Gidugu Rudra Raju : కేంద్ర, రాష్ట్ర సర్కార్ లపై ఏపీసీసీ చీఫ్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత నెల రోజులుగా దేశ వ్యాపితంగా జై భారత్ సత్యాగ్రహ సభలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించామని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. ఆదాని యొక్క అక్రమ ఆస్తులపై పార్లమెంట్ రాహుల్ గాంధీ ప్రసంగాలను లోక్ సభ రికార్డుల నుంచి తొలగించారు.. దేశ సమస్యలపై ప్రసంగాలని తొలగించిన పరిస్థితి చరిత్రలో ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు లేదని ఆయన అన్నారు. గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా రాహుల్ గాంధీ దేశంలోని అనేక సమస్యలపై మాట్లాడుతున్నారు..
అనేక ప్రాంతాల్లో ముస్లింలను కించపరుస్తు దాడులు జరిగాయి.. క్రిస్టియన్ల సంస్థలపై దాడులు జరిగాయి.. అంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు.
Also Read : Salman Khan: సార్ మిమ్మల్ని ఎవరో మోసం చేశారు…
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్లో BLA-TTP వరస దాడులు..
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ప్రధానిగా ఉన్న జవహార్ లాల్ నేహ్రు నుంచి ఇతర ప్రధానులు ఎన్నో సంక్షేమ పధకాలు, ప్రాజెక్టులు తీసుకు వచ్చారు.. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్ర మోడీ ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టార అంటూ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాని రద్దు చేసి ఇంటిని ఖాళీ చేయించిన ఘటన భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తిని కదలించింది.. ఇది అత్యంత దురదృష్టకరమైన చర్య అంటూ రుద్రరాజు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. గాంధీ కుటుంబాని కావాలని టార్గెట్ చేసి సీబీఐతో దాడులు చేయించారు. ఫలితం లేకపోవటంతో రాహుల్ గాంధీ ఇంటిని సైతం ఖాళీ చేయించారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Rajastan : మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 12మంది చిన్నారులను కాపాడిన రెస్క్యూ టీం
రాష్ట్రంలో ముఖ్యమంత్రి సీఎం జగన్, ప్రతిపక్షంలో చంద్రబాబు, బీజేపీతో ఉన్న పవన్ కల్యాణ్ ప్రస్తుత పరిణామాలపై కనీసం స్పందించడం లేదని ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు విమర్శలు గుప్పించారు. రేపు గాంధీనగర్ లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తాం.. ఈ సభకు ముఖ్య అతిథిలుగా రంజిత రంజన్, క్రిస్టోఫర్ తిలక్, మయ్యపన్, జేడీ శీలం, కొప్పలరాజు, చింతామోహన్, పల్లంరాజు ఇతర అగ్రనేతలు హాజరవుతారు అని ఆయన వెల్లడించారు. రేపు జరగబోయే ఈ బహిరంగ సభ ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియపరుస్తామని ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!