Elon Musk: మస్క్ సంచలన నిర్ణయం.. ఈ సారి చంద్రుడిపై ప్రపంచ కుబేరుడి కన్ను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన పోస్ట్ చేశారు. ఇప్పుడు మస్క్ కన్ను భూమిపై నుంచి చంద్రుడి పైకి సిఫ్ట్ అయ్యింది. మస్క్ మరోసారి తన ఆలోచనలతో అందరినీ ఆశ్చర్యపరిచారు. తన అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్ ఇప్పుడు మార్స్ కంటే చంద్రుడిపైనే ఎక్కువగా దృష్టి పెట్టిందని ప్రకటించారు. చంద్రుడిపై మనుషులు నివసించగలిగేలా ఓ నగరాన్ని నిర్మించడమే తమ కొత్త లక్ష్యమని వెల్లడించారు. ఇది మార్స్ కంటే వేగంగా చంద్రుడిపై నగర నిర్మాణం సాధ్యమవుతుందని మస్క్ అభిప్రాయపడ్డారు. తాజాగా ఈమేరకు మస్క్ ఓ పోస్ట్ చేశారు. చంద్రుడిపై ఈ ప్రాజెక్ట్ను పదేళ్లలోపు పూర్తి చేయొచ్చని అందులో పేర్కొన్నారు. కానీ మార్స్పై పూర్తిస్థాయి నగరం ఏర్పడాలంటే కనీసం 20 ఏళ్లు పడుతుందని తెలిపారు. మానవ నాగరికత భవిష్యత్తును కాపాడాలంటే చంద్రుడే ఇప్పుడు సరైన మార్గమని వివరించారు.
READ MORE: Venky – Anil 4 : వెంకీ మామ.. అనిల్ రావిపూడి.. షూటింగ్ ఎప్పుడంటే
Also Read
- IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
- 8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
- PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
- AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
మస్క్ మాటల్లో చెప్పాలంటే, స్పేస్ఎక్స్ ఇప్పటికే చంద్రుడిపై నగరం నిర్మించే దిశగా అడుగులు వేసింది. ఎందుకంటే.. చంద్రుడికి వెళ్లడం సులువుగా మారింది. ప్రతి 10 రోజులకు ఒకసారి చంద్రుడి పైకి రాకెట్ పంపే అవకాశం ఉందట. ప్రయాణం కూడా కేవలం రెండు రోజుల్లో పూర్తవుతుందని మస్క్ వివరించారు. కానీ మార్స్కు వెళ్లాలంటే పరిస్థితి పూర్తిగా భిన్నమని పేర్కొన్నారు. భూమి, మార్స్ గ్రహాలు కక్షలో అనుకూలంగా ఉండే అవకాశం దాదాపు 26 నెలలకు ఒకసారి మాత్రమే వస్తుందట. అంతేకాదు, మార్స్ ప్రయాణానికి ఆరు నెలల సమయం పడుతుందట. చంద్రుడిపైకి వెళ్లడం ఈజీ అని మస్క్ తెలిపారు. అందుకే చంద్రుడిపై దృష్టి పెట్టామని స్పష్టం చేశారు. అయితే.. స్పేస్ ఎక్స్ మార్స్ను పూర్తిగా పక్కన పెట్టలేదని తెలిపారు. మార్స్ ప్రాజెక్ట్ కూడా స్పేస్ఎక్స్ దీర్ఘకాల లక్ష్యంలో భాగమేనని వెల్లడించారు. వచ్చే ఐదు నుంచి ఏడు సంవత్సరాల్లో మార్స్పై మానవ నివాసాన్ని ప్రారంభించే ప్రయత్నం కొనసాగుతుందని చెప్పారు. “మార్స్పై నగరం నిర్మించడమే మా తుదిలక్ష్యం. ఆ దిశలో కూడా మా ప్రయత్నాలు ఆగవు” అని మస్క్ తెలిపారు. ఇంతకుముందు మస్క్ 2026 చివరికి మార్స్కు మానవుల్లేని మిషన్ పంపాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. కానీ తాజా ప్రకటన చూస్తే, మార్స్ కంటే ముందు చంద్రుడిపై పెద్ద అడుగులు వేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. స్పేస్ఎక్స్ పెట్టుబడిదారులకు ముందుగా చంద్రుడిపై మిషన్లకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది. 2027 మార్చిలో చంద్రుడిపై మానవుల్లేని ల్యాండింగ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. ‘జై కొట్టు’ వీడియో వైరల్!
-
KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్!
-
Toxic: సొంత గడ్డపైనే యశ్కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
-
Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
-
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!