Covid-19: తస్మాత్ జాగ్రత్త!.. మహమ్మారి ఇంకా ముగియలేదు.. ఆ రాష్ట్రాలకు కేంద్రం సూచన
Centre Asks 8 States To Keep Eye On Covid Cases: కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదని, కొవిడ్ కేసులపై నిఘా ఉంచాలని కేంద్రం 8 రాష్ట్రాలను కోరింది. డైలీ పాజిటివిటీ రేటు పెరుగుతున్న నేపథ్యంలో గమనించాలని కేంద్రం కోరింది. మహమ్మారి ఇంకా ముగియలేదని, ఏ స్థాయిలోనైనా అలసత్వం వహించకుండా జాగ్రత్తగా ఉండాలని, అలసత్వం వహిస్తే మళ్లీ కరోనా విజృంభించే ప్రమాదం పొంచి ఉందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఎనిమిది రాష్ట్రాలకు రాసిన లేఖలో తెలిపారు. కొవిడ్ కారణంగా ఆసుపత్రిలో చేరే రేటు, మరణాలు తక్కువగా ఉన్నప్పటికీ, రాష్ట్రాలు, జిల్లాలు అధిక సంఖ్యలో కేసులను నివేదించడం వ్యాప్తిని సూచిస్తుందని రాజేష్ భూషణ్ అన్నారు.
అవసరమైన ప్రజారోగ్య చర్యలను తక్షణమే ప్రారంభించాలని.. ఈ రాష్ట్రాలు, జిల్లాలు కరోనాపై దృష్టి కేంద్రీకరించాలని 8 రాష్ట్రాలకు లేఖ రాశారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, హర్యానా, ఢిల్లీ అనే ఎనిమిది రాష్ట్రాలు లేఖను అందుకున్నాయి. ఈ రాష్ట్రాల్లో 10 శాతం కంటే ఎక్కువగా పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల సంఖ్య యూపీ (1), తమిళనాడు (11), రాజస్థాన్ (6), మహారాష్ట్ర (8), కేరళ (14), హర్యానా (12), ఢిల్లీ (11) .
Also Read
Read Also: Pet Dog: కుక్క యజమాని బొటనవేలును కొరికేసింది.. అదే అతడికి వరమైంది!
అన్ని జిల్లాల్లో కొవిడ్ నిఘాను పటిష్టం చేయాలని, ఇన్ఫ్లుఎంజా లాంటి అనారోగ్యం (ILI), తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ (SARI) కేసుల పోకడలను పర్యవేక్షించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. ఇన్సాకాగ్ నెట్వర్క్ ఆఫ్ లాబొరేటరీల ద్వారా మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపబడిన సానుకూల నమూనాల సంఖ్యను పెంచాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. కొత్త లక్షణాలు కనిపిస్తే ఇన్సాకాగ్ ద్వారా పరీక్షించాలన్నారు. దేశంలో 24 గంటల్లో 11,692 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి, అయితే యాక్టివ్ కేసులు 66,170కి పెరిగాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇవాళ తెలిపింది. దేశ రాజధానిలో కొవిడ్ కేసులు స్థిరంగా ఉన్నాయని, రాబోయే రోజుల్లో తగ్గే అవకాశం ఉందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!