Off The Record: తెలంగాణలో గులాబీపార్టీ నేతల చూపంతా ప్రస్తుతం 18న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభపైనే ఉంది. టీఆర్ఎస్– బీఆర్ఎస్గా మారిన తర్వాత నిర్వహిస్తున్న బహిరంగ సభ కావడంతో సీనియర్లకు బాధ్యతలు అప్పగించారు సీఎం కేసీఆర్. మంత్రులు హరీష్రావు, ప్రశాంత్రెడ్డితోపాటు మరికొందరు సభా ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు. దాదాపు ఐదు లక్షల మందిని సమీకరించాలనేది పార్టీ లక్ష్యం. అప్పుడే బీఆర్ఎస్ సభ దేశం దృష్టిని ఆకర్షిస్తుందని గులాబీ నేతల ఆలోచన. నియోజకవర్గాల వారీగా జనసమీకరణకు ప్రణాళికలు…
Off The Record: ఉమ్మడి వరంగల్ జిల్లాలో హాట్ హాట్ రాజకీయాలకు వేదిక వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం. ప్రస్తుతం తూర్పు సెగ్మెంట్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. అదీ ఎర్రబెల్లి ప్రదీప్రావు ద్వారా. ప్రదీప్రావు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సోదరుడు. మొన్నటి వరకు అధికారపార్టీలోనే ఉన్నారు. ఈ మధ్యే బీజేపీలోకి జంప్ చేశారు. అప్పటి నుంచి తూర్పులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్తో ఢీ అంటే ఢీ అంటున్నారు ప్రదీప్రావు. వాస్తవానికి గులాబీ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేతో…
KTR: ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్.. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా వినియోగదారులు, రైతులతో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో పాల్గొని ప్రసంగించారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెస్ ఎన్నికల సమయంలో బండి సంజయ్ రూ.5కోట్లు తీసుకువచ్చాడని.. అభ్యర్థులు ఆగమై తనకు ఫోన్లు చేశారని చెప్పారు.…
తనకు సెక్యూరిటీ అవసరం లేదని తను ఉగ్రవాదిని కాదు కబ్జాలు చేయలేదని మాజీ ఎం.పీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రాద్రి పినపాక నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గంగిరెద్దుల అడించే వారిలా సంక్రాంతి కి రాలేదని అన్నారు.
తక్షణమే పదవికి సోమేశ్ కుమార్ రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ లో ప్రకటన విడుదల చేసారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ కొనసాగింపును రద్దు చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు నేపథ్యంలో తక్షణమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి సోమేశ్ కుమార్ రాజీనామా చేయాలని బీజేపీ సూచిస్తోందన్నారు.
కేసీఆర్ కు సోమేష్ కుమార్ పట్ల మక్కువతోనే తెలంగాణలో ఉండేలా చేశారని బీజేపీ నేత NVSS ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. BRS పార్టీ పెట్టిందే హరీష్ రావును డిల్లీ కు పంపించడానికే అంటూ ఆరోపించారు. అవినీతి కు మారు పేరు brs అంటూ నిప్పులు చెరిగారు. కమ్యూనిస్ట్ ల కోరిక మేరకే ఖమ్మంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారంటే ఎద్దేవ చేశారు.