Free Bus Travel: ఏపీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఈ నెల 16 నుంచి వారికి కూడా ఫ్రీ..
- పది విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం..
- మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు అవకాశం..
- రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలకు హాజరు కానున్న 6.42 లక్షల మంది విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) భారీ ఊరటనిచ్చాయి. పరీక్షల సమయంలో విద్యార్థులకు రవాణా ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో.. పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఆర్టీసీ అధికారికంగా ప్రకటించింది.
హాల్ టికెట్ చూపిస్తే చాలు..
ఈ సౌకర్యం పొందడానికి విద్యార్థులు ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. తమ వెంట ఉన్న పరీక్ష హాల్ టికెట్ను బస్సు కండక్టర్కు చూపిస్తే సరిపోతుంది. తమ నివాస ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాలకు వెళ్లడానికి.. తిరిగి ఇంటికి చేరుకోవడానికి ఈ వెసులుబాటు కల్పించారు.
Also Read
- AP PPP Policy 2026కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు జారీ
- Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- India vs Sri Lanka: ఒకప్పుడు భారత్కు ప్రపంచకప్ అందించాడు.. ఇప్పుడు ఆ జట్టునే ఓడించేందుకు ప్లాన్..!
మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఏపీలో పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు రాసే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపిస్తే.. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు మరియు సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 6.42 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
Also Read:AP Govt: ఎక్కువ మంది పిల్లలు కనే దంపతులకు రూ.25 వేలు.. సీఎం చంద్రబాబు ప్రకటన..
పరీక్షల సమయంలో విద్యార్థులు ఆలస్యంగా వెళ్లకుండా ఉండేందుకు ఆర్టీసీ ఎండీ (MD) ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలు జరిగే సమయాల్లో బస్సుల ఫ్రీక్వెన్సీని పెంచాలని, విద్యార్థులను ఎక్కించుకోకుండా వెళ్లే డ్రైవర్లు, కండక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు దూరం ఉన్న చోట విద్యార్థుల రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులను కూడా నడపాలని రీజనల్ మేనేజర్లకు సూచించారు. పరీక్ష సమయానికి కనీసం గంట ముందే బస్సు స్టాప్కు చేరుకోవడం ఉత్తమం.
Also Read:Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ..
హాల్ టికెట్ ఒరిజినల్ లేదా జిరాక్స్ కాపీని ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం కేవలం పరీక్షలు జరిగే రోజుల్లో మాత్రమే వర్తిస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండాజజ సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే భరోసా లభిస్తుంది. పరీక్షల కోసం ప్రభుత్వం ఇప్పటికే అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తూ.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసింది.
తాజావార్తలు
-
KTM RC 160 Price Hiked: KTM RC 160 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే? కొత్త ధర, ఇంజిన్, ఫీచర్ల పూర్తి వివరాలు
-
Lopamudra Raut Theft Case: బిగ్బాస్ ఫేమ్ ఇంట్లో భారీ చోరీ.. నిందితుడి అరెస్ట్, రూ.76 లక్షల సొత్తు స్వాధీనం!
-
Tollywood : ఇండస్ట్రీ సంక్షోభానికి కారణం స్టార్ హీరోలేనా? సింగిల్ స్క్రీన్లు మూతపడటానికి బాధ్యులెవరు?
-
AP PPP Policy 2026కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు జారీ
-
iPhone 18 Fold: iPhone 18 Foldలో 12GB RAM, A20 Pro చిప్? 5,800mAh బ్యాటరీతో వస్తుందంటూ లీకులు
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!