పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజే లోక్సభ అట్టుడికిపోయింది. వ్యవసాయ సాగు చట్టాల రద్దు బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టగా… వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టాలని, ప్రశ్నోత్తరాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విపక్షాల ఎంపీలు పట్టుబట్టారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే సభలో విపక్షాల ఎంపీలు నిరసనలు తెలుపుతుండగానే సాగుచట్టాల రద్దు బిల్లును కేంద్రమంత్రి తోమర్ ప్రవేశపెట్టగా.. ఈ బిల్లుపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే ఈ వినతిని తోసిపుచ్చిన లోక్సభ…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ పదవీ కాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు నెలల కిందట ఏపీ సీఎస్గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ వాస్తవానికి ఈనెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే సీఎస్ సమీర్ శర్మ పదవీ కాలాన్ని పొడిగించాలంటూ నవంబర్ తొలివారంలో సీఎం జగన్ కార్యాలయం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. Read Also: అనాధ…
పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై టీఆర్ఎస్ ఎంపీలకు ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎంపీలో మాట్లాడుతూ.. రాష్ర్టానికి రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలపై కేంద్రం పై ఒత్తిడితీసుకురావాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలని చెప్పారు. కనీస మద్ధతు ధర చట్టం, విద్యుత్ చట్టాల రద్దు కోసం పోరాడాలన్నారు. కృష్ణ జలాల్లో రాష్ర్ట వాటాకోసం పట్టుబట్టాలని సూచించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు అన్నింటిపై…
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారికి కూడా ఈ వేరియంట్ సోకుతోందని వార్తలు వస్తున్నాయి. కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఈరోజు ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. కొత్త వేరియంట్పై అప్రమత్తంగా ఉండాలని ఈ సమావేశంలో ప్రధాని మోదీ సూచించారు. భారత్పై ఈ వేరియంట్ ప్రభావం ఎలా ఉంటుందనే విషయంపై అధికారులతో మోదీ చర్చించారు. Read…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. చర్చిలకు ఎంపీ లాడ్స్ నిధుల ఖర్చుపై నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. సీఎస్, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శికి ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం లేఖలు పంపించింది. పీఎంవోకు ఇవ్వాల్సి ఉన్నందున తక్షణమే నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సూచించింది. Read Also: రెండు దశాబ్దాలుగా నరసరావుపేటలో టీడీపీ డల్..! గతంలోనే ఎంపీ లాడ్స్ నిధుల దుర్వినియోగంపై ఏపీ సర్కారు…
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన రైతులు ఆందోళనలు ఆపేలా లేరు. తమ డిమండ్లనున నేరవేర్చే వరకు ఇంటికి వెళ్లబోమని కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. రైతు చట్టాలను రద్దు చేసింనదుకు హర్షం వ్యక్తం చేసినా… తమ డిమాండ్లు పరిష్కరించాల్సిందేనని వారు అంటున్నారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి నవంబర్ 26తో ఏడాది పూర్తి కానున్న తరుణంలో నవంబర్ 29న 300మంది రైతులతో కలిసి 30 ట్రాక్టర్లలో ర్యాలీగా ఢిల్లీకి చేరుకుంటారని బీకేయూ…
ఢిల్లీలో వాయు కాలుష్యం సమస్యపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. పొల్యూషన్ తగ్గినా.. కేసు మూసివేసేది లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వాలు ఏమీ చేయకపోడంతోనే కోర్టులు జోక్యం చేసుకో వాల్సిన అవసరం వస్తుందనే అంచనాలు ప్రజల్లో ఉన్నాయని, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. కోర్టు తీసుకున్న కొన్ని చర్యల వల్ల 40 శాతం కాలుష్యం తగ్గిందని కొన్ని వార్తాపత్రికలు పేర్కొన్నాయని చెబుతున్నారని, అవి సరైవనో కాదోతెలియదని సొలిసీటర్ జనరల్తో పేర్కొన్నారు. ఈ…
రాష్ర్టంలో గత కొన్ని రోజులుగా ధాన్యం కొనుగోలు, యాసంగి వరి పంటపైన తీవ్ర చర్చ జరుగుతుంది. అసలు వరిపంట కొనుగోలుపై ఎప్పుడు రానీ కష్టం.. ఇప్పుడేందుకు వచ్చింది. ఈ విషయం పై ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షాన్ని విమర్శిస్తుంటే, అధికార టీఆర్ఎస్ మాత్రం నెపాన్ని కేంద్రం మీద తోస్తుంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. దీనిపై రాజకీయాలు ఎలా ఉన్న చివరికి నష్ట పోయేది మాత్రం సగటు రైతన్నలే.. కేంద్రం దీనిపై ఏం చెబుతుంది…
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని పేదలకు ఉచితంగా అందిస్తున్న 5 కిలోల ఉచిత రేషన్ పంపిణీని వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. కరోనా లాక్డౌన్ అనంతరం పేద ప్రజలకు సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా ప్రతి నెల 5 కిలోల బియ్యం, కిలో గోధుమలను ఉచితంగా అందిస్తోంది. కరోనా సెకండ్…
కేసీఆర్కు కేంద్ర ప్రభుత్వం ఢీల్లో కేంద్రమంత్రులు, ప్రధానిని కలి సేందుకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించిదని ఇది యావత్ తెలంగాణ ప్రజలను అవమానించడమేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ర్టానికి ధాన్యం కొనుగోలు విష యంలో స్పష్టత ఉందని, కేంద్రం మాత్రం ఇంతవరకు స్పష్టత ఇవ్వ డం లేదని ఆయన మండిపడ్డారు. యాసంగికి ఎన్ని సన్న వడ్లు కొం టారు, ఎన్ని దొడ్డు వడ్లు కొంటారో చెప్పాలని…