ఎమ్మెల్సీలుగా మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ లు ఏకగ్రీవ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నేడు మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఎమ్మెల్సీ ఎన్నిక ధ్రువీకర పత్రం తీసుకున్నారు వెంకట్..మహేష్ గౌడ్. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలు కావడం సంతోషంగా ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మహేష్ కుమార్ గౌడ్ ఎలాంటి పదవి ఆశించకుండా పార్టీ గెలుపుకోసం కృషి చేశాడని, బల్మూరి వెంకట్…
2018లో ధరణి సర్క్యులర్, 2020లో చట్టం తీసుకు వచ్చారని, తర్వాత మంత్రుల కమిటీ కూడా వేశారన్నారు ధరణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమస్య పరిష్కారం కాకపోగా ఒకదాని కు మరొదనికి సంబందం లేదని, ధరణి చట్టంలోనే చాలా లోపాలు ఉన్నాయన్నారు. భూమి హక్కు విషయంలో గతంలో సమర్థవంతంగా ఉన్నాయని, 2014 నుంచి ఇప్పటి వరకు రెవెన్యూ హక్కు హరించి పోయిందన్నారు. రెవెన్యూ వ్యవస్థలో చిన్న చిన్న ఇబ్బందులు తప్ప గతంలో…
‘రామ్ కే నామ్’ డాక్యుమెంటరీని ప్రదర్శించినందుకు ముగ్గురిని అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. రామ్కే నామ్ డాక్యుమెంటరీ ప్రదర్శనను మధ్యలోనే ఎందుకు నిలిపివేసి ముగ్గురిని అరెస్టు చేశారో వివరించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ను హైదరాబాద్ ఎంపీ కోరారు. “అవార్డ్ విన్నింగ్ డాక్యుమెంటరీని ప్రదర్శించడం ఎలా నేరం? అలా అయితే, సినిమాకు అవార్డు ఇచ్చినందుకు భారత ప్రభుత్వం & ఫిల్మ్ఫేర్ను కూడా జైలులో పెట్టాలి. సినిమా చూసే ముందు పోలీసుల నుంచి…
యాగగిరిగుట్ట మండలం మల్లాపురంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు రెవెన్యూ అధికారులు పోలీసుల సహకారంతో కూల్చివేశారు. 100 మంది పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు అర్ధరాత్రి దాటిన తర్వాత బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకుని బుల్డోజర్తో కూల్చివేశారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య మాట్లాడుతూ రెండేళ్ల క్రితం మల్లాపురంలో 150 గజాల్లో పార్టీ మండల కార్యాలయాన్ని నిర్మించారన్నారు. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే దేవాదాయ శాఖ…
ఐదు శతాబ్దాల కల నెరవేరబోతోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మరికొద్ది గంటల్లోనే జన్మభూమిలో రామయ్య కొలువుదీరబోతున్నాడు. 150కిపైగా దేశాల్లో నివసిస్తున్న హిందూ బంధువులంతా అయోధ్యలో మరికొద్ది గంటల్లో జరగబోయే శ్రీరామచంద్రుడి విగ్రహ ప్రాణ: ప్రతిష్ట కార్యక్రమ మహోత్సవాన్ని వీక్షించేందుకు బిలియన్ కన్నులతో ఆసక్తితో ఎదురు చూస్తున్నరు. ఆ క్షణం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కరీంనగర్ హిందూ బంధువులంతా మరి కొద్ది గంటల్లో తరలివచ్చేందుకు నగరంలోని చైతన్యపురి మహాశక్తి ఆలయం వేదిక…
సీఎం రేవంత్ రెడ్డి లండన్ మాట్లాడిన మాటల్లో తప్పేముంది..? అని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళోజి నారాయణ రావు మాటలను.. ప్రాంతం వాడు ద్రోహం చేస్తే అనే మాటలను బి. ఆర్. ఎస్ నేతలకు వర్తిస్తుంది ..అందుకే సీఎం మాట్లాడాడని ఆయన అన్నారు. కేసీఆర్ పదేళ్లు రాష్టాన్ని కమీషన్ లకు కక్కుర్తి పడి అప్పులకుప్పగా మార్చారని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం.. మీ ధన దాహానికి ప్రత్యక్ష ఉదాహరణ అని…
చారిత్రక సాలార్జంగ్ మ్యూజియంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో కొత్తగా నిర్మించిన రెండు అధునాతన బ్లాక్లను కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం యూరోపియన్ మార్బుల్ గ్యాలరీ ని సందర్శించారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ.. 1951 డిసెంబర్లో ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మకమైన సాలార్జంగ్ మ్యూజియం.. రోజురోజుకూ కొత్త కళాకృతులు, దేశ, విదేశాల చిత్రాలను ప్రదర్శిస్తూ.. 72 ఏళ్లుగా సందర్శకులను ఆకట్టుకుంటూనే ఉందన్నారు. పరిస్థితులకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకుంటుండటం హర్షదాయకమన్నారు. ఇవాళ కూడా ఈ…
దుబాయ్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, రాష్ట్ర అధికారుల బృందంతో కలిసి దుబాయ్ వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టును సందర్శించారు. ఆదివారం మధ్యాహ్నం ఒక స్కై స్కాపర్ (ఆకాశ హర్మ్యం) పైకి వెళ్లి ఏరియల్ వ్యూ లా కనిపించే వాటర్ ఫ్రంట్ అందాలను తిలకించారు. చుట్టూ నీళ్లు.. పక్కనే ఆకాశాన్ని అంటుతున్నట్లు కనిపించే అందమైన భవంతులు, నీళ్ల చుట్టూ అందమైన రహదారులతో ఒకదానికొకటి అనుబంధంగా రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు దుబాయ్లో పర్యాటకులను అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ప్రాజెక్టు…
పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ అనువైన రాష్ట్రమని, కాబట్టి తెలంగాణలో పెట్టబడులు పెట్టడానికి ముందుకురావాలని పలు బహుళజాతి కంపెనీలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. పెట్టబడులు సాధనలో భాగంగా సౌదీ అరెబియాలో పర్యటిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు ఆదివారం నాడు జెడ్డాలో పలు సంస్థల ప్రతినిధులతో రాత్రి వరకు వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. సౌదీ యువరాజు ప్రత్యేక కార్యాలయపు జనరల్ డైరెక్టర్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ రాయెస్ తో మంత్రి…
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి ఆదివారం దుబాయ్లో ప్రముఖ గ్లోబల్ సిటీ ప్లానర్లు, డిజైనర్లు, ఆర్కిటెక్ట్లతో సవివరంగా చర్చించారు. వివిధ సమావేశాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి లండన్ నుంచి దుబాయ్ వెళ్లారు. బ్యాక్-టు-బ్యాక్ సమావేశాలు ప్రధానంగా 56-కిమీ పొడవున్న మూసీ రివర్ ఫ్రంట్, గ్రీన్ అర్బన్ స్పేస్లను అభివృద్ధి చేయడం మరియు వాణిజ్య అనుసంధానాలు మరియు పెట్టుబడి నమూనాలను అన్వేషించడంపై దృష్టి సారించాయి. అధికారిక ప్రకటన ప్రకారం, దుబాయ్లోని సమావేశాలు 70కి పైగా విభిన్న…