Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఈగల్ టీం కీలక ప్రకటన..
- ఫామ్ హౌస్పై దాడి సమయంలో కాల్పులు
- 11 మంది పట్టుబాటు.. ఐదుగురికి డ్రగ్స్ పాజిటివ్
- డ్రగ్ నెట్వర్క్పై ఈగల్ టీం దర్యాప్తు
- రాజకీయ ప్రముఖుల పేర్లు వెలుగులోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగిన సంచలన డ్రగ్స్ పార్టీ , కాల్పుల ఘటనపై దర్యాప్తు సంస్థ ‘ఈగల్ టీమ్’ కీలక వివరాలను వెల్లడించింది. నిన్న రాత్రి పక్కా సమాచారంతో ఫామ్ హౌస్ను చుట్టుముట్టిన సమయంలో నిందితులు పోలీసులనే ఎదురించే ప్రయత్నం చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈగల్ టీమ్ వెల్లడించిన కథనం ప్రకారం, పోలీసులు ఫామ్ హౌస్ను ముట్టడించిన సమయంలో లోపలి నుంచి పోలీసుల వైపు కాల్పులు జరిగాయి. ఈ గగుర్పునొడిచే పరిణామాల మధ్య ఏమాత్రం వెనక్కి తగ్గని పోలీసులు, వెంటనే లోపలికి ప్రవేశించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాలిలోకి కాల్పులు జరిపి హంగామా సృష్టించిన నమిత్ శర్మ అనే వ్యక్తిని పోలీసులు గుర్తించి వెంటనే అరెస్టు చేశారు.
IPL 2026: కేకేఆర్ కెప్టెన్గా మళ్లీ అతనే.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న షారుక్ ఖాన్ టీమ్!
Also Read
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
ఈ సోదాల సమయంలో ఫామ్ హౌస్లో ఒక మహిళతో సహా మొత్తం 11 మంది మద్యం సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో అనుమానాస్పద నార్కోటిక్ పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా నిందితుల్లో ఒకరైన శరత్ కుమార్ వద్ద 0.26 గ్రాముల కొకైన్ లభించగా, ఈ డ్రగ్స్ను తాను కౌశిక్ రవి ద్వారా తెప్పించుకున్నట్లు అతను నేరాన్ని అంగీకరించడంతో ఈ డ్రగ్ నెట్వర్క్ గుట్టు వెలుగులోకి వచ్చింది. పట్టుబడిన 11 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, వారిలో ఐదుగురికి డ్రగ్స్ సేవించినట్లు (పాజిటివ్) నిర్ధారణ కావడం గమనార్హం.
ఈ కేసులో ఈగల్ టీమ్ పేర్కొన్న నిందితుల జాబితాలో రాజకీయ ప్రముఖులు , వీఐపీలు ఉండటం సంచలనంగా మారింది. నిందితులుగా పైలట్ రోహిత్ రెడ్డి, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్, నమిత్ శర్మ, పంజుగుల రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, నల్లపనేని విజయకృష్ణ , శ్రవణ్ కుమార్లను పోలీసులు గుర్తించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు ఇలాంటి కేసుల్లో పట్టుబడటంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ప్రస్తుతం నిందితులపై నార్కోటిక్ చట్టంతో పాటు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించి కాల్పులు జరిపినందుకు గాను ఆయుధ చట్టం (Arms Act) కింద కూడా కేసులు నమోదు చేసి తదుపరి విచారణను వేగవంతం చేశారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!