Gidugu Rudra Raju : కేంద్ర, రాష్ట్ర సర్కార్ లపై ఏపీసీసీ చీఫ్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత నెల రోజులుగా దేశ వ్యాపితంగా జై భారత్ సత్యాగ్రహ సభలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించామని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. ఆదాని యొక్క అక్రమ ఆస్తులపై పార్లమెంట్ రాహుల్ గాంధీ ప్రసంగాలను లోక్ సభ రికార్డుల నుంచి తొలగించారు.. దేశ సమస్యలపై ప్రసంగాలని తొలగించిన పరిస్థితి చరిత్రలో ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు లేదని ఆయన అన్నారు. గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా రాహుల్ గాంధీ దేశంలోని అనేక సమస్యలపై మాట్లాడుతున్నారు..
అనేక ప్రాంతాల్లో ముస్లింలను కించపరుస్తు దాడులు జరిగాయి.. క్రిస్టియన్ల సంస్థలపై దాడులు జరిగాయి.. అంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు.
Also Read : Salman Khan: సార్ మిమ్మల్ని ఎవరో మోసం చేశారు…
Also Read
- Story Board : అయోధ్య ఆలయంలో అసలేం జరిగింది..? రాముడి సాక్షిగా నిధులు దారిమళ్లాయా..?
- IPL Player: బిగ్షాక్.. మహిళతో శారీరక సంబంధం.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్పై పోలీస్ కేసు..
- Modi-Mammoott: మోడీని కలిసిన మమ్ముట్టి ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్
- Hardik And Yashasvi: KKR కెప్టెన్గా హార్దిక్ పాండ్యా..? ముంబయ్ ఇండియన్స్లోకి యశస్వి జైస్వాల్..?
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ప్రధానిగా ఉన్న జవహార్ లాల్ నేహ్రు నుంచి ఇతర ప్రధానులు ఎన్నో సంక్షేమ పధకాలు, ప్రాజెక్టులు తీసుకు వచ్చారు.. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్ర మోడీ ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టార అంటూ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాని రద్దు చేసి ఇంటిని ఖాళీ చేయించిన ఘటన భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తిని కదలించింది.. ఇది అత్యంత దురదృష్టకరమైన చర్య అంటూ రుద్రరాజు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. గాంధీ కుటుంబాని కావాలని టార్గెట్ చేసి సీబీఐతో దాడులు చేయించారు. ఫలితం లేకపోవటంతో రాహుల్ గాంధీ ఇంటిని సైతం ఖాళీ చేయించారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Rajastan : మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 12మంది చిన్నారులను కాపాడిన రెస్క్యూ టీం
రాష్ట్రంలో ముఖ్యమంత్రి సీఎం జగన్, ప్రతిపక్షంలో చంద్రబాబు, బీజేపీతో ఉన్న పవన్ కల్యాణ్ ప్రస్తుత పరిణామాలపై కనీసం స్పందించడం లేదని ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు విమర్శలు గుప్పించారు. రేపు గాంధీనగర్ లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తాం.. ఈ సభకు ముఖ్య అతిథిలుగా రంజిత రంజన్, క్రిస్టోఫర్ తిలక్, మయ్యపన్, జేడీ శీలం, కొప్పలరాజు, చింతామోహన్, పల్లంరాజు ఇతర అగ్రనేతలు హాజరవుతారు అని ఆయన వెల్లడించారు. రేపు జరగబోయే ఈ బహిరంగ సభ ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియపరుస్తామని ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!