Resomation: నీటిలో అంత్యక్రియలు.. పలు దేశాల్లో వినియోగం.. ఇప్పుడు బ్రిటన్లో అందుబాటులోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Resomation: చనిపోయిన తర్వాత భౌతికకాయానికి మత సంప్రదాయాలను అనుసరించి ఖననం, దహనం చేయడం చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఎలక్ట్రిక్ పద్దతితో దహనసంస్కారాలు నిర్వహిస్తున్నారు. చాలా దేశాల్లో కూడా ఇదే తరహా దహనసంస్కారాలు అమలులో ఉన్నాయి. అయితే ‘నీటిలో అంత్యక్రియలు(Water Cremation)’ నిర్వహించే పద్ధతిని కొన్ని దేశాలు అమలు చేస్తున్నాయి. రిసోమేషన్ అనే పిలువబడే ఈ ప్రక్రియ ఇప్పటికే కొన్ని దేశాల్లో అమలులో ఉంది. తాజాగా బ్రిటన్ కూడా ఈ తరహా పద్దతికి అనుమతి ఇచ్చింది. ఈ రిసోమేషన్(Resomation) త్వరలోనే బ్రిటన్ లో అందుబాటులోకి రానుంది.
Read Also: Jagdeep Dhankhar: యూనిఫాం సివిల్ కోడ్ తీసుకువచ్చే సమయం వచ్చింది.. ఉప రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
Also Read
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- Trump: మోజ్తబా ఖమేనీ చనిపోయడని అనుకోవట్లేదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
అసలేంటి ఈ రిసోమేషన్.. ఏయే దేశాల్లో అమలులో ఉంది..?
నీటి సహాయంతో అంత్యక్రియలు నిర్వహించే పద్దతిని రిసోమేషన్ అని పిలుస్తారు. దీనిలో ఎటువంటి మంట ఉండదు. పోటాషియం హైడ్రాక్సైడ్, నీటి సహాయంతో మృతదేహాన్ని విచ్ఛిన్నం చేసే ప్రక్రియ ఇది. తొలుత మృతదేహాన్ని ఓ బయోడీగ్రేడబుల్ బ్యాగులో చుట్టి పెడతారు. అనంతరం 95శాతం నీరు, ఐదు శాతం పొటాషియం హైడ్రాక్సైడ్తో కూడిన వేడి ద్రావణమున్న కంటైనర్లో ఉంచుతారు. దీన్నే ‘బాయిల్ ఇన్ ది బ్యాగ్’గా వ్యవహరిస్తారు. రసాయన చర్య అనంతరం కొన్ని ద్రవాలు బయటకు రాగా.. మిగిలిపోయిన ఎముకలను పొడి చేసి మృతుల బంధువులకు అప్పగిస్తారు. ఈ పద్ధతి పూర్తికావడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. ఎటువంటి గాలి కాలుష్య కారకాలు, విషపూరిత వాయువులూ వెలువడవు. అక్వామేషన్, ఆల్కలైన్, హైడ్రాసిస్ అని కూడా పిలిచే ఈ ప్రక్రియను అత్యంత సురక్షితమని పరిశోధకులు చెబుతున్నారు.
ఇప్పటికే ఈ విధానాన్ని కెనడా, దక్షిణాఫ్రికా, అమెరికాలోని పలు రాష్ట్రాల్లో వినియోగిస్తున్నారు. తాజాగా బ్రిటన్ కూడా ఈ పద్ధతికి ఆమోద ముద్ర వేసింది. సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే మూడోవంతు తక్కువగా ఉద్గారాలు విడుదల అవుతాయని బ్రిటన్కు చెందిన ‘కో-ఆప్ ఫ్యూనెరల్ కేర్’ అనే అంత్యక్రియలు నిర్వహించే సంస్థ వెల్లడించింది. దీనికి అయ్యే ఖర్చు కూడా సంప్రదాయ పద్ధతుల్లో అంత్యక్రియల మాదిరిగానే ఉంటుందని తెలిపింది. సాధారణంగా ఒక దహన ప్రక్రియాలో దాదాపుగా 245 కిలోల కార్బన్ విడుదల అవుతుంది. ఇలా బ్రిటన్ దహన సంస్కారాల్లో వందట టన్నుల వాయువులు విడుదల అవుతున్నట్లు సీడీఎస్ అనే సంస్థ వెల్లడించింది. మరోవైపు ఈ విధానాన్ని ప్రస్తుతం కొన్నిచోట్ల ప్రారంభిస్తున్నామని.. మరికొన్ని రోజుల్లోనే బ్రిటన్ వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు ‘కో-ఆప్ ఫ్యూనెరల్ కేర్’ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న సంప్రదాయ పద్ధతులైన దహన, ఖనన విధానాలకు ప్రత్యామ్నాయం ఇదేనని పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..