Atal Pension Yojana : అటల్ పెన్షన్ యోజన రికార్డ్.. 5 కోట్లు దాటిన సభ్యుల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atal Pension Yojana : ప్రధాని మోదీ ప్రభుత్వ ప్రవేశ పెట్టిన ప్రతిష్టాత్మక పథకాల్లో ఒకటైన అటల్ పెన్షన్ యోజన చందాదారుల సంఖ్య 5 కోట్లు దాటింది. అదే సమయంలో ఈ పథకం టర్నోవర్ మొత్తం 28 వేల కోట్ల రూపాయలను దాటింది. కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన కింద అర్హులైన వ్యక్తికి పెన్షన్ ఇవ్వబడుతుంది. ఇది సామాజిక భద్రతా కార్యక్రమం. దీని ద్వారా ప్రజలు వృద్ధాప్యంలో పెన్షన్ ప్రయోజనం పొందుతారు. ఈ పథకం ఇటీవలే 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు ఈ పథకం కింద మొత్తం 5.25 కోట్ల మంది సబ్స్క్రైబర్లు చేరారు.
Read Also:Kondagattu: కొండగట్టులో అంజన్న ఉత్సవాలు.. భద్రాద్రి నుంచి పట్టువస్త్రాలు
Also Read
ఈ పథకాన్ని 2015 సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. దేశంలోని ప్రతి సీనియర్ సిటిజన్ స్థిర పెన్షన్ ప్రయోజనం పొందాలనేది APY లక్ష్యం. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారి కోసమే ప్రత్యేకంగా ఈ పథకం రూపొందించబడింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో, గతేడాదితో పోలీస్తే కొత్త చందాదారుల సంఖ్య 20 శాతం పెరిగింది. దీనితో పాటు ఈ పథకం నుండి ఇప్పటివరకు పెట్టుబడిదారులు 8.92 శాతం రాబడిని పొందారు. ఈ పథకం కింద నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు రూ.28,434 కోట్లకు చేరుకున్నాయి.
Read Also:Passport : పాస్ పోర్ట్ ఆన్ లైన్లో ఈజీగా దరఖాస్తు చేసుకోండి.. ఎలా అంటే ?
దేశంలోని పేద, బలహీన వర్గాలకు పెన్షన్ ప్రయోజనాలను అందించడంలో అటల్ పెన్షన్ యోజన సహాయపడుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. దీని కోసం మీరు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను కలిగి ఉండాలి. పన్ను చెల్లింపుదారుగా ఉండకూడదు. అటల్ పెన్షన్ యోజన సబ్స్క్రైబర్లు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలవారీ పెన్షన్ను రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు పొందుతారు. ఈ మొత్తం మీ పెట్టుబడి ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఇది ప్రభుత్వ మద్దతు కలిగిన పెన్షన్ పథకం, దీని కోసం మీరు పొదుపు ఖాతా, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ కలిగి ఉండాలి. మీరు ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఈ ఖాతాను తెరవవచ్చు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!