Nurse: ఏడుగురు నవజాత శిశువులను చంపిన నర్సు.. గుర్తించిన భారత సంతతి వైద్యుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన పైశాచికం వల్ల అప్పుడే పుట్టిన ఏడుగురు నవజాత శిశువుల ప్రాణాలను తీసింది ఓ నర్సు. తన వృత్తికే కాదు.. మానవత్వానికి మచ్చ తీసుకొచ్చింది. ఈ హృదయ విదారక ఘటన ఇంగ్లాండ్ లో జరిగింది. యునైటెడ్ కింగ్డమ్లోని చెస్టర్ హాస్పిటల్లో పనిచేస్తున్న లూసీ లెట్బీ అనే నర్సు.. ఏడుగురు నవజాత శిశువులను హత్య చేయగా.. మరో ఆరుగురు చిన్నారులను హత్యాయత్నానికి పాల్పడినట్లు మాంచెస్టర్ క్రౌన్ కోర్టు నిర్ధారించింది. పిల్లలను చంపేందుకు ఇన్సులిన్ ఇంజెక్ట్ చేయడం, నరాల్లోకి గాలి నింపడం, అధిక మోతాదులో పాలు ఇవ్వడం వంటి పద్ధతులను ఉపయోగించినట్లు అధికారులు కనుగొన్నారు.
Jagga Reddy: పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన జగ్గారెడ్డి.. ఇది ఫైనల్..!
Also Read
- iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
- Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
ఈ మారణ దుశ్చర్యకు పాల్పడుతున్న విషయాన్ని భారత సంతతి వైద్యుడు రవి జయరాం గుర్తించాడు. దీంతో ఈ విషయం బయటపడింది. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. మరోవైపు చిన్నారుల హత్య ఘటనపై భారత సంతతి వైద్యుడు రవి జయరాం కీలక విషయాలను తెలిపారు. తాను ఆ నర్సు గురించి ముందే హెచ్చరించానని, అప్పుడే గుర్తించి ఉంటే.. ఆ పసికందుల ప్రాణాలు మిగిలిఉండేవని విచారం వ్యక్తం చేశారు. 2015-16 నుంచే ఈ దారుణాలకు పాల్పడుతుందని డాక్టర్ తెలిపారు. మరోవైపు లూసీ లెట్బీ (33)ని కోర్టు దోషిగా నిర్ధారించింది. ఆ నర్సును పట్టించడంలో ముఖ్యపాత్ర పోషించిన డాక్టర్ జైరామ్ సహా ఇతర వైద్యులు చేసిన ఫిర్యాదుతో ఈ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఇదే ఆసుపత్రిలో జయరాం పిల్లల డాక్టర్ గా పనిచేస్తున్నారు.
Gold Seized: లుంగీలో బంగారం.. కేటుగాడి గుట్టురట్టు చేసిన కస్టమ్స్ అధికారులు
తీర్పు అనంతరం రవి జయరాం మీడియాతో మాట్లాడుతూ.. హత్యకు గురైన పిల్లలు బతికి ఉంటే…ఈరోజు ఆ పిల్లలు పాఠశాలకు వెళ్తుండే వారన్నారు. 2015 జూన్లో ముగ్గురు నవజాత శిశువులు మరణించినప్పుడు.. తాను ఆందోళన వ్యక్తం చేశానని ఆయన చెప్పారు. ఎక్కువ మంది పిల్లలు చనిపోతే.. నా తోటి సీనియర్ వైద్యులు కూడా సమావేశాలు నిర్వహించి ఆసుపత్రి పాలకవర్గ అధికారులతో ఆందోళన వ్యక్తం చేశామని పేర్కొన్నారు. ఈ విషయంలో పోలీసులను కలిసేందుకు 2017 ఏప్రిల్లో నేషనల్ హెల్త్ సర్వీస్ ట్రస్ట్ అనుమతించిందని డాక్టర్ జైరాం తెలిపారు. చిన్నారుల అనుమానాస్పద మరణాల గురించి తాము పోలీసులకు చెప్పడంతో.. పోలీసులు దానిపై దర్యాప్తు ప్రారంభించారు. పోలీసు విచారణలో నర్స్ లూసీపై తొలిసారి అనుమానం వచ్చింది. విచారణ, వివరణాత్మక విచారణ తర్వాత ఆమెను అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
-
Tilak Varma Fifty: కీలక హాఫ్ సెంచరీ చేసినా.. చెత్త జాబితాలో తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ!
-
Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
-
G2: అడివి శేష్ స్పై థ్రిల్లర్కు బ్రేకులు.. ఈ ఏడాది రిలీజ్ కష్టమేనా?
-
Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!