Satyavathi Rathod: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దర్యాప్తు సంస్థలు జేబు సంస్థలుగా మారాయి
- హైదరాబాద్ను ప్రపంచ పటంలో కేటీఆర్ నిలిపారు
- ప్రధాని కూడా ఈ కార్ నిర్వహణకు ప్రయత్నించినా సాధ్యపడలేదు.. కేవలం కేటీఆర్ మాత్రమే నిర్వహించారు
- ఎవరూ ప్రమోటర్లు ముందుకు రాకపోవడంతో.. HMDA నుండి డబ్బులు చెల్లించారు -సత్యవతి రాథోడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Satyavathi Rathod: ఫార్ముల ఈ రేస్ కారు వ్యవహారంపై బీఆర్ఎస్ మహిళా నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా.. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నమని ఆమె విమర్శించారు. కేటీఆర్ పై పెట్టిన కేసు అక్రమకేసు అని, 1992లో ఈ కార్ రెస్ నిర్వహించాలని చంద్రబాబు ప్రయత్నించినా.. ఇంతవరకూ ఎవరూ ఈ రేస్ ను తీసుకురాలేదన్నారు.
హైదరాబాద్ ను ప్రపంచ పటంలో కేటీఆర్ నిలిపాడని, ప్రధాని కూడా ఈ కార్ నిర్వహణకు ప్రయత్నించినా సాధ్యపడలేదు.. కేవలం కేటీఆర్ మాత్రమే నిర్వహించాడని ఆమె వ్యాఖ్యానించారు. ఎవరూ ప్రమోటర్లు ముందుకు రాకపోవడంతో.. HMDA నుండి డబ్బులు చెల్లించారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దర్యాప్తు సంస్థలు జేబు సంస్థగా మారాయని, న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉందన్నారు సత్యవతి రాథోడ్. గతంలో రేవంత్ ఎమ్మెల్యేలను డబ్బులతో కొనుగోలు చేస్తూ దొరికిన దొంగ అని ఆమె ఆరోపించారు. కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటికి వస్తారన్నారు.
Also Read
- గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
- Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
- World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
అనంతరం మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో GHMC పరిధిలో సీట్లన్నీ BRS గెలవడం వల్ల కేటీఆర్ పై రేవంత్ కుట్రలు పన్నుతున్నారన్నారు. మీరు ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదన్నారు. అక్రమ కేసులను ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నామని, రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తామన్నారు. మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ.. అవినీతి లేకున్నా ACB కేసు పెట్టిన KTR పేరు బద్నాం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కేటీఆర్ హైదారాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే పని చేయడం తప్పా? అని ఆమె ప్రశ్నించారు. నిన్న మీరు ఓపెన్ చేసిన ఫ్లై ఓవర్ కూడా మా హయాంలోనిదే అని ఆమె వ్యాఖ్యానించారు. రాముడు ఎంత నిజాయితీగా ఉన్నాడో.. మా రాముడు కూడా నిజాయితీగా అన్నారని, మోసం, అబద్ధాలు, కేసులు తప్ప మీరు చేసింది ఏమీ లేదన్నారు. హామీలు అమలు చేయడం చేత కానీ దద్దమ్మలు కాంగ్రెస్ నాయకులు అని, జైలుకి వెళ్లి వచ్చిన రేవంత్ అందర్నీ జైలుకు పంపించాలని చూస్తున్నారు.. ప్రపంచం మొత్తం తిరిగివచ్చిన కేటీఆర్ ప్రపంచ పెట్టుబడులను తెచ్చాడన్నారు.
మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల గొంతుకగా కేటీఆర్, హరీష్ రావు లు ఉన్నారని, ఏడాది తర్వాత ఇప్పుడు కేసు గుర్తుకు వచ్చిందా? అని ఆమె అన్నారు. IT సెక్టార్ లో బెంగళూర్ ను కాదని హైదరాబాద్ను కేటీఆర్ మొదటి స్థానానికి తీసుకొచ్చారని కొనియాడారు. ఈ కార్ రేసింగ్ పై అసెంబ్లీలో చర్చ పెట్టమంటే.. ప్రభుత్వం తప్పించుకుందని, ఇది డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే తప్ప.. ఈ కేసులో అవినీతి జరగలేదన్నారు సునీతా లక్ష్మారెడ్డి.
Naga Vamsi: కొడతానంటే హీరోయిన్స్ ఒప్పుకోలేదు.. అందుకే ఊర్వశిని తీసుకున్నాం: నాగవంశీ
తాజావార్తలు
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
-
Skoda Kylaq Sportline: భారత్లో కొత్త స్కోడా కైలాక్ స్పోర్ట్లైన్ వేరియంట్ విడుదల.. 6 ఎయిర్బ్యాగ్స్, 5-స్టార్ సేఫ్టీ
-
PM Modi: AI, డేటా, గవర్నెన్స్పై మోదీ కీలక ఆదేశాలు.. అధికారులకు బిగ్ మెసేజ్
-
World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?