సింహంతో వేట.. జగన్తో ఆట మంచిది కాదు: ఎమ్మెల్యే రోజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఏపీ అసెంబ్లీలో ఆమె మహిళా సాధికారతపై చర్చ సందర్భంగా ప్రసంగించారు. సింహంతో వేట.. జగన్తో ఆట మంచిది కాదని.. చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. కోడలు మగపిల్లాడిని కంటే అత్త సంతోషించదా అని ఆడపిల్ల పుట్టుకను చంద్రబాబు అవమానించారని… కానీ ఇప్పుడు అదే మహిళలు చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా తీర్పు చెప్పారని రోజా వ్యాఖ్యానించారు. ఏపీలో స్థానిక సంస్థలు ఎన్నికలు ఏవి జరిగినా మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారని… వారు ఎవరికి ఓట్లు వేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మూడు సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు మహిళలకు ఏం ఒరగబెట్టాడని రోజా ప్రశ్నించారు. మహిళలకు గౌరవం తెచ్చే పనులు చేయకుండా మహిళా ద్రోహిగా చంద్రబాబు మిగిలిపోయాడని ఎద్దేవా చేశారు.
Read Also: మనదేశంలో ఎక్కువ మంది వీక్షిస్తున్న ఓటీటీ ఇదే..!!
Also Read
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
- Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
40 ఏళ్ల నుంచి బాబు ప్రజలను మోసం చేస్తున్నాడని రోజా ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ వీధి రౌడీల్లాగా వ్యవహరించారని, గల్లీ గల్లీ తిరిగి పరుగెత్తినా ప్రజలు పట్టించుకోలేదన్నారు. తట్టాబుట్టా సర్దుకుని చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్కు వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందని రోజా సెటైర్లు వేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసేందుకు చంద్రబాబుకు సహకరించిన కుప్పం ప్రజలకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. దీంతో టీడీపీ దుకాణం బంద్ అయ్యిందన్నారు. 40 ఏళ్లుగా చంద్రబాబు కట్టుకున్న కుప్పం కోటను తమ సీఎం జగన్ బద్దలు కొట్టారని రోజా వ్యాఖ్యానించారు. ఇంకా చంద్రబాబుకు, ఆయన తనయుడు చిట్టినాయుడికి రాజకీయాలు ఎందుకు అని ప్రశ్నించారు. లోకేష్ ఈ మధ్య తిక్క తిక్కగా మాట్లాడుతున్నాడని… ఇటీవల కుప్పం ఎన్నికల ప్రచారానికి వెళ్లిన లోకేష్.. ‘కుప్పం గడ్డ.. చంద్రబాబు అడ్డా’ అంటూ వ్యాఖ్యలు చేశాడన్నారు. కుప్పం గడ్డ ఇప్పుడు చంద్రబాబు అడ్డా కాదని.. ఐస్ గడ్డ అని రోజా అన్నారు. ఎందుకంటే క్రమంగా కుప్పం ఐస్ గడ్డ కరిగిపోతూ వస్తుందని చంద్రబాబుకు తెలిసేలా చేశామన్నారు. చరిత్ర సృష్టించిన జగన్కు హ్యాట్సాఫ్కు చెప్తున్నానని రోజా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!