Covid-19: తస్మాత్ జాగ్రత్త!.. మహమ్మారి ఇంకా ముగియలేదు.. ఆ రాష్ట్రాలకు కేంద్రం సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Centre Asks 8 States To Keep Eye On Covid Cases: కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదని, కొవిడ్ కేసులపై నిఘా ఉంచాలని కేంద్రం 8 రాష్ట్రాలను కోరింది. డైలీ పాజిటివిటీ రేటు పెరుగుతున్న నేపథ్యంలో గమనించాలని కేంద్రం కోరింది. మహమ్మారి ఇంకా ముగియలేదని, ఏ స్థాయిలోనైనా అలసత్వం వహించకుండా జాగ్రత్తగా ఉండాలని, అలసత్వం వహిస్తే మళ్లీ కరోనా విజృంభించే ప్రమాదం పొంచి ఉందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఎనిమిది రాష్ట్రాలకు రాసిన లేఖలో తెలిపారు. కొవిడ్ కారణంగా ఆసుపత్రిలో చేరే రేటు, మరణాలు తక్కువగా ఉన్నప్పటికీ, రాష్ట్రాలు, జిల్లాలు అధిక సంఖ్యలో కేసులను నివేదించడం వ్యాప్తిని సూచిస్తుందని రాజేష్ భూషణ్ అన్నారు.
అవసరమైన ప్రజారోగ్య చర్యలను తక్షణమే ప్రారంభించాలని.. ఈ రాష్ట్రాలు, జిల్లాలు కరోనాపై దృష్టి కేంద్రీకరించాలని 8 రాష్ట్రాలకు లేఖ రాశారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, హర్యానా, ఢిల్లీ అనే ఎనిమిది రాష్ట్రాలు లేఖను అందుకున్నాయి. ఈ రాష్ట్రాల్లో 10 శాతం కంటే ఎక్కువగా పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల సంఖ్య యూపీ (1), తమిళనాడు (11), రాజస్థాన్ (6), మహారాష్ట్ర (8), కేరళ (14), హర్యానా (12), ఢిల్లీ (11) .
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
Read Also: Pet Dog: కుక్క యజమాని బొటనవేలును కొరికేసింది.. అదే అతడికి వరమైంది!
అన్ని జిల్లాల్లో కొవిడ్ నిఘాను పటిష్టం చేయాలని, ఇన్ఫ్లుఎంజా లాంటి అనారోగ్యం (ILI), తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ (SARI) కేసుల పోకడలను పర్యవేక్షించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. ఇన్సాకాగ్ నెట్వర్క్ ఆఫ్ లాబొరేటరీల ద్వారా మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపబడిన సానుకూల నమూనాల సంఖ్యను పెంచాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. కొత్త లక్షణాలు కనిపిస్తే ఇన్సాకాగ్ ద్వారా పరీక్షించాలన్నారు. దేశంలో 24 గంటల్లో 11,692 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి, అయితే యాక్టివ్ కేసులు 66,170కి పెరిగాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇవాళ తెలిపింది. దేశ రాజధానిలో కొవిడ్ కేసులు స్థిరంగా ఉన్నాయని, రాబోయే రోజుల్లో తగ్గే అవకాశం ఉందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!