‘Note’ these points: దాదాపు ఆరేళ్ల కిందట పెద్ద నోట్లను రద్దు చేయటం వల్ల కలుగుతున్న ప్రయోజనాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ సభ్యురాలు ఆషిమా గోయెల్ అన్నారు. పన్నుల వసూళ్లు పెరగటానికి ఈ నిర్ణయం పరోక్షంగా దోహదపడిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇండియన్ ఎకానమీ.. డిజిటల్ బాటలో శరవేగంగా పయనిస్తోందని చెప్పారు.
Steel Pricing: ఈ ఆర్థిక సంవత్సరంలో స్టీల్కి గిరాకీ 90 లక్షల టన్నులు పెరగనుందని, తద్వారా మొత్తం పదకొండున్నర కోట్ల టన్నులకు చేరనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఒక టన్ను ఉక్కు ధర 55 వేల నుంచి 57 వేల రూపాయల వరకు ఉంది. అంతర్జాతీయంగా స్టీల్ ఉత్పత్తి 6.2 కోట్ల టన్నులు తగ్గినప్పటికీ ఇండియాలో డిమాండ్ బాగుండటం ఈ సెక్టార్కి ప్లస్ పాయింట్గా మారిందని నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Samsung India: కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్సంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్కి గత ఐదేళ్లలో ఎప్పుడూ లేనంత అధిక ఆదాయం ఈ సంవత్సరం సమకూరింది. ఇతర ఆదాయం ఏకంగా 78 శాతం (రూ.2873.20 కోట్లకు) పెరగటంతో ఈ వృద్ధి నెలకొంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.75,886 కోట్లు కాగా ఈసారి రూ.82,451 కోట్ల రెవెన్యూ వచ్చింది. అంటే.. గతేడాది కన్నా ఇప్పుడు 8.65 శాతం గ్రోత్ సాధించింది. ఇదిలాఉండగా శామ్సంగ్ ఇండియాకి నెట్ ప్రాఫిట్…
Diwali Gold Sales: ఈ ఏడాది దీపావళి పండుగ.. బంగారం వ్యాపారానికి బాగా కలిసొచ్చింది. మన దేశంలో మొన్న, నిన్న రెండు రోజులు పాతిక వేల కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. గతేడాది ధన త్రయోదశితో పోల్చితే ఈసారి బంగారం, వెండి ఆభరణాల విక్రయాలు 35 శాతం అధికంగా నమోదైనట్లు అంచనా వేస్తున్నారు. పోయిన సంవత్సరం ఇదే సమయంలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 47 వేల 644 రూపాయలు ఉండగా ఈ సంవత్సరం…
Laurus Labs Paediatric HIV treatment: హైదరాబాద్కి చెందిన లారస్ ల్యాబ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్తో ముగిసిన రెండో త్రైమాసికం ఫలితాలను వెల్లడించింది. జులై, ఆగస్టు, సెప్టెంబర్.. ఈ మూడు నెలల్లో కలిపి 234 కోట్ల రూపాయల లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో ఈ సంస్థ లాభం 204 కోట్లు మాత్రమే కావటం గమనించాల్సిన విషయం. దీన్నిబట్టి ఈసారి నికరంగా 15 శాతం ఎక్కువ ప్రాఫిట్ను ఆర్జించింది.
Hyderabad Weapon Systems: రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి జాతీయ రాజకీయాల్లో ఎంత రచ్చ జరిగిందో దేశం మొత్తం చూసింది. ఈ అంశంపై అధికార పార్టీ బీజేపీ, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పలుమార్లు నువ్వా నేనా అన్నంత స్థాయిలో తలపడ్డాయి. పార్లమెంట్ లోపల, బయట పొలిటికల్ హీట్ పెరిగింది. మొత్తమ్మీద ఈ వివాదం ఎలాగోలా సద్దుమణిగింది. అయితే.. ఇప్పుడు ఆ రాఫెల్ యుద్ధ విమానాల్లో మేడిన్ హైదరాబాద్ అస్త్రాలను అమర్చనున్నారు.
Jio 5G: రిలయెన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ ఇవాళ రాజస్థాన్లో జియో 5జీ బీటా సర్వీసులను ప్రారంభించారు. రాజ్సమంద్లోని నాథద్వారాలో ఉన్న ప్రసిద్ధ శ్రీనాథ్జీ ఆలయం వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబానీలకు ఈ దేవుడి పైన అపార నమ్మకం ఉంది. శ్రీనాథ్జీని తమ కుటుంబ దైవంగా కొలుస్తారు. గతంలో రిలయెన్స్ జియో 4జీ సర్వీసులను సైతం ఇక్కడే ప్రారంభించటం విశేషం.
Rupee Trade: రూపాయల్లో ట్రేడింగ్ జరిపేందుకు ప్రపంచ దేశాల నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చినట్లు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రబి శంకర్ వెల్లడించారు. వాణిజ్య చెల్లింపుల నిమిత్తం దేశీయ కరెన్సీలను ఉపయోగించే పథకం కోసం ఆసియన్ క్లియరింగ్ యూనియన్ అన్వేషిస్తోందని తెలిపారు. ద్వైపాక్షికంగా లేదా వివిధ ట్రేడింగ్ బ్లాకుల మధ్య ఇలాంటి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఉంటే ప్రతి దేశానికి చెందిన దిగుమతిదారులు డొమెస్టిక్ కరెన్సీలో పేమెంట్లు చేసేందుకు వీలుపడుతుందని చెప్పారు.
Infosys: ఐటీ కంపెనీలకు సంబంధించి ఇటీవల మూన్ లైటింగ్ హాట్టాపిక్గా మారింది. మూన్ లైటింగ్ అంటే ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఆ కంపెనీకి తెలియకుండా మరో కంపెనీలో కూడా పనిచేస్తుండటం. మూన్ లైటింగ్ వ్యవహారంపై ఇటీవల టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు సీరియస్ అయ్యాయి. నిబంధనలను ఉల్లంఘించిన పలువురు ఉద్యోగులను తొలగిస్తామని హెచ్చరికలు కూడా జారీ చేశాయి. తాజాగా ఇన్ఫోసిస్ కంపెనీ తన ఉద్యోగులకు ఓ ఆఫర్ ఇచ్చింది. తమ ఉద్యోగులు కావాలనుకుంటే గిగ్…
World's First Licensing Deal: అధిక ధర కలిగిన క్యాన్సర్ మందు తయారీ కోసం నోవార్టిస్ సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి లైసెన్సింగ్ డీల్పై సంతకం చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా దీర్ఘకాలిక మైలోయిడ్ లుకేమియా ట్రీట్మెంట్లో వాడే ఓరల్ డ్రగ్ నిలోటినిబ్ను రూపొందించనున్నారు. ఈ ఔషధాన్ని ఈజిప్ట్, గ్వాటెమాల, ఇండోనేషియా, మొరాకో, పాకిస్థాన్, ది ఫిలిప్పీన్స్, ట్యునీషియా వంటి ఏడు మధ్య ఆదాయ దేశాల్లో జనరిక్ డ్రగ్మేకర్స్ తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురానున్నారు.