్లో వందలాది మంది ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు. ఎయిర్పోర్టులోనే నిద్రిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Praveen Pagadala : సంచలనం సృష్టించిన ప్రవీణ్ పగడాల కేసు.. దర్యాప్తు పూర్తి
ఇదిలా ఉంటే చైనాకు తీవ్ర తుఫాన్ హెచ్చరికలు జారీ అయ్యాయి. 50 కిలోల కంటే తక్కువ బరువు ఉన్న వారు ఎగిరిపోవచ్చని హెచ్చరించింది. గంటకు 150 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వార్నింగ్ ఇచ్చింది. తొలిసారి నారింజ రంగు తుఫాను హెచ్చరిక జారీ చేశారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు. బయటకు ఎవరూ రావొద్దని హెచ్చరించారు. 1951లో నమోదైన రికార్డులను తాజా తుఫాన్ బద్దలు కొట్టింది. ప్రస్తుతం విమాన, రైళ్ల సర్వీసులను రద్దు చేశారు. పర్యాటక ప్రాంతాలను మూసేశారు.
ఇది కూడా చదవండి: Medak: సినిమా రేంజ్ లో.. 19 ఏళ్ళ వయసులో ఇంట్లో నుంచి వెళ్లిపోయి.. ఇప్పుడు ఇలా..
శుక్రవారం ఢిల్లీలో కూడా భీకరమైన దుమ్ము తుఫాన్ బీభత్సం సృష్టించింది. చాలా మంది భూకంపం వచ్చిందేమోనని భయాందోళనకు గురయ్యారు. అంతగా హడలెత్తించింది. ఇక విమాన రాకపోకలు నిలిచిపోవడంతో ప్రస్తుతం ప్రయాణికులంతా ఢిల్లీ ఎయిర్పోర్టులోనే నిరీక్షిస్తున్నారు. వందలాది మంది ప్రయాణికులతో ఎయిర్పోర్టు కిక్కిరిసిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.