Thatikonda Rajaiah : కడియం మాటలు.. అబద్దాల మూటలు…
- ఇరిగేషన్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదనడం కడియం దివాలాకోరుతనం
- గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులను.. కడియం శ్రీహరి ప్రారంభించడం సిగ్గుచేటు
- కడియం మాటలు..అబద్దాల మూటలు: తాటికొండ రాజయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thatikonda Rajaiah : ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ఇరిగేషన్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదనడం కడియం దివాలాకోరుతనమని తాటికొండ రాజయ్య మండిపడ్డారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులను.. కడియం శ్రీహరి ప్రారంభించడం సిగ్గుచేటని, కడియం మాటలు..అబద్దాల మూటలు అని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఘనపూర్ కు ఇరిగేషన్ పనులు మంజూరయ్యాయన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియంను గెలిపిస్తే..రేవంత్ రెడ్డితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, సక్రమ సంబంధం అయితే.. బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు తాటికొండ రాజయ్య. కడియం నిజ స్వరూపం తెలిసే…కాంగ్రెస్ నాయకులు ఓడగొట్టేందుకు ప్రయత్నం చేశారని, దేవాదుల పథకానికి కడియం శ్రీహరి వ్యతిరేకమన్నారు. దేవాదుల సృష్టికర్త కాదు, దేవాదుల వ్యతిరేక కర్త అని, ధర్మసాగర్ సౌత్ కెనాల్ నుండి నీరు విడుదల చేయొద్దని, గేట్ల తాళాలు నీటిలో వేసిన ఘనుడు కడియమన్నారు తాటికొండ రాజయ్య.
VD 12: జెర్సీ చేసిన డైరెక్టరేనా? వీడీ 12 చూసి షాక్.. హైపెక్కించేస్తున్న నాగవంశీ
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
అంతేకాకుండా..’దేవాదుల ప్రాజెక్టులో ఒక్క తట్ట మట్టి తీసింది లేదు. దేవాదుల ప్రాజెక్టులో నీటిని నింపిన చరిత్ర నాది. బిడ్డ రాజకీయ భవిష్యత్ కోసం.. ఘనపూర్ ను తాకట్టు పెట్టిన కడియం. నువ్వు పనులు చేయకుండా..గత ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు. ఇరిగేషన్ రంగాన్ని మొదటి దశలో ఉంచిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిది. లక్ష కోట్ల రూపాయలు నేరుగా రైతు అకౌంట్లలో జమ చేసిన ఘనత బీఆర్ఎస్ది. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి. ఫార్ములా ఈ రేసు లో హైకోర్టు మొట్టికాయలు వేసినా.. ఈడి, ఎసిబి నోటీసులు పంపడం విడ్డూరం. అక్రమ కేసులు, నిర్భందాలు, ఎంకౌంటర్లు కడియం ప్రత్యేకత. నియోజకవర్గానికి కడియం చేసింది గుండు సున్న. మాట్లాడేటప్పుడు కడియం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి.
మరోసారి బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే… తాట తీస్తాం.’ అని తాటికొండ రాజయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు.
US: విషాదం.. భోజనం చేస్తుండగానే యూఎస్ ఇన్ఫ్లుయెనర్స్ హఠాన్మరణం
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!