Shree Cement: శ్రీ సిమెంట్ 23000 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణ.. భారీగా పడిపోయిన షేర్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shree Cement: దేశంలోనే అతిపెద్ద సిమెంట్ కంపెనీలలో శ్రీ సిమెంట్ ఒకటి. అయితే ఆ కంపెనీ రూ.23,000 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీని కారణంగా సోమవారం కంపెనీ షేర్లు 10 శాతం పడిపోయాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ నుండి దాదాపు రూ.9200 కోట్లు నష్టపోయాయి. ట్రేడింగ్ సమయంలో కంపెనీ షేరు రూ.25 వేల స్థాయి నుంచి రూ.22 వేల స్థాయికి దిగజారింది. ప్రస్తుతం కంపెనీ షేరు రూ.23 వేల స్థాయిలో ట్రేడవుతోంది. ఆదాయపు పన్ను శాఖ గత వారం సిమెంట్ తయారీదారులకు చెందిన ఐదు ప్రదేశాలను సర్వే చేసే ప్రక్రియను ప్రారంభించింది. అందులో భాగంగా బీవార్, జైపూర్, చిత్తోర్గఢ్, అజ్మీర్లోని కంపెనీ స్థావరాలపై దాడులు జరిగాయి. గత రెండు ట్రేడింగ్ రోజుల్లో కంపెనీ షేర్లు 12 శాతానికి పైగా క్షీణించాయి.
Read Also: Visakhapatnam: విశాఖలో చిక్కుకున్న ఎయిరిండియా ఫ్లైట్.. NTV కథనానికి స్పందన
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
ఆదాయపు పన్ను సర్వేపై సిమెంట్ కంపెనీ తన పత్రికా ప్రకటనలో ఒక విషయాన్ని స్పష్టం చేసింది. కంపెనీ మొత్తం మేనేజ్మెంట్, అధికారులకు పూర్తి సహకరిస్తున్నదని.. అంతేకాకుండా మీడియాలో ప్రసారం అవుతున్న సమాచారం తప్పు అని పేర్కొంది. సర్వేకు సంబంధించి కొన్ని మీడియా సెక్షన్లలో.. కంపెనీ మరియు అధికారుల గురించి ప్రతికూలంగా మాట్లాడుతున్నట్లు కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ఆదాయపు పన్ను సర్వే ఇంకా కొనసాగుతోందని కంపెనీ పేర్కొంది.
Read Also: Suraj Kumar: ఘోర రోడ్డు ప్రమాదం.. హీరో కాలు తీసేసిన వైద్యులు
ఉదయం 11:57 గంటలకు కంపెనీ షేరు బిఎస్ఇలో దాదాపు 8 శాతం క్షీణించి రూ.23,150 వద్ద ట్రేడవుతోంది. అంతేకాకుండా గత సంవత్సరం కంపెనీ స్టాక్ 22 శాతం పెరిగింది. ఫిబ్రవరి 21న కంపెనీ షేరు రూ.27,000 స్థాయిని దాటింది. ఈరోజు ట్రేడింగ్ సెషన్లో, కంపెనీ స్టాక్ రూ. 22601.30తో రోజు కనిష్ట స్థాయికి చేరుకుంది. శుక్రవారం చివరి ట్రేడింగ్ రోజున రూ.25,144.85 వద్ద ముగిసింది. మరోవైపు కంపెనీ షేర్ల పతనం కారణంగా, ట్రేడింగ్ సెషన్లో కంపెనీ మార్కెట్ భారీగా క్షీణించింది. శుక్రవారం స్టాక్ మార్కెట్ ముగిసినప్పుడు బిఎస్ఇలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.90,724.49 కోట్లుగా ఉంది. నేటి ట్రేడింగ్ సెషన్లో ఇది రూ.22601.30కి చేరి ఆపై రూ.81,547.17 కోట్లకు తగ్గింది. అంటే కేవలం కొన్ని గంటల వ్యాపారంలో కంపెనీ దాదాపు రూ.92 కోట్ల నష్టాన్ని చవిచూసింది.
తాజావార్తలు
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
-
Deewana : గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. ‘దీవానా’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!