Covid-19: తస్మాత్ జాగ్రత్త!.. మహమ్మారి ఇంకా ముగియలేదు.. ఆ రాష్ట్రాలకు కేంద్రం సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Centre Asks 8 States To Keep Eye On Covid Cases: కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదని, కొవిడ్ కేసులపై నిఘా ఉంచాలని కేంద్రం 8 రాష్ట్రాలను కోరింది. డైలీ పాజిటివిటీ రేటు పెరుగుతున్న నేపథ్యంలో గమనించాలని కేంద్రం కోరింది. మహమ్మారి ఇంకా ముగియలేదని, ఏ స్థాయిలోనైనా అలసత్వం వహించకుండా జాగ్రత్తగా ఉండాలని, అలసత్వం వహిస్తే మళ్లీ కరోనా విజృంభించే ప్రమాదం పొంచి ఉందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఎనిమిది రాష్ట్రాలకు రాసిన లేఖలో తెలిపారు. కొవిడ్ కారణంగా ఆసుపత్రిలో చేరే రేటు, మరణాలు తక్కువగా ఉన్నప్పటికీ, రాష్ట్రాలు, జిల్లాలు అధిక సంఖ్యలో కేసులను నివేదించడం వ్యాప్తిని సూచిస్తుందని రాజేష్ భూషణ్ అన్నారు.
అవసరమైన ప్రజారోగ్య చర్యలను తక్షణమే ప్రారంభించాలని.. ఈ రాష్ట్రాలు, జిల్లాలు కరోనాపై దృష్టి కేంద్రీకరించాలని 8 రాష్ట్రాలకు లేఖ రాశారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, హర్యానా, ఢిల్లీ అనే ఎనిమిది రాష్ట్రాలు లేఖను అందుకున్నాయి. ఈ రాష్ట్రాల్లో 10 శాతం కంటే ఎక్కువగా పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల సంఖ్య యూపీ (1), తమిళనాడు (11), రాజస్థాన్ (6), మహారాష్ట్ర (8), కేరళ (14), హర్యానా (12), ఢిల్లీ (11) .
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Read Also: Pet Dog: కుక్క యజమాని బొటనవేలును కొరికేసింది.. అదే అతడికి వరమైంది!
అన్ని జిల్లాల్లో కొవిడ్ నిఘాను పటిష్టం చేయాలని, ఇన్ఫ్లుఎంజా లాంటి అనారోగ్యం (ILI), తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ (SARI) కేసుల పోకడలను పర్యవేక్షించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. ఇన్సాకాగ్ నెట్వర్క్ ఆఫ్ లాబొరేటరీల ద్వారా మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపబడిన సానుకూల నమూనాల సంఖ్యను పెంచాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. కొత్త లక్షణాలు కనిపిస్తే ఇన్సాకాగ్ ద్వారా పరీక్షించాలన్నారు. దేశంలో 24 గంటల్లో 11,692 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి, అయితే యాక్టివ్ కేసులు 66,170కి పెరిగాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇవాళ తెలిపింది. దేశ రాజధానిలో కొవిడ్ కేసులు స్థిరంగా ఉన్నాయని, రాబోయే రోజుల్లో తగ్గే అవకాశం ఉందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!