Covid-19: తస్మాత్ జాగ్రత్త!.. మహమ్మారి ఇంకా ముగియలేదు.. ఆ రాష్ట్రాలకు కేంద్రం సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Centre Asks 8 States To Keep Eye On Covid Cases: కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదని, కొవిడ్ కేసులపై నిఘా ఉంచాలని కేంద్రం 8 రాష్ట్రాలను కోరింది. డైలీ పాజిటివిటీ రేటు పెరుగుతున్న నేపథ్యంలో గమనించాలని కేంద్రం కోరింది. మహమ్మారి ఇంకా ముగియలేదని, ఏ స్థాయిలోనైనా అలసత్వం వహించకుండా జాగ్రత్తగా ఉండాలని, అలసత్వం వహిస్తే మళ్లీ కరోనా విజృంభించే ప్రమాదం పొంచి ఉందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఎనిమిది రాష్ట్రాలకు రాసిన లేఖలో తెలిపారు. కొవిడ్ కారణంగా ఆసుపత్రిలో చేరే రేటు, మరణాలు తక్కువగా ఉన్నప్పటికీ, రాష్ట్రాలు, జిల్లాలు అధిక సంఖ్యలో కేసులను నివేదించడం వ్యాప్తిని సూచిస్తుందని రాజేష్ భూషణ్ అన్నారు.
అవసరమైన ప్రజారోగ్య చర్యలను తక్షణమే ప్రారంభించాలని.. ఈ రాష్ట్రాలు, జిల్లాలు కరోనాపై దృష్టి కేంద్రీకరించాలని 8 రాష్ట్రాలకు లేఖ రాశారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, హర్యానా, ఢిల్లీ అనే ఎనిమిది రాష్ట్రాలు లేఖను అందుకున్నాయి. ఈ రాష్ట్రాల్లో 10 శాతం కంటే ఎక్కువగా పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల సంఖ్య యూపీ (1), తమిళనాడు (11), రాజస్థాన్ (6), మహారాష్ట్ర (8), కేరళ (14), హర్యానా (12), ఢిల్లీ (11) .
Also Read
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
Read Also: Pet Dog: కుక్క యజమాని బొటనవేలును కొరికేసింది.. అదే అతడికి వరమైంది!
అన్ని జిల్లాల్లో కొవిడ్ నిఘాను పటిష్టం చేయాలని, ఇన్ఫ్లుఎంజా లాంటి అనారోగ్యం (ILI), తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ (SARI) కేసుల పోకడలను పర్యవేక్షించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. ఇన్సాకాగ్ నెట్వర్క్ ఆఫ్ లాబొరేటరీల ద్వారా మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపబడిన సానుకూల నమూనాల సంఖ్యను పెంచాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. కొత్త లక్షణాలు కనిపిస్తే ఇన్సాకాగ్ ద్వారా పరీక్షించాలన్నారు. దేశంలో 24 గంటల్లో 11,692 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి, అయితే యాక్టివ్ కేసులు 66,170కి పెరిగాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇవాళ తెలిపింది. దేశ రాజధానిలో కొవిడ్ కేసులు స్థిరంగా ఉన్నాయని, రాబోయే రోజుల్లో తగ్గే అవకాశం ఉందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!