New Zealand: ఆర్థిక మాంద్యంలో న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Zealand: న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా పతనమైంది. మొదటి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ కుంచించుకుపోవడంతో న్యూజిలాండ్ మాంద్యంలోకి జారిపోయింది. గురువారం విడుదల చేసిన డేటా ప్రకారం.. న్యూజిలాండ్ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోయింది. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు దేశం మాంద్యంలో ఉంది. న్యూజిలాండ్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 2022 చివరి నాటికి 0.7 శాతం తగ్గిపోతుందని అంచనా వేయబడింది. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థలో 0.1 శాతం తగ్గుదల అనేది విశ్లేషకుల అంచనాలతో సరిపోలింది. న్యూజిలాండ్ ఆర్థిక మంత్రి గ్రాంట్ రాబర్ట్సన్ దేశం మాంద్యంలో ఉందని అంగీకరించారు. న్యూజిలాండ్లో 4 నెలల తర్వాత సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి.
Also Read: G-20: హైదరాబాద్ లో నేటి నుంచే G-20 సదస్సు.. 30 దేశాల వ్యవసాయ మంత్రుల రాక
Also Read
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్ఖాన్పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
- DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
రాబర్ట్సన్ ప్రకారం.. 2023 సంవత్సరం న్యూజిలాండ్కు చాలా సవాలుగా ఉంది. ప్రపంచ వృద్ధిలో న్యూజిలాండ్ వేగం కూడా మందగించింది. దేశంలో ద్రవ్యోల్బణం చాలా కాలంగా నిలకడగా ఉంది. నార్త్ ఐలాండ్లో జరుగుతున్న వాతావరణ సంఘటనలు వ్యాపారాలను ప్రభావితం చేశాయి. జనవరిలో ఆక్లాండ్లో వరదలు, ఫిబ్రవరిలో గాబ్రియెల్ తుఫాను కారణంగా న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది.డేటా తర్వాత న్యూజిలాండ్ డాలర్ 0.2శాతం పడిపోయి డాలర్ విలువ 0.6197కి పడిపోయింది. ఎందుకంటే ఇది మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉంది. స్టాటిస్టిక్స్ న్యూజిలాండ్ డేటా ప్రకారం, దేశంలోని సగం పరిశ్రమల నుంచి ఉత్పత్తి తగ్గిపోవడంతో ఆర్థిక వ్యవస్థలో బలహీనత విస్తృతంగా ఉంది. జనవరి, ఫిబ్రవరిలో ఆక్లాండ్లో రెండు ప్రధాన తుఫానుల, ఆకస్మిక వరదల కారణంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా పతనమైంది.
Also Read: Chinese Airlines : అధిక బరువు ఉన్న విమాన సిబ్బంది సస్పెండ్.. నిరసన వ్యక్తం చేస్తున్న సిబ్బంది
వాతావరణ విపత్తు వల్ల జరిగిన నష్టాన్ని సరిచేయడానికి 15 మిలియన్ల డాలర్ల వరకు అవసరమవుతుందని న్యూజిలాండ్ ప్రభుత్వం అంచనా వేసింది. 2020 తర్వాత న్యూజిలాండ్లో మాంద్యం ఏర్పడడం ఇదే తొలిసారి. గత సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా దేశ సరిహద్దులను మూసివేయవలసి వచ్చింది. దీని కారణంగా ఎగుమతులు ఆగిపోయాయి. అప్పుడు కూడా న్యూజిలాండ్లో మాంద్యం ఉంది.న్యూజిలాండ్ ద్రవ్యోల్బణం 6.7 శాతానికి పెరిగింది. దేశంలో వ్యవసాయం, తయారీ, రవాణా, సేవలు అన్నీ క్షీణించాయి. న్యూజిలాండ్లో ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ కుంచించుకుపోయిన న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వం రెడ్ లైట్గా మారిందని ప్రతిపక్ష ఆర్థిక ప్రతినిధి నికోలా విల్లిస్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్ఖాన్పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!