గిరిజన రైతుల గురించి చర్చించాలని చర్చకు పట్టుబడితే సభను వాయిదా వేయడాన్ని తప్పుబడుతున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా వ్యాఖ్యానించారు. రైతులకు బేడీలు వేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. సభ జరిగినన్నీ రోజులు గిరిజన రైతుల పక్షాన పోరాడుతామన్నారు. శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యుల నిరసన నేపథ్యంలో శాసనమండలి బుధవారానికి వాయిదా పడింది.
BRS Protest: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. నల్ల చొక్కాలు, చేతికి సంకెళ్లు వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో తెలంగాణ బీజేపీ నాయకత్వం తెగ నానుస్తోందంటూ అసహనం పెరిగిపోతోందట పార్టీ వర్గాల్లో. ఏదైనా నానబెట్టడం వీళ్ళకు అలవాటే కదా.. అంతకు మించి కొత్తగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాంలే... అన్న పెదవి విరుపులు సైతం పెరుగుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే మార్చిలో రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఆ ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా డిసైడైంది తెలంగాణ కమలం పార్టీ. ఇంకేముంది... ఫలావాళ్ళు అభ్యర్థులు, ఫలానా ఈక్వేషన్స్తో ఎంపిక…
ఐదుగురు ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా భట్టి విక్రమార్క రోజూ సభకు వచ్చారని.. 38 మంది ఉన్న బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ఎందుకు రావడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి కంటే ఎక్కువ విలువ ప్రతిపక్ష నాయకుడికి ఉంటుందన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ఖతం అవుతుంది అని కేసీఆర్ ముందే తెలుసుకొని సభకు రావడం లేదన్నారు.
Bhatti Vikramarka : బోనస్ ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నారని, పండిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం లేకుండానే గతములో కట్టిన ప్రాజెక్టుల తోటే ధాన్యం రికార్డు స్థాయి లో పండుతుందన్నారు. రైతులకు మేము చేసినంత గా ఎవ్వరూ చేయలేదని, మీరు రైతులను ఎంత మోసం చేశారో ప్రజలకు తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. ఏడాది కాలం లోనే 21…
అక్కడ బీఆర్ఎస్, బీజేపీలకు కాంగ్రెస్ షాకులిస్తోందా? ఒకదానివెంట ఒకటిగా ఇంకా ఇవ్వడానికి స్కెచ్చేస్తోందా? ఇన్నాళ్ళు నిర్లక్ష్యం చేసిన ఓ బలమైన వర్గం మీద ఫ్రష్గా ఫోకస్ పెట్టిందా? ఆ వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తే.... ఏం జరుగుతుందో లోక్సభ ఎన్నికల్లో జ్ఞానోదయం అయిందా? ఇప్పుడు ఎక్కడ కొత్తగా ప్యాచ్ వర్క్ మొదలుపెట్టింది హస్తం పార్టీ? ఆ ఎఫెక్ట్ ప్రతిపక్షాల మీద ఎలా ఉండబోతోంది?
MLC Kavitha : మన సంస్కృతిపై దాడి జరుగుతుంటే ప్రతీ ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ తల్లిపై ప్రేమ లేదు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి రూపం మార్చారని విమర్శించారు. తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను చూస్తే తెలంగాణ సమాజాన్ని చూసినట్లుంటుందన్నారు. అందరం కలిస్తేనే ఒక అందమైన బతుకమ్మ అవుతుంది… అందరం కలిస్తేనే అందమైన సమాజం అవుతుందన్న సందేశం ఇచ్చేది బతుకమ్మ అంటూ కవి పేర్కొన్నారు. అలాంటి…
Harish Rao : నిన్న ఆర్బీఐ ఇచ్చిన నివేదికతో నిజాలు బయటపడ్డాయి…అబద్ధాలు తేలిపోయాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష రావు అన్నారు. ఇవాళ ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అవే అబద్దాలను ప్రచారం చేస్తూ కాలం గడుపుతుందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తే నిజం నిప్పులాంటిది నిజం నిలకడ మీద తెలుస్తుందన్నారు. పదేళ్ల మా పాలనపై కాంగ్రెస్ మంత్రులు, సీఎం రేవంత్…
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్రం పరిస్థితి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పాలనపై తీవ్రమైన విమర్శలు చేసారు. ఆయన రాహుల్ గాంధీకి రాసిన బహిరంగ లేఖలో కాంగ్రెస్ పాలన రాష్ట్రంలో ప్రతివర్గాలకు ముప్పు తెస్తోందని ఆరోపించారు. తెలంగాణ రైతుల నుండి మహిళల వరకు అన్ని వర్గాలు కాంగ్రెస్ సర్కార్ వల్ల అరిగోస పడుతోందని చెప్పారు. ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వ పయనంలో రాష్ట్రం దిగజారిపోయిందని, ప్రజల సమస్యలపై కాంగ్రెస్ నేతలు పట్టించుకోకుండా ఢిల్లీకి, ప్రభుత్వ…