దేశంలోనే అతిపెద్ద సిమెంట్ కంపెనీలలో శ్రీ సిమెంట్ ఒకటి. అయితే ఆ కంపెనీ రూ.23,000 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీని కారణంగా సోమవారం కంపెనీ షేర్లు 10 శాతం పడిపోయాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ నుండి దాదాపు రూ.9200 కోట్లు నష్టపోయాయి. ట్రేడింగ్ సమయంలో కంపెనీ షేరు రూ.25 వేల స్థాయి నుంచి రూ.22 వేల స్థాయికి దిగజారింది. ప్రస్తుతం కంపెనీ షేరు రూ.23 వేల స్థాయిలో ట్రేడవుతోంది.
రూ. 10,000 వరకు బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా..? అందులో 64 GB స్టోరేజ్ ఉన్న ఫోన్ దొరుకుతుందంటే ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే కొనేయండి. అయితే ఇప్పుడు అలాంటి ఓ స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఆ ఫోన్ లో 128 GB ర్యామ్ కలిగి ఉంది. అన్ని క్వాలిటీ ఉన్న ఫోన్ ఏంటనుకుంటున్నారా Motorola Moto G13.
రిలయన్స్ జియో వినియోగదారులకు చౌకైన ప్లాన్లను అందించడమే కాకుండా సరసమైన ధరలో 4G స్మార్ట్ఫోన్లను కూడా కంపెనీ విడుదల చేసింది. 4G స్మార్ట్ ఫోన్లు ప్రారంభించిన తర్వాత.. ఇప్పుడు వినియోగదారుల కోసం 5G కనెక్టివిటీ మద్దతుతో బడ్జెట్ స్మార్ట్ఫోన్ను విడుదల చేయాలని చూస్తోంది. ఇందుకు సంబంధించి చాలారోజులుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే Jio 5G ఫోన్కి సంబంధించి కొన్ని లీక్లు బయటపడ్డాయి.
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి రియల్ ఎస్టేట్ గ్రూప్ M3M డైరెక్టర్ బసంత్ బన్సల్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. బసంత్ బన్సాల్ సోదరుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి రూప్ కుమార్ బన్సాల్ను ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది. వీరిద్దరిపై మనీలాండరింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. M3M గ్రూప్ మరియు IREO గ్రూప్ ద్వారా 400 కోట్ల రూపాయలకు పైగా మనీ లాండరింగ్ జరిగినట్లు ఏజెన్సీ గుర్తించింది.
6 టాప్-10 అత్యంత విలువైన సంస్థల Mcap రూ. 1.13 లక్షల కోట్లకు పైగా పెరిగింది. అందులో భారీగా లాభపడ్డ వాటిలో రిలయన్స్, హెచ్యుఎల్ ఉంది. మరోవైపు టాప్ 10 ప్యాక్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, ఐటీసీ, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్ గత వారం లాభపడ్డాయి.
గత కొన్ని వారాలుగా వారం వారం బంగారం ధర తగ్గుముఖం పట్టింది. ఈ వారంలో కూడా బంగారం ధరలు తగ్గాయి. బంగారం ధరలు ఇప్పుడు 10 గ్రాములకు రూ.60,000 దిగువకు పడిపోయాయి.
న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా పతనమైంది. మొదటి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ కుంచించుకుపోవడంతో న్యూజిలాండ్ మాంద్యంలోకి జారిపోయింది. గురువారం విడుదల చేసిన డేటా ప్రకారం.. న్యూజిలాండ్ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోయింది.
ప్రధానంగా ఆహార ధరల తగ్గుదల కారణంగా దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మేలో 25 నెలల కనిష్ట స్థాయి 4.25 శాతానికి పడిపోయింది. రీటైల్ ద్రవ్యోల్బణం తగ్గుదల ఆర్థికవేత్తలు అంచనా వేసిన దానికి అనుగుణంగానే ఉంది.
బెంచ్మార్క్ రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించాలని ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం తెలిపారు. రెపో రేటు మారకపోవడంతో, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్ రేటు) 6.25 శాతంగా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ బ్యాంక్ రేట్లు 6.75 శాతంగా ఉన్నాయని శక్తికాంత దాస్ చెప్పారు.