Mahashakti Temple : రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ట.. ముస్తాబైన కరీంనగర్ మహా శక్తి ఆలయం
ఐదు శతాబ్దాల కల నెరవేరబోతోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మరికొద్ది గంటల్లోనే జన్మభూమిలో రామయ్య కొలువుదీరబోతున్నాడు. 150కిపైగా దేశాల్లో నివసిస్తున్న హిందూ బంధువులంతా అయోధ్యలో మరికొద్ది గంటల్లో జరగబోయే శ్రీరామచంద్రుడి విగ్రహ ప్రాణ: ప్రతిష్ట కార్యక్రమ మహోత్సవాన్ని వీక్షించేందుకు బిలియన్ కన్నులతో ఆసక్తితో ఎదురు చూస్తున్నరు. ఆ క్షణం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కరీంనగర్ హిందూ బంధువులంతా మరి కొద్ది గంటల్లో తరలివచ్చేందుకు నగరంలోని చైతన్యపురి మహాశక్తి ఆలయం వేదిక కాబోతోంది. రేపు సాయంత్రం 5 గంటలకు జిల్లాలోని యావత హిందూ భక్తులంతా మహాశక్తి ఆయలం వద్దకు రాబోతున్నారు. రామదండుకు కన్నుల పండుగ చేసేందుకు మహాశక్తి ఆలయ నిర్వాహకులు అమ్మవారి ఆలయం వద్దే సైతిక (ఇసుకతో నిర్మించిన) అయోధ్య రామాలయాన్ని ఏర్పాటు చేశారు. అంతేగాకుండా విద్యుత్ దీపాలతో మహశక్తి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
మరోవైపు జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు విద్యారణ్య భారతి స్వామి దివ్య ఆశీస్సులతో సోమవారం ఉదయం 9 గంటలకు రామనామ సంకీర్తన, శ్రీ రామరక్షాస్తోత్రం, హనుమాన్ చాలీసా పారాయణం, సీతారామచంద్రస్వామి అభిషేకం, మన్యు సూక్త హోమం – పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
కరీంనగర్ కు చెందిన సైతక శిల్ప కళాకారుడు ) ఆకుల వెంకటేష్ మహాశక్తి ఆలయం వద్ద ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా 10 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పుతో ఇసుకతో అయోధ్య రామమందిరాన్ని రూపొందించారు. నేటి (22న) సాయంత్రం నుండి భక్తులు తిలకించడానికి సైకిత రామాలయాన్ని రూపొందించారు. అనంతరం మంగళవారం నుంచి సైకిత అయోధ్య రామాలయ రూపకల్పనకు వినియోగించిన ఇసుకను భక్తులకు వితరణ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ స్పందిస్తూ… హిందూ బంధువులంతా భవ్యమైన దివ్యమైన అయోధ్య రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా రేపు(ఈనెల 22న) సాయంత్రం తమ తమ ఇండ్లల్లో ఐదు రామ జ్యోతులు వెలిగించాలని పిలుపునిచ్చారు. శతాబ్దాల కల నెరవేరబోతున్న శుభ ఘడియలు ఆసన్నమైనందున హిందూ బంధువులంతా రేపు శ్రీరామచంద్రుడి విగ్రహ ప్రాణ ప్రతిష్టను వీక్షిస్తూ దీపావళి సంబురాలు జరుపుకోవాలి.
ఈ మహా పర్వదినం వేళ పెద్ద ఎత్తున ప్రజలు ఆలయాలను సందర్శించుకునేందుకు హిందూ బంధువులంతా సంసిద్ధమైనందున ప్రభుత్వం కరెంట్, తాగునీటితోపాటు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. నిబంధనల పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని ప్రభుత్వానికి విజ్ఝప్తి చేశారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని హిందూ బంధువులంతా రేపు సాయంత్రం కరీంనగర్ చైతన్యపురి మహాశక్తి అమ్మవారి ఆలయం వద్దకు రావాలని కోరారు. అక్కడ రూపొందించిన అయోధ్య రామాలయ సైకిత ఆలయాన్ని సందర్శించుకున్న అనంతరం నేరుగా తెలంగాణ చౌక్ కు తరలివచ్చి టపాసులు కాల్చి సంబురాలు చేసుకోవాలని కోరారు. అంతేగాకుండా కరీంనగర్ సహా హిందూ బంధువులంతా రేపు (సోమవారం) సాయంత్రం 6 గంటలకు ఒక్కొక్కరు తమ తమ ఇండ్లలో 5 రామ జ్యోతులను వెలుగించాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
-
RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?