రైతు మల్లికార్జున రెడ్డి చేస్తున్న ప్రకృతి వ్యవసాయం అందరికీ ఆదర్శమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలేసి ప్రకృతి వ్యవసాయం చేస్తూ పంట దిగుబడి రెట్టింపు చేసి లాభాలు ఆర్జించడమే కాకుండా పర్యావరణాన్ని, మనుషుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు క్రుషి చేస్తున్నారని పేర్కొన్నారు. రసాయన ఎరువులు వాడే రైతాంగంతోపాటు నేటి యువత మల్లికార్జున రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా…
సైబరాబాద్ పరిధిలో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షల అమలు చేస్తున్నామన్నారు ట్రాఫిక్ డీసీపీ మాదాపూర్ డీవీ శ్రీనివాస్. ఇవాళ ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. ట్రాఫిక్ రద్దీ దృశ్య నిబంధనలు కటినతరం చేసామని, సైబరాబాద్ లిమిట్స్ లో ట్రాఫిక్ వాయిలేశన్ 11వేల కేసులు నమోదు చేసామన్నారు. రాంగ్ రూట్ లో వాహనం నడిపి ఆక్సిడెంట్ చేస్తే 304 పార్ట్2 ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. హేవి వాహనాలు డిసిఎం, వాటర్ ట్యాంకర్స్, ఆర్ ఎంసీ, జేసీబీ, ట్రాక్టర్ వాహనాలు ఉదయం…
పార్టీ ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల అమలు కోసం శాసనసభలో పార్టీ తరఫున ఒత్తిడి కొనసాగిస్తామన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ కి గుర్తు చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. హామీలను తప్పించుకునే ప్రయత్నం చేస్తే అసెంబ్లీలో ఉన్న బలమైన ప్రతిపక్షాలు శాసనసభ వేదికగా ప్రశ్నిస్తాయని, శాసనమండలి సభ్యులు పార్టీకి కండ్లు, చెవుల మాదిరిగా పనిచేయాలన్నారు. శాసనమండలి సభ్యులు కూడా…
యూకేకు చెందిన ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్ (SIGH) హైదరాబాద్ లో తమ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. ఇప్పటివరకు దేశంలో తయారు చేయని పలు సర్జికల్ పరికరాలను ఇక్కడ తయారు చేస్తారు. రాబోయే రెండు మూడు ఏండ్లలో అందుకు అవసరమయ్యే రూ.231.5 కోట్ల పెట్టుబడులు పెడుతామని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలో భాగంగా ఈ కంపెనీ భారతీయ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. ఈ ఫెసిలిటీ ఏర్పాటుతో హెల్త్ కేర్…
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడ లో రామోజీ ఫౌండేషన్ సహకారంతో నూతన ఆర్టీఏ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు. ముఖ్య అతిధిగా హాజరై ఆర్టీఏ నూతన కార్యాలయాన్ని రవాణా & బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి , రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కే. శశాంక్, జడ్పి చైర్మన్ తీగల అనితారెడ్డి, తుర్కాయంజల్ మున్సిపల్ చైర్మన్ మల్రెడ్డి అనురాధ రాంరెడ్డి, ట్రాన్స్ పోర్ట్ కమిషనర్…
గవర్నర్ కోటా రెండు ఎమ్మెల్సీల భర్తీపై తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా కింద ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయించారు. తమ ఎమ్మెల్సీ నామినేషన్ల తిరస్కరణను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ కుమార్, కె. సత్యనారాయణ దాఖలు చేసిన రెండు పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్ల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఆ…
ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమం పరువు పోతోందని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ బుధవారం అన్నారు. ప్రజావాణిలో హాజరయ్యి ప్రజల సమస్యల పరిష్కారానికి తప్పకుండా హాజరవ్వాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ ఎంతో ఆర్భాటంగా చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజా సంబంధాల సాధనగా మారిందని అన్నారు. రెండు వారాల పాటు కార్యక్రమానికి హాజరైన ఆయన క్యాబినెట్ సహచరులు తమ ఫిర్యాదులకు పరిష్కారం దొరుకుతుందనే ఆశతో అందరు ప్రాతినిధ్యాలు ఇవ్వడానికి వస్తున్న ప్రజలను కలవడం మానేశారు.…
జేఎస్ డబ్ల్యూ ఎనర్జీ (JSW Energy) అనుబంధ సంస్థ JSW నియో ఎనర్జీ, తెలంగాణ లో రూ.9,000 కోట్ల పెట్టుబడితో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం JSW నియో ఎనర్జీ మధ్య ఈ అవగాహన ఒప్పందం (MOU) కుదిరింది. దావోస్ లో జేఎస్ డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో సమావేశమై ఈ ప్రాజెక్టుపై చర్చలు జరిపారు. ఈ కొత్త…
తెలంగాణలో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు వెబ్ వెర్క్స్ రూ.5200 కోట్ల పెట్టుబడులకు సిద్ధపడింది. డేటా సెంటర్ల నిర్వహణలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఐరన్ మౌంటెన్ అనుబంధ సంస్థ వెబ్ వెర్క్స్. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఐరన్ మౌంటేన్ సీఈవో విలియం మీనీ, వెబ్ వెర్క్స్ సీఈవో నిఖిల్ రాఠీతో సమావేశమయ్యారు. తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటు, నిర్వహణపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రూ.5200 పెట్టుబడులకు వెబ్ వెర్క్స్ కంపెనీ…
రాష్ట్రంలో గత పదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేపట్టిన పలు కార్యక్రమాల వల్లనే రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గిపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టీ హరీశ్రావు బుధవారం అన్నారు. బహుమితీయ పేదరిక సూచీ 13.18 శాతం నుంచి 3.76 శాతానికి బాగా క్షీణించడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం పేరుతో సాగుతున్న దుష్ప్రచారాలకు తగిన సమాధానం. తదుపరి పార్లమెంట్ ఎన్నికల కోసం నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గం యొక్క సన్నాహక సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, NITI…