KTR: వరదల్లో నిండా మునిగిన రైతాంగాన్నివంచనతో మళ్లీ సర్కారు ముంచిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతులకు ఇచ్చింది పరిహారం కాదు…పరిహాసమన్నారు కేటీఆర్. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే.. వేల ఎకరాలకే అరకొర సాయం చేసి చేతులు దులుపుకోవడం అన్యాయం అని., 4.15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన మాటలు.. వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదిక వాస్తవం కాదా..? పంట నష్టం అంచనాలను తల్లకిందులుగా ఎందుకు మార్చేసారు..? ఏకంగా…
కేటీఆర్ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలు శాపనార్థాలు తప్పితే సూచనలు లేవని.. దసరా సందర్భంగా ప్రతిపక్షాలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతున్నామన్నారు.
బీఆర్ఎస్-ధూంధాం! ఈ రెండు మాటలన్ని విడదీసి చూడలేం! ఉద్యమం కాలం నుంచి పదేళ్ల ప్రభుత్వం వరకు! పోరాటంలో అది ధూంధాం! సర్కారులో అది సాంస్కృతిక సారథి! ఇప్పుడా డప్పుచప్పుడు ఏమైంది? పాట ఎందుకు ఆగిపోయింది? గొంగడి కప్పుకుని గజ్జె కట్టేదెవరు? చిర్రా చిటికెన పుల్లతో డప్పు వాయించేదెవరు? ఎగిరి దుంకిన ఆ రోజులెక్కడ? సాయిచంద్ మృతి సరే! మరి రసమయి శ్రుతి ఏది? టీఆర్ఎస్ అయినా.. బీఆర్ఎస్గా రూపాంతరం చెందినా, ఆ పార్టీ డప్పుచప్పుడుగా, వెన్నుదన్నుగా నిలబడ్డది…
ఏమాటకామాటే! గత పదేళ్లుగా గజ్వేల్ అంటే గజ్వేలే! ఎక్కడా తగ్గేదే అన్నట్టుగా ఉండేది! కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన సొంత ఇలాఖా ఆమాత్రం ఉండొద్దా! మరి ఇప్పుడు ఆ జిగేల్ ఏమైంది? కేసీఆర్ ఎక్కడున్నారు? ఇదే అంశాన్ని కాంగ్రెస్ అస్త్రంగా మలుచుకుంది! కేసీఆర్ కనిపించడం లేదంటూ స్టేషన్లో కంప్లయింట్ ఇచ్చింది! దీనికి కౌంటర్గా బీఆర్ఎస్ ఏం చేసింది? ఛలో చూద్దాం రండి! గజ్వేల్ నియోజకవర్గం. దీనికి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. మాజీ సీఎం కేసీఆర్ ఇలాఖా!…
ప్రజల సంక్షేమం, అభివృద్ధి కంటే మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రూ.1.5 లక్షల కోట్లతో మూసీ రివర్ఫ్రంట్ వంటి గొప్ప కార్యక్రమాలను ఏకకాలంలో నిర్వహిస్తూనే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ముఖ్యమంత్రి అనడంపై ఆయన మండిపడ్డారు. “ప్రతిరోజూ రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెరుగుతున్న అప్పుల గురించి ఏడుస్తూనే ఉంటాడు, కానీ చాలా మందికి అనవసరమైన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్…
Mallu Bhatti Vikramarka: ప్రగతి భవన్ వేదికగా సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పంపిణీ చేశారు. ప్రకటనలకే పరిమితం కాకుండా పండుగకు ముందే కార్మికులకు బోనస్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.
మూసీ సుందరీకరణ రాజకీయం ఎటు పోతోంది? పొలిటికల్ వార్లో పైచేయి కోసం అధికార, ప్రతిపక్షాలు అనుసరించబోతున్న వ్యూహాలేంటి? వేస్తున్న కొత్త ఎత్తులేంటి? కాంగ్రెస్ రివర్స్ అటాక్తో ముందు డిఫెన్స్లో పడ్డట్టు కనిపించిన బీఆర్ఎస్ ఇప్పుడు వేస్తున్న కొత్త ఎత్తు ఏంటి? ఏ రూపంలో జనంలోకి వెళ్ళాలనుకుంటోంది? మూసీ సుందరీకరణ అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. హైదరాబాద్ నగరం నడి బొడ్డున పారుతున్న ఒకప్పటి మంచి నీటి నది ఇప్పుడు మురికి కూపంగా మారిపోయింది.…
ఉమ్మడి రంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పొలిటికల్ హిట్ లిస్ట్లో ఉన్నారా? సీఎం పదేపదే కొందరి పేర్లు ప్రస్తావించి మరీ ఎందుకు వార్నింగ్ ఇస్తున్నారు? దాని వెనక భవిష్యత్ వ్యూహం ఉందా? లేక ప్రస్తుత పొలిటికల్ ఫ్రస్ట్రేషన్ ఉందా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చర్యలతో హైడ్రా పై వ్యతిరేకత వస్తున్నట్టు ప్రభుత్వం భావిస్తోందా? అసలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న చర్చ ఏంటి? ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధం అవుతున్నారట. గడిచిన పది…
రాష్ట్రంలో శనివారం జరిగిన ముగ్గురు అన్నదాతల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ఆదివారం అన్నారు. రైతు సంఘం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, భూమి ఉన్న రైతులు, కౌలు రైతులు ఆదరణ లేకపోవడంతో నష్టపోతున్నారని విమర్శించారు. సాగునీటి సంక్షోభంతో పాటు అసంపూర్తిగా ఉన్న పంట రుణమాఫీ, రైతు భరోసా పథకం లేకపోవడంతో వందలాది మంది రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, అనేక మంది తమ ప్రాణాలను బలిగొన్నారని రామారావు ఒక…