RBI: వడ్డీలు పెరిగేది లేదు.. రెపోరేటు యథాతథం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI: బెంచ్మార్క్ రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించాలని ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం తెలిపారు. రెపో రేటు మారకపోవడంతో, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్ రేటు) 6.25 శాతంగా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ బ్యాంక్ రేట్లు 6.75 శాతంగా ఉన్నాయని శక్తికాంత దాస్ చెప్పారు. రెపో రేటు అనేది ఆర్బీఐ బ్యాంకులకు రుణాలు ఇచ్చే రేటు.. దానిలో ఏదైనా మార్పు బ్యాంకు రుణాలు, ఈఎంఐలను ప్రభావితం చేస్తుంది. ఏప్రిల్లో జరిగిన మునుపటి సమావేశంలో పాజ్ని ఎంచుకునే ముందు, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి మే 2022 నుండి ఆర్బీఐ రెపో రేటును మొత్తం 250 బేసిస్ పాయింట్లు పెంచింది. ద్రవ్యోల్బణం తగ్గించేందుకే రెపోరేటు పెంచలేదని తెలిపారు.
Read Also: Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్కు చేదు అనుభవం.. “మోడీ..మోడీ” అంటూ నినాదాలు.
Also Read
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
- US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
- Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
మార్చి- ఏప్రిల్ 2023లో వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం తగ్గిందని.. 2022-23లో 6.7శాతం నుంచి క్షీణించిందని శక్తికాంత దాస్ చెప్పారు. అయితే తాజా డేటా ప్రకారం ద్రవ్యోల్బణం ఇప్పటికీ లక్ష్యానికి పైన ఉందన్నారు. తమ అంచనా ప్రకారం 2023-24లో ద్రవ్యోల్బణం 4 శాతం కంటే ఎక్కువగానే ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. ఆర్థిక కార్యకలాపాలు స్థితిస్థాపకంగా ఉన్నాయని, మునుపటి అంచనాలను అధిగమించాయని శక్తికాంత దాస్ చెప్పారు. “భారతదేశం నిజమైన స్థూల దేశీయోత్పత్తి (GDP) 2022-23లో 7.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది మునుపటి అంచనా 7 శాతం కంటే బలంగా ఉంది. ఇది దాని ప్రీ-పాండమిక్ స్థాయిని 10.1 శాతం అధిగమించింది…అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, 2023-24 సంవత్సరానికి నిజమైన జీడీపీ వృద్ధి 6.5 శాతంగా అంచనా వేయబడింది.”అని ఆయన చెప్పారు. పెరిగిన ద్రవ్యోల్బణం, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తత, కఠినమైన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక కార్యకలాపాల వేగం క్షీణించవచ్చని ఆర్బీఐ గుర్తించిందని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
-
NIMS : నిమ్స్లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
-
US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..