Puri Jagannath Temple: ఆలయానికి 250 కోట్లు విరాళమిచ్చిన ఒడిశా ఎన్నారై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puri Jagannath Temple: ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి దేవాలయం దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఆ గుడిలో జరిగే రథోత్సవం ఎంత ప్రసిద్ధమో మనకు తెలుసు. ఈ ఆలయ వార్షిక రథోత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. దేశంలోని కొన్ని ప్రాంతాలలో జగన్నాథ ఆలయాలు ఈ విధంగా నిర్మించబడ్డాయి. పూరీ తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలోనూ జగన్నాథ దేవాలయం ఉంది. అయితే వాటన్నింటిని మించిపోయే భారీ ఆలయం త్వరలో సిద్ధమవుతుంది. కాకపోతే అది మన దేశంలో కాదండోయ్ విదేశాల్లో.
బ్రిటన్లో తొలి జగన్నాథ ఆలయ నిర్మాణం జరుగుతోంది. రూ. వందల కోట్లతో నిర్మిస్తున్నారు. లండన్ శివారులో నిర్మించనున్న ఈ ఆలయం కోసం స్థానికులంతా కలిసి శ్రీ జగన్నాథ సొసైటీ యూకే (ఎస్ జేఎస్ యూకే) అనే సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సొసైటీ దేశవ్యాప్తంగా ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో ఒడిశాకు చెందిన ప్రవాస భారతీయుడు బిశ్వనాథ్ పట్నాయక్ రూ.కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆలయ నిర్మాణానికి 250 కోట్లు. విదేశాల్లో ఆలయ నిర్మాణానికి ఇంత పెద్ద మొత్తంలో విరాళం రావడం ఇదే తొలిసారి. శ్రీ జగన్నాథ సొసైటీ యూకే పేరుతో ఏర్పాటైన కమిటీ అక్షయ తృతీయ నాడు ఆలయ నిర్మాణ పనులను ప్రారంభించింది. ఈ వేడుకకు బిశ్వనాథ్ను కూడా ఆహ్వానించారు. భూరి విరాళం బిశ్వనాథ్ పట్నాయక్ వృత్తి రీత్యా UKలో స్థిరపడ్డారు. అతను లండన్లోని ఫిన్నెస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపక చైర్మన్.
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
ఇదిలా ఉంటే లండన్ శివారులో దాదాపు 15 ఎకరాల్లో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. SJSUK 2024 చివరి నాటికి ఆలయ మొదటి దశ నిర్మాణ పనులను పూర్తి చేయాలని యోచిస్తోంది. శ్రీ జగన్నాథ్ సొసైటీ UK ఛైర్మన్ డాక్టర్ సహదేవ్ స్వైన్ మాట్లాడుతూ, ఈ ఆలయం యూరప్లో జగన్నాథ సంస్కృతికి కేంద్రంగా మారుతుందని అన్నారు. వేలాది మంది భక్తులు, పర్యాటకులను ఆకర్షిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తన ఎన్నికల ప్రచారంలో జగన్నాథ స్వామి ఆలయాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
PM Modi: ప్రకాశ్ సింగ్ బాదల్కి ప్రధాని మోడీ నివాళి
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!