Rishi Sunak : భారత సంతతి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.. బ్రిటన్ పార్లమెంట్ నిబంధనలను ఉల్లంఘించినట్లుగా తేలింది. సునాక్ భార్య అక్షత మూర్తికి పలు చైల్డ్ కేర్ కంపెనీలలో షేర్లు ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని సునాక్ వెల్లడించలేదు. దీంతో తన భార్యకు ఉన్న షేర్ల విషయం చెప్పకుండా రిషి సునాక్ పార్లమెంటరీ నిబంధనలు ఉల్లంఘించారని విపక్షలు ఆరోపించాయి. ఈ చైల్డ్ కేర్ పథకాలతో అక్షత మూర్తి లబ్ధి పొందుతున్నారని కూడా ఆరోపణలు చేశారు. అయితే…
Kabaddi Tournament: ఆటల పోటీలు ఆరోగ్యకరంగా ఉండాలి. ఏ జట్టు గెలిచినా, ఏ జట్టు ఓడిపోయినా ఇరుజట్ల దానిని స్పోర్టివ్ గా తీసుకోవాలి. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఆటల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. అవి కొట్టుకోవడంతో ఆగకుండా కత్తులతో దాడి చేసుకునే వరకు కూడా వెళుతూ ఉంటాయి. అలాంటి ఘటనే ఒకటి బ్రిటన్లోని డెర్బిషైర్లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బ్రిటన్లోని డెర్బిషైర్ లో రెండు జట్ల…
అప్పుడే పుట్టిన ఏడుగురు నవజాత శిశువుల ప్రాణాలను తీసింది ఓ నర్సు. తన వృత్తికే కాదు.. మానవత్వానికి మచ్చ తీసుకొచ్చింది. ఈ హృదయ విదారక ఘటన ఇంగ్లాండ్ లో జరిగింది. యునైటెడ్ కింగ్డమ్లోని చెస్టర్ హాస్పిటల్లో పనిచేస్తున్న లూసీ లెట్బీ అనే నర్సు.. ఏడుగురు నవజాత శిశువులను హత్య చేయగా.. మరో ఆరుగురు చిన్నారులను హత్యాయత్నానికి పాల్పడినట్లు మాంచెస్టర్ క్రౌన్ కోర్టు నిర్ధారించింది.
Resomation: చనిపోయిన తర్వాత భౌతికకాయానికి మత సంప్రదాయాలను అనుసరించి ఖననం, దహనం చేయడం చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఎలక్ట్రిక్ పద్దతితో దహనసంస్కారాలు నిర్వహిస్తున్నారు. చాలా దేశాల్లో కూడా ఇదే తరహా దహనసంస్కారాలు అమలులో ఉన్నాయి. అయితే ‘నీటిలో అంత్యక్రియలు(Water Cremation)’ నిర్వహించే పద్ధతిని కొన్ని దేశాలు అమలు చేస్తున్నాయి. రిసోమేషన్ అనే పిలువబడే ఈ ప్రక్రియ ఇప్పటికే కొన్ని దేశాల్లో అమలులో ఉంది. తాజాగా బ్రిటన్ కూడా ఈ తరహా పద్దతికి అనుమతి ఇచ్చింది. ఈ రిసోమేషన్(Resomation)…
UK: బ్రిటన్ నుంచి షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ భారతీయ విద్యార్థి మద్యం మత్తులో ఉన్న మహిళను తన ఫ్లాట్కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటన సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది.
ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి దేవాలయం దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఆ గుడిలో జరిగే రథోత్సవం ఎంత ప్రసిద్ధమో మనకు తెలుసు. ఈ ఆలయ వార్షిక రథోత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు.
Bison : సుమారు ఆరువేల సంవత్సరాల తర్వాత బ్రిటన్లో తొలిసారిగా ఓ బైసన్ పుట్టడం పట్ల అటవీశాఖ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలల క్రితం పుట్టిన దున్నకు సంబంధించిన తాజా చిత్రాలు వెలుగులోకి వచ్చాయి.
Global Warming: ఎమినిది సంవత్సరాల నుంచి భూమి మండిపోతుంది. సూర్యుడి నుంచి వస్తున్న ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని యూరోపియన్ యూనియన్ వాతావరణ అధ్యయన నివేదికలో తెలిపింది.