Atal Pension Yojana : అటల్ పెన్షన్ యోజన రికార్డ్.. 5 కోట్లు దాటిన సభ్యుల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atal Pension Yojana : ప్రధాని మోదీ ప్రభుత్వ ప్రవేశ పెట్టిన ప్రతిష్టాత్మక పథకాల్లో ఒకటైన అటల్ పెన్షన్ యోజన చందాదారుల సంఖ్య 5 కోట్లు దాటింది. అదే సమయంలో ఈ పథకం టర్నోవర్ మొత్తం 28 వేల కోట్ల రూపాయలను దాటింది. కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన కింద అర్హులైన వ్యక్తికి పెన్షన్ ఇవ్వబడుతుంది. ఇది సామాజిక భద్రతా కార్యక్రమం. దీని ద్వారా ప్రజలు వృద్ధాప్యంలో పెన్షన్ ప్రయోజనం పొందుతారు. ఈ పథకం ఇటీవలే 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు ఈ పథకం కింద మొత్తం 5.25 కోట్ల మంది సబ్స్క్రైబర్లు చేరారు.
Read Also:Kondagattu: కొండగట్టులో అంజన్న ఉత్సవాలు.. భద్రాద్రి నుంచి పట్టువస్త్రాలు
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
ఈ పథకాన్ని 2015 సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. దేశంలోని ప్రతి సీనియర్ సిటిజన్ స్థిర పెన్షన్ ప్రయోజనం పొందాలనేది APY లక్ష్యం. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారి కోసమే ప్రత్యేకంగా ఈ పథకం రూపొందించబడింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో, గతేడాదితో పోలీస్తే కొత్త చందాదారుల సంఖ్య 20 శాతం పెరిగింది. దీనితో పాటు ఈ పథకం నుండి ఇప్పటివరకు పెట్టుబడిదారులు 8.92 శాతం రాబడిని పొందారు. ఈ పథకం కింద నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు రూ.28,434 కోట్లకు చేరుకున్నాయి.
Read Also:Passport : పాస్ పోర్ట్ ఆన్ లైన్లో ఈజీగా దరఖాస్తు చేసుకోండి.. ఎలా అంటే ?
దేశంలోని పేద, బలహీన వర్గాలకు పెన్షన్ ప్రయోజనాలను అందించడంలో అటల్ పెన్షన్ యోజన సహాయపడుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. దీని కోసం మీరు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను కలిగి ఉండాలి. పన్ను చెల్లింపుదారుగా ఉండకూడదు. అటల్ పెన్షన్ యోజన సబ్స్క్రైబర్లు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలవారీ పెన్షన్ను రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు పొందుతారు. ఈ మొత్తం మీ పెట్టుబడి ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఇది ప్రభుత్వ మద్దతు కలిగిన పెన్షన్ పథకం, దీని కోసం మీరు పొదుపు ఖాతా, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ కలిగి ఉండాలి. మీరు ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఈ ఖాతాను తెరవవచ్చు.
తాజావార్తలు
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!