New Zealand: ఆర్థిక మాంద్యంలో న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Zealand: న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా పతనమైంది. మొదటి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ కుంచించుకుపోవడంతో న్యూజిలాండ్ మాంద్యంలోకి జారిపోయింది. గురువారం విడుదల చేసిన డేటా ప్రకారం.. న్యూజిలాండ్ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోయింది. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు దేశం మాంద్యంలో ఉంది. న్యూజిలాండ్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 2022 చివరి నాటికి 0.7 శాతం తగ్గిపోతుందని అంచనా వేయబడింది. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థలో 0.1 శాతం తగ్గుదల అనేది విశ్లేషకుల అంచనాలతో సరిపోలింది. న్యూజిలాండ్ ఆర్థిక మంత్రి గ్రాంట్ రాబర్ట్సన్ దేశం మాంద్యంలో ఉందని అంగీకరించారు. న్యూజిలాండ్లో 4 నెలల తర్వాత సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి.
Also Read: G-20: హైదరాబాద్ లో నేటి నుంచే G-20 సదస్సు.. 30 దేశాల వ్యవసాయ మంత్రుల రాక
Also Read
- Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
- India Loss: ముక్కోణపు వన్డే సిరీస్.. 4 పరుగుల తేడాతో భారత్-ఎపై అఫ్గానిస్థాన్-ఎ విజయం
- Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
- ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్లు.. షెడ్యూల్ ఖరారు..
రాబర్ట్సన్ ప్రకారం.. 2023 సంవత్సరం న్యూజిలాండ్కు చాలా సవాలుగా ఉంది. ప్రపంచ వృద్ధిలో న్యూజిలాండ్ వేగం కూడా మందగించింది. దేశంలో ద్రవ్యోల్బణం చాలా కాలంగా నిలకడగా ఉంది. నార్త్ ఐలాండ్లో జరుగుతున్న వాతావరణ సంఘటనలు వ్యాపారాలను ప్రభావితం చేశాయి. జనవరిలో ఆక్లాండ్లో వరదలు, ఫిబ్రవరిలో గాబ్రియెల్ తుఫాను కారణంగా న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది.డేటా తర్వాత న్యూజిలాండ్ డాలర్ 0.2శాతం పడిపోయి డాలర్ విలువ 0.6197కి పడిపోయింది. ఎందుకంటే ఇది మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉంది. స్టాటిస్టిక్స్ న్యూజిలాండ్ డేటా ప్రకారం, దేశంలోని సగం పరిశ్రమల నుంచి ఉత్పత్తి తగ్గిపోవడంతో ఆర్థిక వ్యవస్థలో బలహీనత విస్తృతంగా ఉంది. జనవరి, ఫిబ్రవరిలో ఆక్లాండ్లో రెండు ప్రధాన తుఫానుల, ఆకస్మిక వరదల కారణంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా పతనమైంది.
Also Read: Chinese Airlines : అధిక బరువు ఉన్న విమాన సిబ్బంది సస్పెండ్.. నిరసన వ్యక్తం చేస్తున్న సిబ్బంది
వాతావరణ విపత్తు వల్ల జరిగిన నష్టాన్ని సరిచేయడానికి 15 మిలియన్ల డాలర్ల వరకు అవసరమవుతుందని న్యూజిలాండ్ ప్రభుత్వం అంచనా వేసింది. 2020 తర్వాత న్యూజిలాండ్లో మాంద్యం ఏర్పడడం ఇదే తొలిసారి. గత సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా దేశ సరిహద్దులను మూసివేయవలసి వచ్చింది. దీని కారణంగా ఎగుమతులు ఆగిపోయాయి. అప్పుడు కూడా న్యూజిలాండ్లో మాంద్యం ఉంది.న్యూజిలాండ్ ద్రవ్యోల్బణం 6.7 శాతానికి పెరిగింది. దేశంలో వ్యవసాయం, తయారీ, రవాణా, సేవలు అన్నీ క్షీణించాయి. న్యూజిలాండ్లో ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ కుంచించుకుపోయిన న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వం రెడ్ లైట్గా మారిందని ప్రతిపక్ష ఆర్థిక ప్రతినిధి నికోలా విల్లిస్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
-
Mandadi: సుహాస్, సూరిల ‘మండాడి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
India Loss: ముక్కోణపు వన్డే సిరీస్.. 4 పరుగుల తేడాతో భారత్-ఎపై అఫ్గానిస్థాన్-ఎ విజయం
-
Isakapatnam : ఆమెజాన్ ఒరిజినల్ ‘ఇసకపట్నం’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!