Bison : ఆరువేల ఏళ్ల తర్వాత పుట్టిన అడవి దున్న.. మాజీ ప్రధాని పేరు పెట్టుకున్న స్థానికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bison : సుమారు ఆరువేల సంవత్సరాల తర్వాత బ్రిటన్లో తొలిసారిగా ఓ బైసన్ పుట్టడం పట్ల అటవీశాఖ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలల క్రితం పుట్టిన దున్నకు సంబంధించిన తాజా చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. లిజ్ ట్రస్ ప్రధానిగా ఉన్నప్పుడు బైసన్ జన్మించింది. అందువల్ల స్థానికులు అడవి గేదెకు లిజ్ అని ముద్దుగా పేరు పెట్టారు. కానీ అటవీశాఖ మాత్రం ఇంతవరకు ఆ దున్నకు అధికారికంగా పేరు పెట్టలేదు.
గత ఏడాది జూలైలో, కెంట్లోని వెస్ట్ బ్లీన్ వుడ్స్ అడవుల్లోకి బైసన్ మందను ప్రవేశపెట్టారు. తరువాత సెప్టెంబర్ 9 న, లిజ్ జన్మించింది. ఆరు నెలల తర్వాత తీసిన ఫోటోల్లో లిజ్ సంపూర్ణ ఆరోగ్యంగా కనిపిస్తోంది. కొమ్ములు ఇప్పుడిప్పుడే వస్తున్నట్లు కనిపిస్తోంది. వైల్డ్ వుడ్ ట్రస్ట్ కోసం జూలాజికల్ ఆపరేషన్స్ డైరెక్టర్ మార్క్ హబెన్ మాట్లాడుతూ, బ్రిటన్ చరిత్రలో బైసన్ ఆరోగ్యకరంగా ఎదుగుతున్నట్లు తెలిపారు.
Also Read
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
Read Also: Dr Care Summer Health Camp: వేసవిలో ఊరట.. డా.కేర్ సమ్మర్ హెల్త్ క్యాంప్
అటవీశాఖలో బైసన్ను పునరుజ్జీవింపజేసే కార్యక్రమం విజయవంతమైందనడానికి అటవీ అధికారులు లిజ్ పుట్టుకను ఉదాహరణగా భావిస్తున్నారు. లిజ్ తన శరీరాన్ని చెట్లకు రుద్దడం, బురదలో స్నానం చేయడం వంటి ఇతర బైసన్ల పద్ధతులను అవలంబించడం ప్రారంభించింది. అదే సమయంలో, బైసన్తో పాటు బ్రిటన్లో అంతరించిపోయిన అనేక జంతువులను తిరిగి అడవుల్లోకి తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఎక్సమూర్ పోనీలు, ఇనుప యుగం నాటి పందులు, పొడవాటి కొమ్ము పశువులను రానున్న వారాల్లో తిరిగి అడవుల్లోకి తీసుకురానున్నారు.
వీరిని ప్రజలు కూడా దగ్గరగా చూసే అవకాశం ఉంటుందని సమాచారం. కానీ, బైసన్ను దగ్గరగా చూడటానికి అనుమతించరు. వీటిని 50 హెక్టార్ల కంచె ప్రాంతంలో ఉంచారు. త్వరలో వీటి ఆవాసాలను 200 హెక్టార్లకు విస్తరించాలని నిర్ణయించారు. పీపుల్స్ పోస్ట్కోడ్ లాటరీ ద్వారా సేకరించిన నిధులు జంతువులను తిరిగి అడవిలోకి ప్రవేశపెట్టడానికి ఉపయోగించబడుతున్నాయి.
Read Also:DK Aruna: అరెస్టయిన వారు పదే పదే కవిత పేరు ఎందుకు చెబుతున్నారో..
అటవీ ప్రాంతంలో అడవి దున్నలు చురుగ్గా మారడంతో సహజసిద్ధమైన మార్గాలను కూడా సిద్ధం చేయడం ప్రారంభించాయి. అడవిలో ఈ మార్పులు ఆశాజనకంగా ఉన్నాయని వైల్డర్ బ్లీన్ ప్రాజెక్ట్ మేనేజర్ స్టాన్ స్మిత్ చెప్పారు. అడవుల్లోకి తీసుకొచ్చిన జంతువుల ఆరోగ్యం, భద్రతను పరిశీలిస్తున్నారు.
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..