Shree Cement: శ్రీ సిమెంట్ 23000 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణ.. భారీగా పడిపోయిన షేర్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shree Cement: దేశంలోనే అతిపెద్ద సిమెంట్ కంపెనీలలో శ్రీ సిమెంట్ ఒకటి. అయితే ఆ కంపెనీ రూ.23,000 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీని కారణంగా సోమవారం కంపెనీ షేర్లు 10 శాతం పడిపోయాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ నుండి దాదాపు రూ.9200 కోట్లు నష్టపోయాయి. ట్రేడింగ్ సమయంలో కంపెనీ షేరు రూ.25 వేల స్థాయి నుంచి రూ.22 వేల స్థాయికి దిగజారింది. ప్రస్తుతం కంపెనీ షేరు రూ.23 వేల స్థాయిలో ట్రేడవుతోంది. ఆదాయపు పన్ను శాఖ గత వారం సిమెంట్ తయారీదారులకు చెందిన ఐదు ప్రదేశాలను సర్వే చేసే ప్రక్రియను ప్రారంభించింది. అందులో భాగంగా బీవార్, జైపూర్, చిత్తోర్గఢ్, అజ్మీర్లోని కంపెనీ స్థావరాలపై దాడులు జరిగాయి. గత రెండు ట్రేడింగ్ రోజుల్లో కంపెనీ షేర్లు 12 శాతానికి పైగా క్షీణించాయి.
Read Also: Visakhapatnam: విశాఖలో చిక్కుకున్న ఎయిరిండియా ఫ్లైట్.. NTV కథనానికి స్పందన
Also Read
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
- Mumbai: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
- PoK: పీఓకేలో పాక్ అణచివేత.. భారత్ జోక్యం కోరిన JAAC
- Stocks Double: రూ. లక్షకు రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు రూ.6 లక్షలు.. ఇలాంటి స్టాక్స్ మనం ఎలా మిస్సయామబ్బా..
ఆదాయపు పన్ను సర్వేపై సిమెంట్ కంపెనీ తన పత్రికా ప్రకటనలో ఒక విషయాన్ని స్పష్టం చేసింది. కంపెనీ మొత్తం మేనేజ్మెంట్, అధికారులకు పూర్తి సహకరిస్తున్నదని.. అంతేకాకుండా మీడియాలో ప్రసారం అవుతున్న సమాచారం తప్పు అని పేర్కొంది. సర్వేకు సంబంధించి కొన్ని మీడియా సెక్షన్లలో.. కంపెనీ మరియు అధికారుల గురించి ప్రతికూలంగా మాట్లాడుతున్నట్లు కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ఆదాయపు పన్ను సర్వే ఇంకా కొనసాగుతోందని కంపెనీ పేర్కొంది.
Read Also: Suraj Kumar: ఘోర రోడ్డు ప్రమాదం.. హీరో కాలు తీసేసిన వైద్యులు
ఉదయం 11:57 గంటలకు కంపెనీ షేరు బిఎస్ఇలో దాదాపు 8 శాతం క్షీణించి రూ.23,150 వద్ద ట్రేడవుతోంది. అంతేకాకుండా గత సంవత్సరం కంపెనీ స్టాక్ 22 శాతం పెరిగింది. ఫిబ్రవరి 21న కంపెనీ షేరు రూ.27,000 స్థాయిని దాటింది. ఈరోజు ట్రేడింగ్ సెషన్లో, కంపెనీ స్టాక్ రూ. 22601.30తో రోజు కనిష్ట స్థాయికి చేరుకుంది. శుక్రవారం చివరి ట్రేడింగ్ రోజున రూ.25,144.85 వద్ద ముగిసింది. మరోవైపు కంపెనీ షేర్ల పతనం కారణంగా, ట్రేడింగ్ సెషన్లో కంపెనీ మార్కెట్ భారీగా క్షీణించింది. శుక్రవారం స్టాక్ మార్కెట్ ముగిసినప్పుడు బిఎస్ఇలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.90,724.49 కోట్లుగా ఉంది. నేటి ట్రేడింగ్ సెషన్లో ఇది రూ.22601.30కి చేరి ఆపై రూ.81,547.17 కోట్లకు తగ్గింది. అంటే కేవలం కొన్ని గంటల వ్యాపారంలో కంపెనీ దాదాపు రూ.92 కోట్ల నష్టాన్ని చవిచూసింది.
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!