బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ సోనూసూద్ ను ఇప్పటి వరకూ విలన్ గానే చూశాము. అయితే తాజాగా ఈ విలన్ హీరోగా టర్న్ తీసుకున్నాడు. జీ స్టూడియోస్ తదుపరి యాక్షన్ థ్రిల్లర్లో సోనూ సూద్ హీరోగా కనిపించనున్నారు. తాజాగా జీ స్టూడియోస్ తన తదుపరి ప్రొడక్షన్ ‘ఫతే’ను ప్రకటించింది. దీనికి అభినందన్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సోనూ సూద్ నటించిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామా. నిజ జీవిత సంఘటనల నుండి…
బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్ సిక్కు వివాదంలో ఈరోజు ముంబై పోలీసుల ఎదుట హాజరు కానుంది. కంగనా బుధవారం తన స్టేట్మెంట్ను రికార్డ్ చేయడానికి ముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సి ఉంది. అయితే ఆమె కొన్ని వ్యక్తిగత పనుల కారణంగా అక్కడికి చేరుకోలేకపోయింది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం కంగనా రనౌత్ ఈరోజు ఉదయం 11 గంటలకు తన స్టేట్మెంట్ను రికార్డ్ చేయడానికి ఖార్ పోలీస్ స్టేషన్కు చేరుకోవచ్చు. సిక్కు వివాదం ఏంటి ?వాస్తవానికి కంగనా…
రాధే శ్యామ్ ట్రైలర్ నిడివి కన్ఫర్మ్..? ఆ విషయాల్లో టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచిన సమంత..! బికినీ.. లిప్లాక్తో హీటెక్కించిన దీపిక.. వెబ్ సిరీస్లో జర్నలిస్ట్గా అక్కినేని హీరో..? జెట్ స్పీడ్లో దూసుకెళ్తున్న స్టార్ డ్డైరెక్టర్ డాటర్..! బిగ్గెస్ట్ ఐమాక్స్ స్క్రీన్లో రాధే శ్యామ్ స్పెషల్ షో… హాట్ కెక్లా మారిన టికెట్స్.. భీమ్లా నాయక్ ఎంట్రీతో తగ్గిన వెంకటేష్.. వరుణ్ తేజ్కు టైం కలిసి రావడం లేదా..? డైరెక్టర్ శంకర్కు దెబ్బ మీద దెబ్బ..!…
గత యేడాది మాదిరిగానే పలువురు సినీ ప్రముఖులు ఈ సంవత్సరం కూడా కరోనా కారణంగా కన్నుమూశారు. అదే సమయంలో అనారోగ్యం కారణంగానూ మరికొందరు దివికేగారు. ప్రముఖ సినీ మాటల, పాటల రచయిత వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ (64) జనవరి 5వ తేదీ గుండెపోటుతో చెన్నయ్ లో కన్నుమూశారు. 1986లో ‘శ్రీరామచంద్రుడు’తో గీత రచయితగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన వెన్నెల కంటి మూడు వందలకు పైగా చిత్రాలలో దాదాపు మూడు వేల పాటలు రాశారు. ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు దొరస్వామిరాజు…
పనామా పేపర్ లీక్ కేసుకు సంబంధించి విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన ఆరోపణలపై బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. వాస్తవానికి నవంబర్ 9, 2021న ఈడీ ముందు హాజరు కావాల్సిందిగా ఐశ్వర్యను అడిగారు. కానీ ఆమె వ్యక్తిగత కారణాలను చూపుతూ విచారణను దాటవేశారు. అయితే మళ్లీ ఈడీ నోటీసులు అందజేసి డిసెంబర్ 20న విచారణకు పిలిచింది. నిన్న ఉదయం న్యూఢిల్లీలో దిగిన ఐశ్వర్య నేరుగా ఈడీ…
గత కొద్ది రోజులుగా 200 కోట్ల మనీలాండరింగ్ కేసుకు సంబంధించి పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇద్దరు బాలీవుడ్ భామలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి పేర్లు వస్తున్నాయి. నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ నుంచి కోట్ల విలువైన బహుమతులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈడీ విచారణలో సుకేష్ వీరికి ఖరీదైన బహుమతులు పంపినట్టు వార్తలు వచ్చాయి. ఈ ఆరోపణలపై నోరా స్పందించింది. అతని నుంచి బహుమతులు తీసుకున్నట్టు వస్తున్న వార్తలను ఖండించింది. Read Also…
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. ప్రముఖ జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ రచించిన ‘మాఫియా క్వీన్స్ అఫ్ ముంబై’ అనే బుక్ ఆధారంగా, బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంజయ్ లీలా భన్సాలీ, డా. జయంతిలాల్ గడ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్గన్, ఇమ్రాన్ హష్మి గెస్ట్ రోల్లో కనిపించనున్నారు. ఓ వేశ్య అందరినీ శాసించే నాయకురాలిగా…
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ స్టార్ హీరోయిన్ల రేసులో దూసుకెళ్తోంది. ఇటీవలే ఈ బ్యూటీ రామ్ చరణ్ కు జోడిగా శంకర్ పాన్ ఇండియా మూవీ “ఆర్సీ 15” సినిమాలో ఛాన్స్ అందుకుంది. కియారా, చరణ్ జంటగా వస్తున్న రెండవ చిత్రమిది. తాజాగా ఈ బ్యూటీ కార్ కలెక్షన్లో సరికొత్త లగ్జరీ కారును యాడ్ చేసింది. కియారా ఆడి A8L లగ్జరీ సెడాన్ను కొనుగోలు చేసింది. ఈ మేరకు ఆమెకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్…
బాలీవుడ్ న్యూ కపుల్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్కు బహుమతులు వెల్లువెత్తుతున్నాయి. వీరి వివాహానికి హాజరుకాలేకపోయిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు వారిని ఖరీదైన బహుమతులతో ముంచెత్తారు. కత్రినా మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ ఆమెకు హై-ఎండ్ రేంజ్ రోవర్ని బహుమతిగా ఇచ్చాడు. దీని విలువ 3 కోట్లు. గతంలో కూడా సల్మాన్ క్యాట్కు ఓ రేంజ్ రోవర్ను, 2.33 కోట్ల విలువైన ఆడి కారును గిప్ట్ గా ఇచ్చాడు. ఇప్పుడు మరింత ఖరీదైన కారును ఇచ్చాడు. కత్రినా…
(డిసెంబర్ 14న రాజ్ కపూర్ జయంతి)‘ఇండియన్ షో మేన్’గా పేరొందిన రాజ్ కపూర్ తనదైన నటనతోనూ ఆకట్టుకున్నారు. చార్లీ చాప్లిన్ ను అనుకరిస్తూ రాజ్ కపూర్ ‘చాప్లిన్ ఆప్ ది ఇండియా’గానూ పేరొందారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకునిగా, ఎడిటర్ గా, కథకునిగా రాజ్ కపూర్ తన బహుముఖ ప్రజ్ఞతో హిందీ చిత్రసీమను అలరించారు. రొమాంటిక్ మూవీస్ లో నటించడమే కాదు, సదరు చిత్రాలను దర్శకునిగా తెరకెక్కించడంలోనూ తనదైన బాణీ పలికించారు రాజ్ కపూర్. ఆయన బాణీని అనుసరిస్తూ…