Covid-19: తస్మాత్ జాగ్రత్త!.. మహమ్మారి ఇంకా ముగియలేదు.. ఆ రాష్ట్రాలకు కేంద్రం సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Centre Asks 8 States To Keep Eye On Covid Cases: కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదని, కొవిడ్ కేసులపై నిఘా ఉంచాలని కేంద్రం 8 రాష్ట్రాలను కోరింది. డైలీ పాజిటివిటీ రేటు పెరుగుతున్న నేపథ్యంలో గమనించాలని కేంద్రం కోరింది. మహమ్మారి ఇంకా ముగియలేదని, ఏ స్థాయిలోనైనా అలసత్వం వహించకుండా జాగ్రత్తగా ఉండాలని, అలసత్వం వహిస్తే మళ్లీ కరోనా విజృంభించే ప్రమాదం పొంచి ఉందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఎనిమిది రాష్ట్రాలకు రాసిన లేఖలో తెలిపారు. కొవిడ్ కారణంగా ఆసుపత్రిలో చేరే రేటు, మరణాలు తక్కువగా ఉన్నప్పటికీ, రాష్ట్రాలు, జిల్లాలు అధిక సంఖ్యలో కేసులను నివేదించడం వ్యాప్తిని సూచిస్తుందని రాజేష్ భూషణ్ అన్నారు.
అవసరమైన ప్రజారోగ్య చర్యలను తక్షణమే ప్రారంభించాలని.. ఈ రాష్ట్రాలు, జిల్లాలు కరోనాపై దృష్టి కేంద్రీకరించాలని 8 రాష్ట్రాలకు లేఖ రాశారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, హర్యానా, ఢిల్లీ అనే ఎనిమిది రాష్ట్రాలు లేఖను అందుకున్నాయి. ఈ రాష్ట్రాల్లో 10 శాతం కంటే ఎక్కువగా పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల సంఖ్య యూపీ (1), తమిళనాడు (11), రాజస్థాన్ (6), మహారాష్ట్ర (8), కేరళ (14), హర్యానా (12), ఢిల్లీ (11) .
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
Read Also: Pet Dog: కుక్క యజమాని బొటనవేలును కొరికేసింది.. అదే అతడికి వరమైంది!
అన్ని జిల్లాల్లో కొవిడ్ నిఘాను పటిష్టం చేయాలని, ఇన్ఫ్లుఎంజా లాంటి అనారోగ్యం (ILI), తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ (SARI) కేసుల పోకడలను పర్యవేక్షించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. ఇన్సాకాగ్ నెట్వర్క్ ఆఫ్ లాబొరేటరీల ద్వారా మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపబడిన సానుకూల నమూనాల సంఖ్యను పెంచాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. కొత్త లక్షణాలు కనిపిస్తే ఇన్సాకాగ్ ద్వారా పరీక్షించాలన్నారు. దేశంలో 24 గంటల్లో 11,692 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి, అయితే యాక్టివ్ కేసులు 66,170కి పెరిగాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇవాళ తెలిపింది. దేశ రాజధానిలో కొవిడ్ కేసులు స్థిరంగా ఉన్నాయని, రాబోయే రోజుల్లో తగ్గే అవకాశం ఉందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!