Atal Pension Yojana : అటల్ పెన్షన్ యోజన రికార్డ్.. 5 కోట్లు దాటిన సభ్యుల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atal Pension Yojana : ప్రధాని మోదీ ప్రభుత్వ ప్రవేశ పెట్టిన ప్రతిష్టాత్మక పథకాల్లో ఒకటైన అటల్ పెన్షన్ యోజన చందాదారుల సంఖ్య 5 కోట్లు దాటింది. అదే సమయంలో ఈ పథకం టర్నోవర్ మొత్తం 28 వేల కోట్ల రూపాయలను దాటింది. కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన కింద అర్హులైన వ్యక్తికి పెన్షన్ ఇవ్వబడుతుంది. ఇది సామాజిక భద్రతా కార్యక్రమం. దీని ద్వారా ప్రజలు వృద్ధాప్యంలో పెన్షన్ ప్రయోజనం పొందుతారు. ఈ పథకం ఇటీవలే 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు ఈ పథకం కింద మొత్తం 5.25 కోట్ల మంది సబ్స్క్రైబర్లు చేరారు.
Read Also:Kondagattu: కొండగట్టులో అంజన్న ఉత్సవాలు.. భద్రాద్రి నుంచి పట్టువస్త్రాలు
Also Read
- Vaibhav Parents: ‘అతడిని అలా వదిలేయకండమ్మా’.. వైభవ్ సూర్యవంశీ తల్లిదండ్రులకు రిక్వెస్ట్..
- Gaza War: గాజాను స్వాధీనం చేసుకోండి.. సైన్యానికి నెతన్యాహూ ఆదేశం..
- Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ అద్భుతమని ట్వీట్ చేసిన సచిన్ టెండూల్కర్.. సూర్యవంశీ రిప్లై వైరల్..
- US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
ఈ పథకాన్ని 2015 సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. దేశంలోని ప్రతి సీనియర్ సిటిజన్ స్థిర పెన్షన్ ప్రయోజనం పొందాలనేది APY లక్ష్యం. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారి కోసమే ప్రత్యేకంగా ఈ పథకం రూపొందించబడింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో, గతేడాదితో పోలీస్తే కొత్త చందాదారుల సంఖ్య 20 శాతం పెరిగింది. దీనితో పాటు ఈ పథకం నుండి ఇప్పటివరకు పెట్టుబడిదారులు 8.92 శాతం రాబడిని పొందారు. ఈ పథకం కింద నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు రూ.28,434 కోట్లకు చేరుకున్నాయి.
Read Also:Passport : పాస్ పోర్ట్ ఆన్ లైన్లో ఈజీగా దరఖాస్తు చేసుకోండి.. ఎలా అంటే ?
దేశంలోని పేద, బలహీన వర్గాలకు పెన్షన్ ప్రయోజనాలను అందించడంలో అటల్ పెన్షన్ యోజన సహాయపడుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. దీని కోసం మీరు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను కలిగి ఉండాలి. పన్ను చెల్లింపుదారుగా ఉండకూడదు. అటల్ పెన్షన్ యోజన సబ్స్క్రైబర్లు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలవారీ పెన్షన్ను రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు పొందుతారు. ఈ మొత్తం మీ పెట్టుబడి ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఇది ప్రభుత్వ మద్దతు కలిగిన పెన్షన్ పథకం, దీని కోసం మీరు పొదుపు ఖాతా, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ కలిగి ఉండాలి. మీరు ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఈ ఖాతాను తెరవవచ్చు.
తాజావార్తలు
-
Vaibhav Parents: ‘అతడిని అలా వదిలేయకండమ్మా’.. వైభవ్ సూర్యవంశీ తల్లిదండ్రులకు రిక్వెస్ట్..
-
Health Tips : గ్యాస్, ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్నారా? ఇంటి చిట్కాలను ఇలా ఒక సారి ట్రై చెయ్యండి.!
-
Gaza War: గాజాను స్వాధీనం చేసుకోండి.. సైన్యానికి నెతన్యాహూ ఆదేశం..
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ అద్భుతమని ట్వీట్ చేసిన సచిన్ టెండూల్కర్.. సూర్యవంశీ రిప్లై వైరల్..
-
US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
ట్రెండింగ్
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!