Trump Tariff: చైనాపై 145 శాతం సుంకాలు.. భారత్కు జులై 9 వరకు మినహాయింపు
- చైనా- అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం..
- చైనాపై 145 శాతం సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్..
- అమెరికా పన్నులు వేసి బెదిరింపులు, బ్లాక్ మెయిల్స్ కు దిగుతుంది: చైనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump Tariff: చైనా- అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుంది. ఇక, అగ్ర రాజ్యంతో ఢీ అంటే ఢీ అంటున్న డ్రాగన్పై సుంకాలు పెంచేస్తుంది. ఇప్పటిదాకా చైనాపై విధించిన టారిఫ్ లను మొత్తంగా లెక్కిస్తే 145 శాతంగా ఉంటాయని యూఎస్ స్పష్టం చేసింది. అయితే, బుధవారం నాటికి 125 శాతమని ట్రంప్ పేర్కొనగా.. అది గురువారం వరకు 145 శాతానికి పెంచినట్లు వైట్ హౌస్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, భారత్పై విధించిన 26 శాతం అదనపు సుంకాల మినహాయింపు జులై 9వ తేదీ వరకూ అమల్లో ఉంటుందని వెల్లడించింది. గతంలో అమల్లో ఉన్న 10 శాతం సుంకాలు కొనసాగుతాయని చెప్పుకొచ్చింది. అలాగే, చైనాపై మరింతగా పన్నులు పెరగడంతో అమెరికా స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి.
Read Also: US: న్యూయార్క్లోని హడ్సన్ నదిలో కూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి
Also Read
- Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
కాగా, సుంకాల వాయిదాకు తెచ్చిన 14,257 కార్యనిర్వాహక ఉత్తర్వుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం పెట్టారు. దీనివల్ల 75కు పైగా దేశాలకు 90 రోజుల పాటు సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చింది. చైనా, హాంకాంగ్, మకావులకు మాత్రం ఇది వర్తించదు అని పేర్కొన్నారు. అయితే, పన్నులపై అమెరికాతో వివాదానికి దిగుతున్న చైనా కాస్త వెనక్కి తగ్గిపోయింది. ట్రంప్ బెదిరింపులకు తలొగ్గబోమంటూనే చర్చలకు రెడీగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అమెరికా విధించిన 145శాతం సుంకాలకు నిరసనగా ఫిల్మ్ల దిగుమతులను తగ్గించింది. యూఎస్ సుంకాల యుద్ధమే చేయాలనుకుంటే.. చివరి వరకు తామూ పోరాడుతామని చైనా వాణిజ్యశాఖ అధికార ప్రతినిధి యాంగ్ కి యాన్ వెల్లడించాడు. చైనాతో డీల్ చేయాలంటే.. ఒత్తిళ్లు, బెదిరింపులు, బ్లాక్ మెయిళ్లు సరైన మార్గం కాదని పేర్కొన్నారు. ఇరు దేశాలు కలిసి కూర్చొని విభేదాల పరిష్కారానికి కృషి చేస్తామని చైనా చెప్పుకొచ్చింది.
Read Also: Nagar Kurnool: నేటి నుంచి సలేశ్వరం జాతర ప్రారంభం..
ఇక డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతం సుంకాలతో 438 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై ఎఫెక్ట్ పడనుంది. డ్రాగన్ కంట్రీ విధించిన 84 శాతం టారిఫ్ ల వల్ల 143 బిలియన్ డాలర్ల అమెరికా ఉత్పత్తులపై ప్రభావం చూపిస్తుంది. అమెరికా విధించిన సుంకాలపై చైనా ప్రజల్లో తీవ్ర ఆందోళనలు నెలకున్నాయి. యూఎస్ కు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసే కంపెనీలు ఉద్యోగులకు లేఆఫ్లు ప్రకటిస్తున్నాయని నెట్టంట పోస్టులు వెలువడుతున్నాయి.
తాజావార్తలు
-
UCC Bill: ‘ఒక్క పెళ్లి చేసుకున్నవారికే రాష్ట్రంలో ఉండే హక్కు’.. సీఎం సంచలన ప్రకటన..
-
CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
-
Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
-
Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
-
Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!