సింహంతో వేట.. జగన్తో ఆట మంచిది కాదు: ఎమ్మెల్యే రోజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఏపీ అసెంబ్లీలో ఆమె మహిళా సాధికారతపై చర్చ సందర్భంగా ప్రసంగించారు. సింహంతో వేట.. జగన్తో ఆట మంచిది కాదని.. చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. కోడలు మగపిల్లాడిని కంటే అత్త సంతోషించదా అని ఆడపిల్ల పుట్టుకను చంద్రబాబు అవమానించారని… కానీ ఇప్పుడు అదే మహిళలు చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా తీర్పు చెప్పారని రోజా వ్యాఖ్యానించారు. ఏపీలో స్థానిక సంస్థలు ఎన్నికలు ఏవి జరిగినా మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారని… వారు ఎవరికి ఓట్లు వేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మూడు సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు మహిళలకు ఏం ఒరగబెట్టాడని రోజా ప్రశ్నించారు. మహిళలకు గౌరవం తెచ్చే పనులు చేయకుండా మహిళా ద్రోహిగా చంద్రబాబు మిగిలిపోయాడని ఎద్దేవా చేశారు.
Read Also: మనదేశంలో ఎక్కువ మంది వీక్షిస్తున్న ఓటీటీ ఇదే..!!
Also Read
40 ఏళ్ల నుంచి బాబు ప్రజలను మోసం చేస్తున్నాడని రోజా ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ వీధి రౌడీల్లాగా వ్యవహరించారని, గల్లీ గల్లీ తిరిగి పరుగెత్తినా ప్రజలు పట్టించుకోలేదన్నారు. తట్టాబుట్టా సర్దుకుని చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్కు వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందని రోజా సెటైర్లు వేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసేందుకు చంద్రబాబుకు సహకరించిన కుప్పం ప్రజలకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. దీంతో టీడీపీ దుకాణం బంద్ అయ్యిందన్నారు. 40 ఏళ్లుగా చంద్రబాబు కట్టుకున్న కుప్పం కోటను తమ సీఎం జగన్ బద్దలు కొట్టారని రోజా వ్యాఖ్యానించారు. ఇంకా చంద్రబాబుకు, ఆయన తనయుడు చిట్టినాయుడికి రాజకీయాలు ఎందుకు అని ప్రశ్నించారు. లోకేష్ ఈ మధ్య తిక్క తిక్కగా మాట్లాడుతున్నాడని… ఇటీవల కుప్పం ఎన్నికల ప్రచారానికి వెళ్లిన లోకేష్.. ‘కుప్పం గడ్డ.. చంద్రబాబు అడ్డా’ అంటూ వ్యాఖ్యలు చేశాడన్నారు. కుప్పం గడ్డ ఇప్పుడు చంద్రబాబు అడ్డా కాదని.. ఐస్ గడ్డ అని రోజా అన్నారు. ఎందుకంటే క్రమంగా కుప్పం ఐస్ గడ్డ కరిగిపోతూ వస్తుందని చంద్రబాబుకు తెలిసేలా చేశామన్నారు. చరిత్ర సృష్టించిన జగన్కు హ్యాట్సాఫ్కు చెప్తున్నానని రోజా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!