Satyavathi Rathod: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దర్యాప్తు సంస్థలు జేబు సంస్థలుగా మారాయి
- హైదరాబాద్ను ప్రపంచ పటంలో కేటీఆర్ నిలిపారు
- ప్రధాని కూడా ఈ కార్ నిర్వహణకు ప్రయత్నించినా సాధ్యపడలేదు.. కేవలం కేటీఆర్ మాత్రమే నిర్వహించారు
- ఎవరూ ప్రమోటర్లు ముందుకు రాకపోవడంతో.. HMDA నుండి డబ్బులు చెల్లించారు -సత్యవతి రాథోడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Satyavathi Rathod: ఫార్ముల ఈ రేస్ కారు వ్యవహారంపై బీఆర్ఎస్ మహిళా నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా.. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నమని ఆమె విమర్శించారు. కేటీఆర్ పై పెట్టిన కేసు అక్రమకేసు అని, 1992లో ఈ కార్ రెస్ నిర్వహించాలని చంద్రబాబు ప్రయత్నించినా.. ఇంతవరకూ ఎవరూ ఈ రేస్ ను తీసుకురాలేదన్నారు.
హైదరాబాద్ ను ప్రపంచ పటంలో కేటీఆర్ నిలిపాడని, ప్రధాని కూడా ఈ కార్ నిర్వహణకు ప్రయత్నించినా సాధ్యపడలేదు.. కేవలం కేటీఆర్ మాత్రమే నిర్వహించాడని ఆమె వ్యాఖ్యానించారు. ఎవరూ ప్రమోటర్లు ముందుకు రాకపోవడంతో.. HMDA నుండి డబ్బులు చెల్లించారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దర్యాప్తు సంస్థలు జేబు సంస్థగా మారాయని, న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉందన్నారు సత్యవతి రాథోడ్. గతంలో రేవంత్ ఎమ్మెల్యేలను డబ్బులతో కొనుగోలు చేస్తూ దొరికిన దొంగ అని ఆమె ఆరోపించారు. కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటికి వస్తారన్నారు.
Also Read
- Protein Food Demand: ప్రోటీన్ కోసం భారతీయుల తొలి ఎంపిక ఇవే.. ఆన్లైన్ ఆర్డర్లలో కొత్త రికార్డులు..!
- Praggnanandhaa - Magnus Carlsen: వరల్డ్ నం.1 కార్ల్సెన్ కు 'ప్రజ్ఞానంద' చెక్మేట్.!
- 144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
- Cucumber Soup Recipe: 10 నిమిషాల్లో తయారయ్యే చల్లటి దోసకాయ సూప్ తాగండి.. శరీరం కూల్, ముఖం గ్లోతో మెరిసిపోతుంది!
అనంతరం మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో GHMC పరిధిలో సీట్లన్నీ BRS గెలవడం వల్ల కేటీఆర్ పై రేవంత్ కుట్రలు పన్నుతున్నారన్నారు. మీరు ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదన్నారు. అక్రమ కేసులను ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నామని, రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తామన్నారు. మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ.. అవినీతి లేకున్నా ACB కేసు పెట్టిన KTR పేరు బద్నాం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కేటీఆర్ హైదారాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే పని చేయడం తప్పా? అని ఆమె ప్రశ్నించారు. నిన్న మీరు ఓపెన్ చేసిన ఫ్లై ఓవర్ కూడా మా హయాంలోనిదే అని ఆమె వ్యాఖ్యానించారు. రాముడు ఎంత నిజాయితీగా ఉన్నాడో.. మా రాముడు కూడా నిజాయితీగా అన్నారని, మోసం, అబద్ధాలు, కేసులు తప్ప మీరు చేసింది ఏమీ లేదన్నారు. హామీలు అమలు చేయడం చేత కానీ దద్దమ్మలు కాంగ్రెస్ నాయకులు అని, జైలుకి వెళ్లి వచ్చిన రేవంత్ అందర్నీ జైలుకు పంపించాలని చూస్తున్నారు.. ప్రపంచం మొత్తం తిరిగివచ్చిన కేటీఆర్ ప్రపంచ పెట్టుబడులను తెచ్చాడన్నారు.
మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల గొంతుకగా కేటీఆర్, హరీష్ రావు లు ఉన్నారని, ఏడాది తర్వాత ఇప్పుడు కేసు గుర్తుకు వచ్చిందా? అని ఆమె అన్నారు. IT సెక్టార్ లో బెంగళూర్ ను కాదని హైదరాబాద్ను కేటీఆర్ మొదటి స్థానానికి తీసుకొచ్చారని కొనియాడారు. ఈ కార్ రేసింగ్ పై అసెంబ్లీలో చర్చ పెట్టమంటే.. ప్రభుత్వం తప్పించుకుందని, ఇది డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే తప్ప.. ఈ కేసులో అవినీతి జరగలేదన్నారు సునీతా లక్ష్మారెడ్డి.
Naga Vamsi: కొడతానంటే హీరోయిన్స్ ఒప్పుకోలేదు.. అందుకే ఊర్వశిని తీసుకున్నాం: నాగవంశీ
తాజావార్తలు
-
NTR : తెలుగువారి ఆత్మగౌరవం.. అఖండ తెలుగు జాతి కీర్తి పతాకం.. ‘ఎన్టీఆర్’ 103వ జయంతి సందర్భంగా ఘన నివాళి!
-
Protein Food Demand: ప్రోటీన్ కోసం భారతీయుల తొలి ఎంపిక ఇవే.. ఆన్లైన్ ఆర్డర్లలో కొత్త రికార్డులు..!
-
Kavya Maran Crying: ఎస్ఆర్హెచ్ దారుణ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన కావ్య పాప.. వీడియో వైరల్!
-
Praggnanandhaa – Magnus Carlsen: వరల్డ్ నం.1 కార్ల్సెన్ కు ‘ప్రజ్ఞానంద’ చెక్మేట్.!
-
Vaibhav Net Worth: “కోటీశ్వరుడే నండోయ్”.. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ నికర ఆస్తి విలువ ఎంతో తెలుసా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!