Free Bus Travel: ఏపీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఈ నెల 16 నుంచి వారికి కూడా ఫ్రీ..
- పది విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం..
- మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు అవకాశం..
- రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలకు హాజరు కానున్న 6.42 లక్షల మంది విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) భారీ ఊరటనిచ్చాయి. పరీక్షల సమయంలో విద్యార్థులకు రవాణా ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో.. పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఆర్టీసీ అధికారికంగా ప్రకటించింది.
హాల్ టికెట్ చూపిస్తే చాలు..
ఈ సౌకర్యం పొందడానికి విద్యార్థులు ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. తమ వెంట ఉన్న పరీక్ష హాల్ టికెట్ను బస్సు కండక్టర్కు చూపిస్తే సరిపోతుంది. తమ నివాస ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాలకు వెళ్లడానికి.. తిరిగి ఇంటికి చేరుకోవడానికి ఈ వెసులుబాటు కల్పించారు.
Also Read
- CM Chandrababu: సింగపూర్లో 'సీబీఎన్@361 డిగ్రీస్' పుస్తకావిష్కరణ!
- Secunderabad Bonalu 2026: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలపై క్లారిటీ.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- Vaibhav Sooryavanshi: విరాట్ సలహాను పట్టించుకోని వైభవ్.. కెరీర్ ఆరంభంలో కోహ్లీ కూడా ఇంతే!
- NEET UG Re-Exam: నీట్ రీ-ఎగ్జామ్ వేళ కేంద్రం సంచలన నిర్ణయం.. భారత్లో టెలిగ్రామ్ యాప్పై తాత్కాలిక నిషేధం!
మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఏపీలో పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు రాసే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపిస్తే.. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు మరియు సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 6.42 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
Also Read:AP Govt: ఎక్కువ మంది పిల్లలు కనే దంపతులకు రూ.25 వేలు.. సీఎం చంద్రబాబు ప్రకటన..
పరీక్షల సమయంలో విద్యార్థులు ఆలస్యంగా వెళ్లకుండా ఉండేందుకు ఆర్టీసీ ఎండీ (MD) ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలు జరిగే సమయాల్లో బస్సుల ఫ్రీక్వెన్సీని పెంచాలని, విద్యార్థులను ఎక్కించుకోకుండా వెళ్లే డ్రైవర్లు, కండక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు దూరం ఉన్న చోట విద్యార్థుల రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులను కూడా నడపాలని రీజనల్ మేనేజర్లకు సూచించారు. పరీక్ష సమయానికి కనీసం గంట ముందే బస్సు స్టాప్కు చేరుకోవడం ఉత్తమం.
Also Read:Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ..
హాల్ టికెట్ ఒరిజినల్ లేదా జిరాక్స్ కాపీని ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం కేవలం పరీక్షలు జరిగే రోజుల్లో మాత్రమే వర్తిస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండాజజ సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే భరోసా లభిస్తుంది. పరీక్షల కోసం ప్రభుత్వం ఇప్పటికే అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తూ.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసింది.
తాజావార్తలు
-
CM Chandrababu: సింగపూర్లో ‘సీబీఎన్@361 డిగ్రీస్’ పుస్తకావిష్కరణ!
-
Kanatha Kaanom OTT Release : ఓటీటీలోకి యోగి బాబు తమిళ కామెడీ.. తెలుగులోనూ చూడవచ్చు
-
Secunderabad Bonalu 2026: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలపై క్లారిటీ.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
-
Vaibhav Sooryavanshi: విరాట్ సలహాను పట్టించుకోని వైభవ్.. కెరీర్ ఆరంభంలో కోహ్లీ కూడా ఇంతే!
-
Kalki2898AD : కల్కి – 2 లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?