బీజేపీ ప్రభుత్వం ఏం ఉద్ధరించింది: కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కేబినేట్ భేటిలో వరి ధాన్యం అంశంపై చర్చించిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంప్రభుత్వం రాష్ర్ట బీజేపీ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఏడేళ్లలో బీజేపీ ప్రభుత్వం ఏం ఉద్ధరించిందో చెప్పాలన్నారు. బీజేపీ హయాంలో రెండేళ్లలో భయంకరంగా పేదరికం పెరిగింది. రైతులు బాగుపడాలంటే బీజేపీని పారద్రోలాలని అన్నారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలకు ఏం చేసిందో చెప్పాలన్నారు. రైతుల మెడ మీద కత్తిపెట్టి బోర్ల దగ్గర మీటర్ పెట్టాలని ఒత్తిడి చేస్తుంది. బీజేపీ పాలన కంటే కోటి రెట్లు తెలంగాణకు మంచి పాలన అందిస్తున్నామన్నారు. కిషన్రెడ్డి, పీయూష్ గోయల్ ఇవాళ సిగ్గుపడాలి. కరెంట్ మీద పెత్తనం అంతా కేంద్రం తీసుకుంటుందటా ఇదేక్కడి కథ అంటూ కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు.
హంగర్ ఇండెక్స్లో నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ కంటే దారుణంగా భారత్ పరిస్థితి ఉంది. కేంద్రం చేతులేత్తేసింది కాబట్టి వేసవిలో రైతు కొనుగోలు కేంద్రాలు ఉండవు. ధాన్యం ఎంత కొంటారో చెప్పకుండా హుజురాబాద్, దుబ్బాక అంటూ బీజేపీ రాజకీయం చేస్తుందన్నారు. రాష్ర్టం ఇప్పటికే పదివేల కోట్లు నష్టపోయింది. బీజేపీ దివాళ కోరు రాజకీయాలకు తెర తీసిందని ఇదో దద్దమ్మ కేంద్ర ప్రభుత్వం అని విమర్శించారు. పాలసీలు మార్చుకుని రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారన్నారు.
Also Read
- Hyderabad: యూట్యూబ్ చూసి ఇంట్లోనే వైన్ తయారీ.. వృద్ధుడి అక్రమ దందా బట్టబయలు
- Harish Rao: "త్వరలో భారీ పాదయాత్ర చేయబోతున్నా".. హరీష్ రావు సంచలన ప్రకటన..
- Bhatti Vikramarka: సింగరేణి బొగ్గు గనుల వివాదం.. కేంద్ర ప్రకటనలపై డిప్యూటీ సీఎం ఫైర్
- Kadiyam Srihari: "నేనేం తప్పు చేయలేదు".. మంత్రి కొండా సురేఖ లేఖపై స్పందించిన కడియం శ్రీహరి
బీజేపీ వాట్సాప్ యూనివర్సీటీలో పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తుందన్నారు. బీజేపీ దేశాన్ని అప్పుల పాలు చేసి, రైతులను మోసం చేస్తుందన్నారు. కిషన్రెడ్డి బహిరంగ చర్చకు వస్తావా అంటూ సవాల్ విసిరారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. బీజేపీ అన్ని చిల్లర మాటలు మాట్లాడుతుంది.15 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ ఒక్కటైనా ఉందా ఎక్కడ ఉంది బీజేపీ అని మండిపడ్డారు. కిషన్రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకుని, తెలంగాణ రైతులకు క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ పై సీఎం కేసీఆర్ తనదైన శైలిలో విమర్శించారు.
తాజావార్తలు
-
Bengaluru: రోడ్డుపై నాగుపాము, ట్రాఫిక్ జామ్.. బెంగళూర్ వీడియో వైరల్..
-
Tilak Varma: తిలక్ వర్మకు షాక్.. సంజూ శాంసన్కు గుడ్ న్యూస్..?
-
Swathi: తన సినిమా దర్శకుడిని సైలెంటుగా రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్
-
Tamil Nadu: మతం మారినా రిజర్వేషన్లు ఇవ్వాలి.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
-
NATO: ఇరాన్పై దాడులు సమర్థనీయమే.. ట్రంప్కు నాటో చీఫ్ మార్క్ రుట్టే మద్దతు
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..