CBI: సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరుపుతుండగా.. దానిని సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టు సింగిల్ బెంజ్ ఆదేశాలు జారీ చేసింది.. అయితే, ఈ పరిణామాన్ని హైకోర్టు ధర్మాసనం ముందు సవాల్ చేశారు.. దీనిపై ఇవాళ వాదనలు హాట్హాట్గా సాగాయి.. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు.. మరోవైపు.. ఈ కేసు విచారణ కోసం సీబీఐ ఉత్సాహంగా ఉన్నట్టు తెలుస్తోంది.. ఎమ్మెల్యేలకు ఎర…
Congress and BRS Alliance: తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది.. జాతీయ రాజకీయాల్లో ప్రవేశించిన కేసీఆర్.. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చేశారు.. అయితే, జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో కలిసి కేసీఆర్ పనిచేస్తారని ఆది నుంచి ఆరోపిస్తూ వస్తోంది భారతీయ జనతా పార్టీ.. మరోసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తుపై హాట్ కామెంట్లు చేశారు.. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి.. కాంగ్రెస్.. బీఆర్ఎస్తో పొత్తుకు అంగీకారం తెలిపిందని వార్తలు వస్తున్నాయన్న ఆయన.. ఈ విషయాన్ని…
Vemula Prashanth Reddy: బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఆరోపణలు, విమర్శల పర్వంలో రెండు పార్టీలు దూకుడు చూపిస్తున్నాయి… బీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్ను టార్గెట్ చేసి బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు విమర్శలు గుప్పిస్తుంటే.. అదే రేంజ్లో కౌంటర్ ఎటాక్కు దిగుతున్నారు బీఆర్ఎస్ నేతలు.. తాజాగా, బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఆ పార్టీ నేతలపై ప్రశ్నల వర్షం కురపించారు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి.. దేశం మొత్తం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావును పొగుడుతుంటే..…
తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని హైకోర్టుకు తెలిపింది సీబీఐ.. ఈ వ్యవహారంలో ఇప్పటికే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా.. తమకు ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది.. డాక్యుమెంట్లు ఇస్తే.. విచారణ ప్రారంభిస్తామని హైకోర్టుకు తెలిపింది సీబీఐ.. దీంతో.. కేసు విచారణ పూర్తయ్యే వరకు ఆగాలని సీబీఐకి సూచించింది ధర్మాసనం.. ఇదే…
కేంద్రమంత్రి కిషన్రెడ్డికి బహిరంగసవాల్ విసిరారు తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. నేను చెప్పేది తప్పయితే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా.. మీరు చెప్పేది తప్పైతే కేంద్ర మంత్రి పదవి వదిలి పెట్టకపోయినా.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ రైతుల బంద్ కు మద్దతుగా కాంగ్రెస్ ర్యాలీ చేపట్టింది. ఇందిరా చౌక్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. మాస్టర్ ప్లాన్ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. షబ్బీర్ అలీ, కిసాన్ కేత్ రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ శ్రేణుల ధర్నా ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ రిట్ పిటిషన్ ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఇప్పటికే ప్రభుత్వం తరపు వాదనలు పూర్తి కాగా. ప్రతివాదుల తరపు వాదనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. నేటి మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి విచారణ చేపట్టనుంది.