ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచాన్ని కోవిడ్ కొత్త వేరింయట్ ఒమిక్రాన్ వణికిస్తుంది. ఇప్పుడిప్పుడే అన్ని సాధారణ స్థితికి వస్తున్న వేళ కొత్త వేరింయట్తో ఆయా దేశాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఊహించని విధంగా ఒమిక్రాన్ వ్యాపిస్తుంది. దాని లక్షణాలు తెలుసుకునే లోపే అది ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని తట్టుకుని వ్యాపిస్తున్నట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇతర దేశాల నుంచి భారత్ లోకి వచ్చినవారికి కోవిడ్ టెస్టులు చేయడంతో పాటు వారికి 14 రోజులు క్వారంటైన్ విధిస్తున్నారు. ఇప్పటికే ఎట్ రిస్క్ దేశాలను నుంచి వచ్చే వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ఎయిర్ పోర్టు సిబ్బంది తెలిపారు. డెల్టా వేరింయంట్ కన్నా ఇది 30 రేట్లు వేగంగా వ్యాపిస్తుంది. ఇప్పటికే పలు దేశాలు అంతర్జాతీయ సరిహద్దులను మూసివేశాయి. ఇజ్రాయిల్, మొరాకో ఏకంగా సరిహద్దులనే మూసివేశాయి. ప్రపంచ వ్యాప్తంగా 159కి పైగా ఒమిక్రాన్ కేసులు. భయంతో టీకా కేంద్రాలకు పోటేత్తుతున్న అమెరికా వాసులు.
నెదర్లాండ్లో ఒక్కరోజే 13కుపైగా ఒమిక్రాన్ కేసులు నమోదుఅయ్యాయి. సౌతాఫ్రికాలో ఇప్పటి వరకు 107 కేసులు నమోదు అయ్యాయి. సౌతాఫ్రికా నుంచి విమాన రాకపోకలు రాకుండా 18 దేశాలు ఆంక్షలు విధించాయి. ఒమిక్రాన్ వేరింయంట్పై కేంద్రం కేబినేట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. మహారాష్ర్ట లో సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. శాంపిల్స్ను జీనోమ్ స్వీక్వెన్స్ ల్యాబ్కు పంపించినట్టు ఎయిర్పోర్టు సిబ్బంది తెలిపింది. మన దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ పై అవగాహన కల్పిస్తున్న ఇప్పటికి వ్యాక్సిన్ తీసుకోని వారు ఉన్నారు. ఒకటో డోసు తీసుకుని రెండో డోసు తీసుకుని వారు ఇంకా ఉన్నారు. దీంతో కేంద్రం అప్రమత్తం అయింది. ప్రయాణికులకు ఎయిర్ పోర్టులోనే ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరపాలని కేంద్రం రాష్ర్ట ప్రభుత్వాలకు సూచించింది.
Also Read
- US-Iran Tensions: ఇరాన్ చర్చలకు రాకపోతే భారీ దాడి.. ట్రంప్ వార్నింగ్తో మళ్లీ టెన్షన్..
- Trump Tariffs: మళ్లీ షాకిచ్చిన ట్రంప్.. భారత్ సహా 17 దేశాలపై అమెరికా అదనపు సుంకం..
- Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
- Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
ఒమిక్రాన్ కేసులు ఇప్పటి వరకు మన రాష్ర్టంలో ఇంకా నమోదు కాలేదని గాంధీ డిప్యూటీ సూపరిన్డెంట్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త వేరింయట్ సింట్రమ్స్లో తేడాలు ఉన్నాయి. కాఫ్, కోల్డ్ లేదు. కానీ వెంటనే వీక్నెస్ అవుతున్నారు. అని ఆయన చెప్పారు. మన రాష్ర్టంలోకి వచ్చే వారిని వెంటనే కోవిడ్ టెస్టులు చేయాలనిచెప్పారు. రోగ నిరోధక శక్తిని కూడా ఈ కొత్త వేరింయంట్ ఎదుర్కొంటుంది. దీంతో బూస్టర్ డోస్లు వేయాలన్నా ప్రతిపాదన వస్తుంది. పెద్దగా భయపడాల్సిన పని లేదని ప్రజలు ఎవ్వరికి వారు అప్రమత్తంగా ఉండాలని గాంధీ డిప్యూటీ సూపరిన్డెంట్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer Trolls: గెలిచినా శ్రేయస్పై విమర్శలు.. ప్లేయింగ్ ఎలెవన్ ఎంపికపై ప్రశ్నలు!
-
Nara Lokesh: గిరిజన ప్రాంతాలకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాదిలోగా పాఠశాలలకు సొంత భవనాలు
-
Asian Games 2026 Schedule: ఆసియా క్రీడల క్రికెట్ షెడ్యూల్ విడుదల.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు ఒక్కటే ఛాన్స్!
-
Abhijeet Dipke: వాంగ్చుక్ దీక్ష విరమించినా తగ్గేదేలే.. కేంద్రానికి అభిజీత్ దిప్కే వార్నింగ్..
-
Honda ADV 160: మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ స్కూటర్.. హోండా ADV 160తో సహా 10 టూవీలర్ల ఆవిష్కరణ..
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!