కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదని, కొవిడ్ కేసులపై నిఘా ఉంచాలని కేంద్రం 8 రాష్ట్రాలను కోరింది. డైలీ పాజిటివిటీ రేటు పెరుగుతున్న నేపథ్యంలో గమనించాలని కేంద్రం కోరింది.
బీజేపీ హఠావో-దేశ్ కీ బచావో అనే నినాదంతో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాచైతన్య యాత్ర నిర్వహిస్తోంది. చేర్యాల, కొమురవెళ్లి మండలాల్లో నిర్వహిస్తున్న ప్రజా చైతన్యయాత్రలో జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
IAS, IPS Transfers : తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఐపీఎస్, ఐఏఎస్ బదిలీల అంశంలో కేంద్రం తెలంగాణ హైకోర్టుకు సూచన చేసింది. ఐపీఎస్, ఐఏఎస్ బదిలీల విచారణను అత్యవసరంగా చేపట్టాలని కోర్టును కేంద్రం కోరింది.
ట్విటర్లో కొన్ని ఖాతాలను బ్లాక్ చేయడానికి గల కారణాలను ఎందుకు చెప్పలేదని కర్ణాటక హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MEITY) వివిధ ఉపసంహరణ ఉత్తర్వులను సవాలు చేస్తూ ట్విట్టర్ ద్వారా దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తున్న జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్ ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది.
PAN And Aadhaar Link: కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డ్, ఆధార్ కార్డు లింకును పొడగించింది. మార్చి 31 వరకు పాన్, ఆధార్ లింక్ చేయాలని గతంలో కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దాన్ని జూన్ 30 వరకు పొగడించారు. ఇప్పటికే చాలాసార్లు కేంద్ర ఈ గడువును పొడగించింది. అయితే ఈ సారి గడువు ఉండదని ప్రకటించినప్పటికీ.. మరోసారి గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Aadhaar Bank Account Link : కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జనవరి 30న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒక సర్క్యులర్ను జారీ చేసింది.
దేశంలో మళ్లీ కరోనా కలకలం రేగింది. కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రతిరోజు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.
Central Funds: కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన నిధులకు సంబంధించిన వివరాలను శాసన మండలిలో ప్రకటించారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి.. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధుల వివరాలను మండలిలో ప్రస్తావించారు.. 2023-24 వార్షిక బడ్జెట్ లో భాగంగా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.41,338 కోట్ల కేటాయింపులు వచ్చాయని వెల్లడించారు. 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదించిన ప్రకారం, స్థానిక సంస్థలకు సంబంధించి రూ.8,077 కోట్లు కేటాయింపులు వచ్చాయని.. అయితే, కేంద్రం నుంచి…