Home
Chandrababu Naidu
Chandrababu Naidu News
-
CM Chandrababu: అనకాపల్లి అభివృద్ధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. గూగుల్ డేటా సెంటర్, గోదావరి జలాలపై స్పష్టత..
అనకాపల్లి కేవలం బెల్లానికి మాత్రమే పరిమితం కాదని, రాబోయే రోజుల్లో దేశంలోనే అత్యుత్తమ ఇండస్ట్రియల్ హబ్గా ఆవిర్భవిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తాము చేస్తున్న అభివృద్ధిని ప్రజలు అభిమానిస్తే అదే తమకు అసలైన తృప్తినిస్తుందని పేర్కొన్నారు. సమాజానికి మంచి చేసే ప్రతి పనిలోనూ సవాళ్లు, విమర్శలు ఎదురవుతాయని.. అయితే అభివృద్ధి ప్రయాణం ఆగదని తేల్చి చెప్పారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వస్తే నీటి ఎద్దడి తలెత్తుతుందంటూ కొందరు అసత్య ప్రచారం… -
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 31 నుంచే ప్రారంభం..
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు నిర్వాసితుల కోసం మూడో విడత కింద రూ.250 కోట్ల చెక్కును అందజేశారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 31వ తేదీన వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభించబోతున్నామని అధికారికంగా ప్రకటించారు. 30 ఏళ్ల క్రితం అసాధ్యమనుకున్న వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని సుసాధ్యం చేసి చూపించామని సీఎం పేర్కొన్నారు. 1996లో తానే స్వయంగా ఈ ప్రాజెక్టుకు శిలాఫలకం వేశానని,… -
CM Chandrababu : చంద్రబాబు ఫుల్ బిజీ.. ఉత్తరాంధ్రలో ఒక్కరోజే 3 జిల్లాలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఒకే రోజు అనకాపల్లి, విజయనగరం , విశాఖపట్నం జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ సమావేశాలు , అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సదస్సులో ఆయన పాల్గొననున్నారు. స్థానిక సమస్యల పరిష్కారం నుంచి అంతర్జాతీయ వేదికపై రాష్ట్ర ప్రతిష్ఠను చాటడం వరకు ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అనకాపల్లి జిల్లాలో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ , ప్రజా వేదిక ముఖ్యమంత్రి పర్యటన వివరాల ప్రకారం, ఆయన శనివారం ఉదయం… -
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
Southern Zonal Council Meeting: దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా, సమన్వయంతో ముందుకు సాగితే దేశం మరింత బలపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 31వ దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన చేసిన ప్రసంగం ఆంధ్రప్రదేశ్ సమస్యలకే పరిమితం కాకుండా.. దక్షిణ భారతదేశ సమగ్ర అభివృద్ధికి దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదించేలా సాగింది. కేంద్రం–రాష్ట్రాలు, రాష్ట్రం–రాష్ట్రాల మధ్య పోటీ, ఘర్షణల కంటే పరస్పర సహకారం, సమన్వయం, విశ్వాసంతోనే అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు పేర్కొన్నారు.… -
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
OTR : అమరావతిలో అత్యాధునిక సదుపాయాలతో ప్రజాప్రతినిధుల కోసం నిర్మించిన నివాస సముదాయం పూర్తిగా సిద్ధమైంది. ఇక కేటాయించడం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గృహప్రవేశాలు చేయడమే మిగిలి ఉంది. సుమారు 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్స్, క్లబ్హౌస్, గ్రీన్ కవర్ లాంటి మౌలిక వసతులు, అధునాతన భద్రతా ప్రమాణాలతో క్వార్టర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈనెల 24న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా తాళాల అప్పగింత కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది.. అర్హత ఉన్న ప్రజాప్రతినిధులకు నిబంధనల ప్రకారం కేటాయింపులు… -
CM Chandrababu: గ్రూప్-1 నియామకాల్లో భయంకరమైన అక్రమాలు.. గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు విమర్శలు
CM Chandrababu: అసెంబ్లీలో గ్రూప్-1 నియామకాల వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 పరీక్షలు, నియామకాల్లో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా కాకుండా అక్రమ పద్ధతుల్లో ఉద్యోగాల భర్తీ జరిగిందని విమర్శించారు. గ్రూప్-1 వ్యవహారంలో కోర్టును కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. కోర్టును తప్పుదారి పట్టించేందుకు తప్పుడు అఫిడవిట్ సమర్పించారని అన్నారు. పేపర్ల మూల్యాంకన బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీకి… -
BC reservations: బీసీలకు 34శాతం రిజర్వేషన్లు.. స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు ప్రకటన..
BC reservations: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీ రిజర్వేషన్లు, బీసీల రాజకీయ సాధికారత, స్థానిక సంస్థల్లో వారి భాగస్వామ్యంపై మాట్లాడారు. బీసీలకు అండగా ఉంటామని తమ ప్రభుత్వం మరోసారి నిరూపించిందని అన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రక నిర్ణయమని చంద్రబాబు పేర్కొన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించడం కేవలం ఎన్నికల హామీ కాదని, అది తమ… -
AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికపై కేబినెట్ చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ప్రస్తుతం స్థానిక సంస్థల్లో బీసీలకు సుమారు 24.15… -
AP Assembly: నేడు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు.. క్వశ్చన్ అవర్తో ప్రారంభం కానున్న శాసనసభ!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా మంగళవారం రెండో రోజు శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ ప్రారంభం కానుంది. సభా కార్యక్రమాల్లో పలు కీలక బిల్లులు, ప్రజా సంక్షేమ అంశాలపై చర్చలు జరగనున్నాయి. మరోవైపు శాసనమండలి సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) నివేదికను సీఎం చంద్రబాబు సభ ముందు ఉంచనున్నారు. అలాగే గ్రంథాలయాల సవరణ బిల్లును… -
CM Chandrababu: రాష్ట్రంలో నీటి కొరతపై అలర్ట్.. ఎల్నినోపై ప్రజలకు సీఎం కీలక సూచనలు
CM Chandrababu: రాష్ట్రంలో వర్షాలు గణనీయంగా తగ్గాయని, దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం కనిపిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ ఏడాది అన్ని జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోందని చెప్పారు. ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అసెంబ్లీ వేదికగా పేర్కొన్నారు. 2026 జూన్ నుంచి డిసెంబర్ వరకు 867 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా, కేవలం 557 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని అంచనాలు…
తాజావార్తలు
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
-
OTR: దువ్వాడ శ్రీనివాస్ అడుగులు మళ్లీ వైసీపీ వైపు పడుతున్నాయా..?
-
AP High Court: విశాఖ డేటా సెంటర్పై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు
-
Off The Record: కొండా సురేఖ వివాదంపై మంత్రి సీతక్క మౌనం..!!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!