Elon Musk: మస్క్ సంచలన నిర్ణయం.. ఈ సారి చంద్రుడిపై ప్రపంచ కుబేరుడి కన్ను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన పోస్ట్ చేశారు. ఇప్పుడు మస్క్ కన్ను భూమిపై నుంచి చంద్రుడి పైకి సిఫ్ట్ అయ్యింది. మస్క్ మరోసారి తన ఆలోచనలతో అందరినీ ఆశ్చర్యపరిచారు. తన అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్ ఇప్పుడు మార్స్ కంటే చంద్రుడిపైనే ఎక్కువగా దృష్టి పెట్టిందని ప్రకటించారు. చంద్రుడిపై మనుషులు నివసించగలిగేలా ఓ నగరాన్ని నిర్మించడమే తమ కొత్త లక్ష్యమని వెల్లడించారు. ఇది మార్స్ కంటే వేగంగా చంద్రుడిపై నగర నిర్మాణం సాధ్యమవుతుందని మస్క్ అభిప్రాయపడ్డారు. తాజాగా ఈమేరకు మస్క్ ఓ పోస్ట్ చేశారు. చంద్రుడిపై ఈ ప్రాజెక్ట్ను పదేళ్లలోపు పూర్తి చేయొచ్చని అందులో పేర్కొన్నారు. కానీ మార్స్పై పూర్తిస్థాయి నగరం ఏర్పడాలంటే కనీసం 20 ఏళ్లు పడుతుందని తెలిపారు. మానవ నాగరికత భవిష్యత్తును కాపాడాలంటే చంద్రుడే ఇప్పుడు సరైన మార్గమని వివరించారు.
READ MORE: Venky – Anil 4 : వెంకీ మామ.. అనిల్ రావిపూడి.. షూటింగ్ ఎప్పుడంటే
Also Read
- Google Maps: గూగుల్ మ్యాప్స్లో ఈ చిన్న సెట్టింగ్ మార్చండి.. పెట్రోల్ ఖర్చు తగ్గించుకోండి!
- China Robot: చైనా రోబోలు.. భారత్కు పొంచి ఉన్న ముప్పు..! డ్రాగన్ టార్గెట్ అదేనా?
- iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
- 6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
మస్క్ మాటల్లో చెప్పాలంటే, స్పేస్ఎక్స్ ఇప్పటికే చంద్రుడిపై నగరం నిర్మించే దిశగా అడుగులు వేసింది. ఎందుకంటే.. చంద్రుడికి వెళ్లడం సులువుగా మారింది. ప్రతి 10 రోజులకు ఒకసారి చంద్రుడి పైకి రాకెట్ పంపే అవకాశం ఉందట. ప్రయాణం కూడా కేవలం రెండు రోజుల్లో పూర్తవుతుందని మస్క్ వివరించారు. కానీ మార్స్కు వెళ్లాలంటే పరిస్థితి పూర్తిగా భిన్నమని పేర్కొన్నారు. భూమి, మార్స్ గ్రహాలు కక్షలో అనుకూలంగా ఉండే అవకాశం దాదాపు 26 నెలలకు ఒకసారి మాత్రమే వస్తుందట. అంతేకాదు, మార్స్ ప్రయాణానికి ఆరు నెలల సమయం పడుతుందట. చంద్రుడిపైకి వెళ్లడం ఈజీ అని మస్క్ తెలిపారు. అందుకే చంద్రుడిపై దృష్టి పెట్టామని స్పష్టం చేశారు. అయితే.. స్పేస్ ఎక్స్ మార్స్ను పూర్తిగా పక్కన పెట్టలేదని తెలిపారు. మార్స్ ప్రాజెక్ట్ కూడా స్పేస్ఎక్స్ దీర్ఘకాల లక్ష్యంలో భాగమేనని వెల్లడించారు. వచ్చే ఐదు నుంచి ఏడు సంవత్సరాల్లో మార్స్పై మానవ నివాసాన్ని ప్రారంభించే ప్రయత్నం కొనసాగుతుందని చెప్పారు. “మార్స్పై నగరం నిర్మించడమే మా తుదిలక్ష్యం. ఆ దిశలో కూడా మా ప్రయత్నాలు ఆగవు” అని మస్క్ తెలిపారు. ఇంతకుముందు మస్క్ 2026 చివరికి మార్స్కు మానవుల్లేని మిషన్ పంపాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. కానీ తాజా ప్రకటన చూస్తే, మార్స్ కంటే ముందు చంద్రుడిపై పెద్ద అడుగులు వేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. స్పేస్ఎక్స్ పెట్టుబడిదారులకు ముందుగా చంద్రుడిపై మిషన్లకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది. 2027 మార్చిలో చంద్రుడిపై మానవుల్లేని ల్యాండింగ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!