Annadata Sukhibhava: ఏపీ ప్రజలకు శుభవార్త.. ఉగాది కానుకలుగా అన్నదాత సుఖీభవ, గృహ ప్రవేశాలు!
- ఏపీ ప్రజలకు సీఎం శుభవార్త
- ఉగాది కానుకలుగా గృహ ప్రవేశాలు
- 13న రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నిధులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 6వ జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పరిపాలన సహా పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. సమావేశాన్ని ప్రారంభిస్తూ సీఎం చంద్రబాబు మాట్లాడారు.
‘కలెక్టర్ల కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ముఖ్యమైన విషయాలపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ఆరో కలెక్టర్ల సమావేశం. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండింటిపై సమాన దృష్టి పెట్టుతూ ప్రజలకు గుడ్ గవర్నెన్స్ అందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ నిర్ణయాలు దీర్ఘకాలిక ఫలితాలను ఇస్తాయి, అవి పాజిటివ్ లేదా నెగెటివ్గా ఉండవచ్చు. రాష్ట్ర పరిపాలనను మెరుగుపరచేందుకు ప్రభుత్వం రూపొందించిన 10 ముఖ్య సూత్రాల ఆధారంగా సుపరిపాలనపై అధికారులు దృష్టి పెట్టాలి. వర్చువల్, ఫిజికల్ వర్క్ రెండింటినీ సమన్వయంతో నిర్వహించాల్సిన అవసరం ఉంది. నేను, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అన్ని అంశాలపై సమగ్రంగా పర్యవేక్షణ చేస్తున్నాము’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
Also Read
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Also Read: Jasprit Bumrah Records: ‘వన్స్ ఇన్ ఏ జనరేషన్ బౌలర్’.. మరీ ఇన్ని అరుదైన రికార్డులా బుమ్రా?
‘ఇవాళ, రేపు అన్ని విభాగాలకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చ జరుగుతుంది. జిల్లా స్థాయిలో అధికారులు క్షేత్ర స్థాయిలో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించాలి. నేను సుదీర్ఘ ఉపన్యాసాలు ఇవ్వను, ముఖ్య విషయాలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వడమే నా లక్ష్యం. సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాము. ఈ నెల 13వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. అలాగే ఉగాది పండుగ సందర్భంగా 2 లక్షల 50 వేల ఇళ్లకు గృహ ప్రవేశాలు నిర్వహిస్తాం. అన్నదాత సుఖీభవ, గృహ ప్రవేశాలు ఉగాది కానుకలుగా ప్రజలకు అందిస్తాం’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.
అదే విధంగా విద్యుత్ రంగంలో ట్రూ డౌన్ చార్జీలను విధించి విద్యుత్ చార్జీలను తగ్గించగలిగామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ నిర్ణయం ద్వారా వినియోగదారులకు ప్రత్యక్ష లాభం కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. రాష్ట్రంలో సమర్థవంతమైన పరిపాలన కోసం అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు.
తాజావార్తలు
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
-
RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
-
Ukraine: ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?