Work From Office: ఆఫీసుకు వెళుతున్నాం కదా! ఇంకా ఆ పాత బట్టలేనా? కొనేద్దాం కొత్తవి!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Work From Office: మన దేశంలో కరోనా తగ్గుముఖం పట్టి వర్క్ ఫ్రం ఆఫీస్ ఊపందుకోవటంతో టాప్ బ్రాండ్ల క్లాత్స్, కాస్మెటిక్స్, జ్యూలరీ సేల్స్ పెరిగాయి. వర్క్ ఫ్రం హోం ముగియటంతో పైజామాలకు గిరాకీ తగ్గింది. వాటి స్థానంలో పవర్ సూట్ల కొనుగోళ్లు పెరిగాయి. కార్యాలయాలకు వెళ్లేవాళ్లు ఎక్కువగా వేసుకునేది కుర్తాలు, బ్లేజర్లు, ఫార్మల్ వైట్ షర్ట్లేనని ఆన్లైన్ రిటైల్ బ్రాండ్ మింత్రా తెలిపింది. ఇవి హాట్కేకుల్లా అమ్ముడుపోతున్నాయని పేర్కొంది. పండగ సీజన్ కూడా మొదలవటంతో వస్త్ర వ్యాపారం మరింత జోరుగా సాగనుందని మోతీలాల్ ఓస్వాల్ రిపోర్ట్ వెల్లడించింది.
అందరిలోనూ ఆసక్తి
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- 24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 45వ వార్షిక సాధారణ సమావేశం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనుంది. సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ మీటింగ్లో బోర్డ్ చైర్మన్ ముఖేష్ అంబానీ.. షేర్ హోల్డర్లను, సంస్థ భాగస్వాములను ఉద్దేశించి ఏం ప్రసంగిస్తారా అనేదానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 5జీ జియోఫోన్ లాంఛింగ్ లాంటి కొన్ని కీలక ప్రకటనలు చేస్తారని వ్యాపార వర్గాలు అంటున్నాయి. రిటైల్, టెలికం, న్యూ ఎనర్జీ తదితర ప్రధాన బిజినెస్లకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను వెల్లడిస్తారని భావిస్తున్నాయి.
గోయెల్ అధ్యక్షతన
వచ్చే నెలలో జరగనున్న విదేశీ వాణిజ్య సలహా మండలి సమావేశానికి కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ అధ్యక్షత వహించనున్నట్లు తెలుస్తోంది. 2022-27 మధ్య కాలంలో అనుసరించబోయే విదేశీ వాణిజ్య విధానంపై ఈ సమావేశంలో ఫోకస్ పెట్టనున్నారని సమాచారం. తద్వారా దేశీయ తయారీ రంగాన్ని, ఎగుమతులను మరింత ముందుకు తీసుకెళ్లే విధివిధానాలపై చర్చించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ మీటింగ్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల ప్రతినిధులు పాల్గొంటారు.
రెండేళ్ల కనిష్టానికి
ఈ నెల 19వ తేదీ నాటికి మన దేశ విదేశీ మారక నిల్వలు రెండేళ్ల కనిష్టానికి పడిపోయాయి. 7 రోజుల్లో 6.7 బిలియన్ డాలర్లు తగ్గటంతో ప్రస్తుతం 564 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా వెల్లడించింది. 2020 అక్టోబర్ తర్వాత ఇండియా విదేశీ మారక నిల్వలు ఈ స్థాయిలో ఎప్పుడూ పడిపోలేదు. రూపాయి విలువ ఇంకా పతనం కాకుండా ఉండేందుకు డాలర్లను ఫారన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో దూకుడుగా విక్రయిస్తుండటమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
‘ఫిఫా’కి రెడీ
ఫిఫా వరల్డ్ కప్ టూరిజం బూమ్ని సొమ్ము చేసుకునేందుకు గల్ఫ్ దేశం ఖతార్ సిద్ధమవుతోంది. 10 లక్షల మందికి పైగా ఫ్యాన్స్కి ఆతిథ్యం ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఫుట్బాల్ మ్యాచ్లు జరిగే దోహా సిటీకి వరల్డ్ కప్ సమయంలో నిత్యం కొత్తగా 90కి పైగా విమానాల్లో సాకర్ అభిమానులు చేరుకుంటాయని ఆశిస్తోంది. 40 విమానాల్లో మాత్రమే ప్రయాణికులు యూఏఈ నుంచి తిరిగి వెళతారని, మిగతా ప్యాసింజర్లందరూ అక్కడే బస చేస్తారని పేర్కొంటోంది. ఫిఫా వరల్డ్ కప్ నేపథ్యంలో ఎయిర్లైన్స్, హోటళ్లు, హాస్పిటాలిటీ తదితర రంగాలు లాభపడతాయని ఖతార్ చెబుతోంది.
ఫీజు తీసుకోవద్దు
కస్టమర్లు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా చెల్లింపులు చేస్తే పేమెంట్ యాప్లు ప్లాట్ఫాం ఫీజులను వసూలు చేయొద్దని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. యూపీఐ సర్వీసును ప్రజా ప్రయోజనం రీత్యా ఉచితంగా అందించాలని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెబుతున్న నేపథ్యంలో ఎన్పీసీఐ ఈ ఆదేశాలను జారీ చేయటం విశేషం. యూపీఐ లావాదేవీల్లో అత్యధిక వాటా కలిగిన ఫోన్ పే గతేడాది మొబైల్ రీఛార్జ్లతోపాటు కొన్ని పేమెంట్లకు ఛార్జి వేసింది. పేటీఎం కూడా ఈ ఏడాది జులైలో బిల్ పేమెంట్లపై రూపాయి ఫీజు తీసుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ స్పందించాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్కు ఫ్యాన్స్కు నో ఎంట్రీ!
-
Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
-
Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
-
Plastic Chair Cleaning Tips: తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలపై మొండి మరకలా? వంటింట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీ క్లీనింగ్
-
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!