Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఈగల్ టీం కీలక ప్రకటన..
- ఫామ్ హౌస్పై దాడి సమయంలో కాల్పులు
- 11 మంది పట్టుబాటు.. ఐదుగురికి డ్రగ్స్ పాజిటివ్
- డ్రగ్ నెట్వర్క్పై ఈగల్ టీం దర్యాప్తు
- రాజకీయ ప్రముఖుల పేర్లు వెలుగులోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగిన సంచలన డ్రగ్స్ పార్టీ , కాల్పుల ఘటనపై దర్యాప్తు సంస్థ ‘ఈగల్ టీమ్’ కీలక వివరాలను వెల్లడించింది. నిన్న రాత్రి పక్కా సమాచారంతో ఫామ్ హౌస్ను చుట్టుముట్టిన సమయంలో నిందితులు పోలీసులనే ఎదురించే ప్రయత్నం చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈగల్ టీమ్ వెల్లడించిన కథనం ప్రకారం, పోలీసులు ఫామ్ హౌస్ను ముట్టడించిన సమయంలో లోపలి నుంచి పోలీసుల వైపు కాల్పులు జరిగాయి. ఈ గగుర్పునొడిచే పరిణామాల మధ్య ఏమాత్రం వెనక్కి తగ్గని పోలీసులు, వెంటనే లోపలికి ప్రవేశించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాలిలోకి కాల్పులు జరిపి హంగామా సృష్టించిన నమిత్ శర్మ అనే వ్యక్తిని పోలీసులు గుర్తించి వెంటనే అరెస్టు చేశారు.
IPL 2026: కేకేఆర్ కెప్టెన్గా మళ్లీ అతనే.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న షారుక్ ఖాన్ టీమ్!
Also Read
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
- Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం.. ఎయిర్పోర్టులో ప్రధాన నిందితుడు అరెస్ట్..
- Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
ఈ సోదాల సమయంలో ఫామ్ హౌస్లో ఒక మహిళతో సహా మొత్తం 11 మంది మద్యం సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో అనుమానాస్పద నార్కోటిక్ పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా నిందితుల్లో ఒకరైన శరత్ కుమార్ వద్ద 0.26 గ్రాముల కొకైన్ లభించగా, ఈ డ్రగ్స్ను తాను కౌశిక్ రవి ద్వారా తెప్పించుకున్నట్లు అతను నేరాన్ని అంగీకరించడంతో ఈ డ్రగ్ నెట్వర్క్ గుట్టు వెలుగులోకి వచ్చింది. పట్టుబడిన 11 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, వారిలో ఐదుగురికి డ్రగ్స్ సేవించినట్లు (పాజిటివ్) నిర్ధారణ కావడం గమనార్హం.
ఈ కేసులో ఈగల్ టీమ్ పేర్కొన్న నిందితుల జాబితాలో రాజకీయ ప్రముఖులు , వీఐపీలు ఉండటం సంచలనంగా మారింది. నిందితులుగా పైలట్ రోహిత్ రెడ్డి, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్, నమిత్ శర్మ, పంజుగుల రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, నల్లపనేని విజయకృష్ణ , శ్రవణ్ కుమార్లను పోలీసులు గుర్తించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు ఇలాంటి కేసుల్లో పట్టుబడటంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ప్రస్తుతం నిందితులపై నార్కోటిక్ చట్టంతో పాటు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించి కాల్పులు జరిపినందుకు గాను ఆయుధ చట్టం (Arms Act) కింద కూడా కేసులు నమోదు చేసి తదుపరి విచారణను వేగవంతం చేశారు.
తాజావార్తలు
-
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
-
MK Stalin: ‘డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. విజయ్పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!