Harish Rao: “అది డైవర్ట్ చేయడానికే కేటీఆర్పై కేసు పెట్టారు “.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
- న్యాయవాదులతో మాట్లాడుతున్నాం
- కేటీఆర్ పై అక్రమ కేసు పెట్టారు
- అన్ని విషయాల్లో ప్రభుత్వం ఫెయిల్ అయింది
- సర్వే రిపోర్ట్ వచ్చింది
- అది డైవర్ట్ చేయడానికే కేటీఆర్ పై కేసు
- మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హై కోర్టు తీర్పుపై న్యాయవాదులతో మాట్లాడుతున్నామని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మీడియాతో హరీశ్ రావు మాట్లాడుతూ.. “కేటీఆర్ పై అక్రమ కేసు పెట్టారు. ఈ ఏడాదిలో అన్ని విషయాల్లో ప్రభుత్వం ఫెయిల్ అయింది అని సర్వే రిపోర్ట్ వచ్చింది. అది డైవర్ట్ చేయడానికే కేటీఆర్ పై కేసు పెట్టారు. కుట్ర తో చేస్తున్నారు అని క్లియర్ గా తెలుస్తోంది. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. నోటీస్ ఇచ్చినందుకు కేటీఆర్ విచారణకు వెళ్లారు. ప్రభుత్వం తీరు బాగా లేదు అని న్యాయవాదులతో కలిసి వెళ్తాను అన్నారు. అరగంట సేపు రోడ్డు మీదనే ఉన్నారు. కేటీఆర్ మళ్ళీ విచారణకు వెళ్తాడు కక్ష సాధింపునకు రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారు. ఇది కుట్రపూరితంగా పెట్టారు. ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టి.. కడిగిన ముత్యం లాగా బయటకు వస్తారు.” అని హరీశ్ రావు పేర్కొన్నారు.
READ MORE: Uttar Pradesh: ఆరుగురు పిల్లలను భర్త దగ్గర వదిలి.. బిచ్చగాడితో లేచిపోయిన భార్య
Also Read
- Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
- Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
కోర్టు కేసును కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని హరీశ్ రావు అన్నారు. “తప్పు జరిగింది అని కోర్టు చెప్పలేదు. ఇదొక తుఫెల్ కేసు. 9 వ తేదీ ఏసీబీ విచారణకు కేటీఆర్ వెళ్తారు. ఇవాళ అరెస్ట్ చేస్తారా? రేపు అరెస్ట్ చేస్తారా? వాళ్ళ ఇష్టం. విచారణకు పూర్తిగా సహకరిస్తాం. అడ్వకేట్ లు వెళితే తప్పేంటి? రాహుల్ గాంధీ విచారణ కు వెళితే… అడ్వకేట్ లు కూడా వెళ్లారు. గతంలో గ్రీన్ కో కు మేము ఏమి ఇవ్వలేదు. గ్రీన్ కోకు మేము లాభం చేకూర్చినట్లు ఎక్కడా లేదు. ఇక్కడ అవినీతి కి ఆస్కారం లేదు. కాళేశ్వరం ఇష్యూ తర్వాత మాట్లాడదాం. కోర్ట్ జడ్జిమెంట్ వచ్చాక పై కోర్టుకు వెళ్లాలా వద్దా అనేది మా లీగల్ టీమ్ తో చర్చిస్తాం.” అని తెలిపారు.
READ MORE: Oscars 2025 : ఆస్కార్ బరిలో సూర్య కంగువా
రేవంత్ రెడ్డి కేసుపై స్పందించిన మాజీ మంత్రి హరీశ్ రావు ఆ కేసుకు ఈ కేసుకు పోలిక లేదన్నారు. రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికారని తెలిపారు. “కేటీఆర్ రాష్ట్రం ఇమేజ్ పెంచినందుకు కేసు పెట్టారు. అది డైవర్ట్ చేయడానికే కేటీఆర్ పై కేసు పెట్టారు. మాపై కేస్ లు పెడతారని మాకు ముందే తెలుసు. కేసులతో మానసికంగా మమ్మల్ని బలహీన పర్చాలని చూస్తున్నారు.
కేవలం విచారణ కొనసాగించాలని మాత్రమే హై కోర్టు చెప్పింది. తప్పు జరిగింది అని కోర్టు చెప్పలేదు. విచారణ కు సహకరిస్తాం.” అని హరీశ్ రావు వెల్లడించారు.
తాజావార్తలు
-
Varun Tej: చిరంజీవి కళ్ళల్లో ఆనందం చూడటమే నా ఏకైక లక్ష్యం
-
Nagababu: మాకు ప్రాణ వాయువు మా అన్నయ్య
-
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..