Free Bus Travel: ఏపీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఈ నెల 16 నుంచి వారికి కూడా ఫ్రీ..
- పది విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం..
- మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు అవకాశం..
- రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలకు హాజరు కానున్న 6.42 లక్షల మంది విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) భారీ ఊరటనిచ్చాయి. పరీక్షల సమయంలో విద్యార్థులకు రవాణా ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో.. పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఆర్టీసీ అధికారికంగా ప్రకటించింది.
హాల్ టికెట్ చూపిస్తే చాలు..
ఈ సౌకర్యం పొందడానికి విద్యార్థులు ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. తమ వెంట ఉన్న పరీక్ష హాల్ టికెట్ను బస్సు కండక్టర్కు చూపిస్తే సరిపోతుంది. తమ నివాస ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాలకు వెళ్లడానికి.. తిరిగి ఇంటికి చేరుకోవడానికి ఈ వెసులుబాటు కల్పించారు.
Also Read
- Best Colors for Summer Clothes: వేసవిలో ఏ రంగు దుస్తులు ధరించాలి? ఈ 3 కలర్స్ మీ శరీరాన్ని ఏసీలా చల్లగా ఉంచుతాయి!
- Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
- Google Chrome Security Warning: క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం వార్నింగ్.. మీ బ్యాంక్ ఖాతా ఎప్పుడైనా ఖాళీ కావొచ్చు..!
- Kitchen Tips: ఉడికించిన బంగాళాదుంపల తొక్క తీసేటప్పుడు చేతులు కాలుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్తో క్షణాల్లో తొక్క ఊడిపోతుంది!
మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఏపీలో పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు రాసే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపిస్తే.. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు మరియు సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 6.42 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
Also Read:AP Govt: ఎక్కువ మంది పిల్లలు కనే దంపతులకు రూ.25 వేలు.. సీఎం చంద్రబాబు ప్రకటన..
పరీక్షల సమయంలో విద్యార్థులు ఆలస్యంగా వెళ్లకుండా ఉండేందుకు ఆర్టీసీ ఎండీ (MD) ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలు జరిగే సమయాల్లో బస్సుల ఫ్రీక్వెన్సీని పెంచాలని, విద్యార్థులను ఎక్కించుకోకుండా వెళ్లే డ్రైవర్లు, కండక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు దూరం ఉన్న చోట విద్యార్థుల రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులను కూడా నడపాలని రీజనల్ మేనేజర్లకు సూచించారు. పరీక్ష సమయానికి కనీసం గంట ముందే బస్సు స్టాప్కు చేరుకోవడం ఉత్తమం.
Also Read:Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ..
హాల్ టికెట్ ఒరిజినల్ లేదా జిరాక్స్ కాపీని ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం కేవలం పరీక్షలు జరిగే రోజుల్లో మాత్రమే వర్తిస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండాజజ సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే భరోసా లభిస్తుంది. పరీక్షల కోసం ప్రభుత్వం ఇప్పటికే అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తూ.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసింది.
తాజావార్తలు
-
Kangana-Aishwarya Rai: ఐశ్వర్య లుక్పై ట్రోల్స్.. కంగనా రనౌత్ సీరియస్ వార్నింగ్
-
Best Colors for Summer Clothes: వేసవిలో ఏ రంగు దుస్తులు ధరించాలి? ఈ 3 కలర్స్ మీ శరీరాన్ని ఏసీలా చల్లగా ఉంచుతాయి!
-
IPL 2026 Playoffs: ఆర్సీబీ లేదా జీటీకే ఐపీఎల్ 2026 టైటిల్.. ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్లకు కష్టమే!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Trisha: విజయ్, అజిత్, సూర్య.. ముగ్గురు స్టార్ హీరోల కెరీర్ బెస్ట్ హిట్స్ ఇచ్చిన ఒకే హీరోయిన్..!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!