అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠకు సన్నాహాలు తుది దశలో ఉన్నాయి. ఈలోగా, రాంలాలా ముఖం యొక్క మొదటి చిత్రం శుక్రవారం వెలువడింది. ఈ రాంలాలా విగ్రహం 5 సంవత్సరాల నాటిది, దీనిని కర్నాటక ప్రత్యేక రాయితో తయారు చేశారు. రాంలాలా విగ్రహాన్ని కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. విగ్రహం పిల్లల రూపంలో ఉంటుంది మరియు సుమారు 1800 కిలోగ్రాముల బరువు ఉంటుంది. రాంలాలా ముఖం యొక్క మొదటి చిత్రం బయటకు వచ్చిన తర్వాత, దేశవ్యాప్తంగా…
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా కొనసాగుతుందని రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోషం వ్యక్తం చేశారు.. ఆర్టీసీ అద్దె బస్సు యజమానులు ఎదుర్కుంటున్న సమస్యల పై మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో అద్దె బస్సుల యజమానులతో సమావేశాన్ని నిర్వహించారు.. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అద్దె బస్సుల యజమానులు స్వాగతించారు.. కాని తమ బస్సుల పై పడుతున్న భారాన్ని మంత్రి దృష్టికి…
ముఖ్యమంత్రి దావోస్ పర్యటన విజయవంతమైంది. రూ.40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలతో తెలంగాణ కొత్త రికార్డు నెలకొల్పింది. గత ఏడాది దావోస్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన పెట్టుబడుల మొత్తం కంటే ఇది రెండింతలు. అదానీ గ్రూప్, JSW, వెబ్ వర్క్స్, టాటా టెక్నాలజీస్, BL ఆగ్రో, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్, గోడి ఎనర్జీ, అరజెన్ లైఫ్ సైన్సెస్, ఇన్నోవెరా ఫార్మాస్యూటికల్స్, క్యూ సెంట్రియో, సిస్ట్రా, ఉబర్, ఓ9 సొల్యూషన్స్ తదితర కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధతను…
లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి భారతీయ మూలాలున్న బ్రిటిష్ పార్లమెంట్ మెంబర్లను కలుసుకున్నారు. చారిత్రాత్మకమైన వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ లో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘భారత్ మరియు బ్రిటన్ మధ్య బలమైన బంధాలలో ఒకటైన ప్రజాస్వామ్యం. ఇప్పుడు ప్రపంచం ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచడమే అత్యవసరం…’అన్నారు. వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ ను యునెస్కో 1016 సంవత్సరంలోనే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ చారిత్రక…
పవిత్రమైన వైద్య వృత్తిలో కొనసాగుతూ యువకులను మాయ మాటలతో లోబర్చుకుని హోమో సెక్స్ కు పాల్పడుతున్న వైద్యుడు డాక్టర్ జవ్వాద్ అలి ఖాజాపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని వైద్యుని భార్య అంజుమ్ బేగం విజ్ఞప్తి చేశారు. మౌలాలికి చెందిన డాక్టర్ జవ్వాద్ అలి ఖాజాతో తనకు 2014లో వివాహం జరిగిందని, తమకు ఇద్దరూ పిల్లలు ఉన్నారని ఆమె తెలిపారు. వివాహ సమయంలో తమ తల్లిదండ్రులు జవ్వాద్ కు కట్నకానుకల కింద 25 లక్షల…
రెండు మూడు రోజుల్లో సీతారామ ప్రాజెక్టుల సందర్శనకు మంత్రులందరం వెళతామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… తాము ఏదో చేస్తున్నామని భ్రమలు కల్పించారు బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు అని ఆయన మండిపడ్డారు. 1500 కోట్లతో పూర్తి అయ్యే ప్రాజెక్టులు 2981 కోట్లకు అంచనా వ్యయం పెంచారన్నారు. ఇరిగేషన్ మంత్రిగా నేనే నిర్ఘాంత పోయా.. ఇరిగేషన్ శాఖను ద్వంసం చేశారని, 94 వేల కోట్లు ఖర్చు చేస్తే కాళేశ్వరంలో లక్ష ఎకరాలకు నీరు ఇవ్వలేదన్నారు.…
భారత పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి.. సెర్బియా పర్యటనకు రావాల్సిందిగా ఆహ్వానం అందింది. ఈఏడాది ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు బెల్గ్రేడ్లో జరిగే.. 45వ ఇంటర్నేషనల్ టూరిజం ఫెయిర్ (ITF)కు హాజరుకావాలని.. సెర్బియా పర్యాటక శాఖ మంత్రి శ్రీ హుసేన్ మెమిక్ ఆహ్వాన పత్రాన్ని పంపించారు. యూరప్, సెర్బియా ప్రాంతంలో పర్యాటక రంగాభివృద్ధికి జరిగే అతిపెద్ద ఈవెంట్కా ఇది. గత 30 ఏళ్లుగా ఈ కార్యక్రమం జరుగుతోండగా.. ఈసారి ‘అడ్వెంచర్ బిగిన్స్ హియర్’ అనే…
మూసీ నది పునరుజ్జీవన ప్రణాళికలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు, మూసీ ప్రాజెక్టుకు అపెక్స్ బాడీ మద్దతు మరియు భాగస్వామ్యానికి హామీ ఇచ్చింది. థేమ్స్ నది అపెక్స్ గవర్నింగ్ బాడీ అధికారులతో ముఖ్యమంత్రి బహు కోణాల అంశాలు మరియు విభిన్న వాటాదారుల ప్రభావ అధ్యయనాలపై చర్చించారు. మూసీ నది కానీ హుస్సేన్సాగర్ సరస్సు చుట్టూ కేంద్రీకృతమై ఉండటం మరియు ఉస్మాన్సాగర్ వంటి ఇతర ప్రధాన నీటి వనరుల…
జాంబియాకు చెందిన 7 ఏళ్ల బాలిక తన 14 ఏళ్ల సోదరుడికి బోన్ మ్యారోను దానం చేయడంతో సికింద్రాబాద్లోని కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) హాస్పిటల్లోని సర్జన్లు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ (BMT)ని విజయవంతంగా పూర్తి చేశారు. జాంబియాలోని లుసాకాకు చెందిన కుటుంబం సికిల్ సెల్ వ్యాధితో తీవ్రంగా పోరాడుతున్న తమ కొడుకు కోసం కిమ్స్ ఆసుపత్రిలో వైద్య సహాయం కోరింది. BMT విభాగాధిపతి, హెమటో-ఆంకాలజిస్ట్ మరియు BMT నిపుణుడు డాక్టర్ నరేందర్ కుమార్…
ఉమ్మడి నీటిపారుదల ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్లను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ద్వారా కేంద్రం ఆధీనంలోకి తీసుకువస్తామని వస్తున్న వార్తలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రెండు ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావడం వల్ల తెలంగాణపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియా ప్రతినిధులతో హరీశ్రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రయోజనాలకు నీరు చాలా కీలకమని, రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధిని…