బీజేపీ ప్రభుత్వం ఏం ఉద్ధరించింది: కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కేబినేట్ భేటిలో వరి ధాన్యం అంశంపై చర్చించిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంప్రభుత్వం రాష్ర్ట బీజేపీ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఏడేళ్లలో బీజేపీ ప్రభుత్వం ఏం ఉద్ధరించిందో చెప్పాలన్నారు. బీజేపీ హయాంలో రెండేళ్లలో భయంకరంగా పేదరికం పెరిగింది. రైతులు బాగుపడాలంటే బీజేపీని పారద్రోలాలని అన్నారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలకు ఏం చేసిందో చెప్పాలన్నారు. రైతుల మెడ మీద కత్తిపెట్టి బోర్ల దగ్గర మీటర్ పెట్టాలని ఒత్తిడి చేస్తుంది. బీజేపీ పాలన కంటే కోటి రెట్లు తెలంగాణకు మంచి పాలన అందిస్తున్నామన్నారు. కిషన్రెడ్డి, పీయూష్ గోయల్ ఇవాళ సిగ్గుపడాలి. కరెంట్ మీద పెత్తనం అంతా కేంద్రం తీసుకుంటుందటా ఇదేక్కడి కథ అంటూ కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు.
హంగర్ ఇండెక్స్లో నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ కంటే దారుణంగా భారత్ పరిస్థితి ఉంది. కేంద్రం చేతులేత్తేసింది కాబట్టి వేసవిలో రైతు కొనుగోలు కేంద్రాలు ఉండవు. ధాన్యం ఎంత కొంటారో చెప్పకుండా హుజురాబాద్, దుబ్బాక అంటూ బీజేపీ రాజకీయం చేస్తుందన్నారు. రాష్ర్టం ఇప్పటికే పదివేల కోట్లు నష్టపోయింది. బీజేపీ దివాళ కోరు రాజకీయాలకు తెర తీసిందని ఇదో దద్దమ్మ కేంద్ర ప్రభుత్వం అని విమర్శించారు. పాలసీలు మార్చుకుని రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారన్నారు.
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
బీజేపీ వాట్సాప్ యూనివర్సీటీలో పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తుందన్నారు. బీజేపీ దేశాన్ని అప్పుల పాలు చేసి, రైతులను మోసం చేస్తుందన్నారు. కిషన్రెడ్డి బహిరంగ చర్చకు వస్తావా అంటూ సవాల్ విసిరారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. బీజేపీ అన్ని చిల్లర మాటలు మాట్లాడుతుంది.15 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ ఒక్కటైనా ఉందా ఎక్కడ ఉంది బీజేపీ అని మండిపడ్డారు. కిషన్రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకుని, తెలంగాణ రైతులకు క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ పై సీఎం కేసీఆర్ తనదైన శైలిలో విమర్శించారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!