నేడు ముంబై పోలీసుల ఎదుటకు కంగనా… సిక్కు వివాదం
బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్ సిక్కు వివాదంలో ఈరోజు ముంబై పోలీసుల ఎదుట హాజరు కానుంది. కంగనా బుధవారం తన స్టేట్మెంట్ను రికార్డ్ చేయడానికి ముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సి ఉంది. అయితే ఆమె కొన్ని వ్యక్తిగత పనుల కారణంగా అక్కడికి చేరుకోలేకపోయింది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం కంగనా రనౌత్ ఈరోజు ఉదయం 11 గంటలకు తన స్టేట్మెంట్ను రికార్డ్ చేయడానికి ఖార్ పోలీస్ స్టేషన్కు చేరుకోవచ్చు.
సిక్కు వివాదం ఏంటి ?
వాస్తవానికి కంగనా తన సోషల్ మీడియా పోస్ట్లలో ఒకదానిలో రైతుల ఉద్యమాన్ని వేర్పాటువాద గ్రూపుతో ముడిపెట్టి, సిక్కు సంఘంపై వ్యాఖ్యానించింది. దీంతో ఆగ్రహానికి గురైన సిక్కు సంస్థ ఫిర్యాదు మేరకు గత నెలలో ఖార్ పోలీస్ స్టేషన్లో రనౌత్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్కు సంబంధించి కంగనా ముంబై పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంది. ఈ నెల ప్రారంభంలో ఆమెను విచారించేందుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. డిసెంబరు 22న ఖార్ పోలీసుల ఎదుట హాజరు అవుతుందని కంగనా తరపు న్యాయవాది బాంబే హైకోర్టుకు తెలిపారు.
Also Read
Read Also :
కంగనా అరెస్ట్ కు గడువు ?
కంగనా తరపు న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖీ మాట్లాడుతూ “హైకోర్టు ఆదేశాల స్ఫూర్తి, ఉద్దేశ్యం ప్రకారం మేము దర్యాప్తు అధికారిని ముందస్తు తేదీ కోసం అభ్యర్థించాము. కోర్టు తదుపరి విచారణలోపు ప్రక్రియను వేగవంతం చేయాలనుకుంటున్నాము. అయితే దర్యాప్తు అధికారులు నా ఫోన్ కాల్స్ లేదా మెసేజ్లకు స్పందించలేదు. ఆర్డర్ ఇచ్చిన వెంటనే అతనికి పంపిన లేఖకు కూడా అతను స్పందించలేదు. ఇప్పుడు నా క్లయింట్ అందుబాటులో ఉన్న ఏదైనా సమీప తేదీలో పోలిసుల ఎదుట హాజరవుతారు. అధికారులు మాకు సమయం ఇవ్వకపోతే దాని యోగ్యతపై నిర్ణయం తీసుకునే విషయాన్ని హైకోర్టుకు వదిలివేస్తాము. రైతుల నిరసనలను వేర్పాటువాద గ్రూపుతో ముడిపెట్టిన ఆమె సోషల్ మీడియా పోస్ట్పై రనౌత్ను 2022 జనవరి 25 వరకు అరెస్టు చేయబోమని ముంబై పోలీసులు గతంలో బాంబే హైకోర్టుకు తెలిపారు” అని అన్నారు. దీంతో కంగనా ఈరోజు ముంబై పోలిసుల ఎదుట హాజరై తన స్టేట్మెంట్ ఇస్తుందని అంటున్నారు.
ఇదీ జరిగింది !
కంగనా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లలో ఒకదాని తర్వాత సిక్కు సంఘంలోని కొంతమంది సభ్యులు నటిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమాన్ని ఖలిస్తానీ ఉద్యమంగా రనౌత్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అభివర్ణించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఖర్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ రనౌత్ ఈ నెల ప్రారంభంలో ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కంగనా కామెంట్స్ భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక హక్కు అని హైకోర్టు పేర్కొంది. దీంతో కోర్టు కంగనాకు అరెస్ట్ నుంచి మధ్యంతర ఉపశమనం ఇచ్చింది.
తాజావార్తలు
-
Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్లో హింస..
-
Kiara: యష్’తో అప్పుడు ఇష్టమై చేశా కానీ… ఆ సీన్లు ఇప్పుడు కట్ చేయండి ప్లీజ్!
-
Tamil Producers: టోకెన్ స్ట్రైక్’కి దిగిన తమిళ నిర్మాతలు!
-
Cyber Crime: బెట్టింగ్ రాయుళ్లపై సైబర్ క్రైమ్ పంజా.. 181 సోషల్ మీడియా ప్రొఫైల్స్ క్లోజ్!
-
Preity Zinta: పంజాబ్ తొలి ఓటమిపై.. రెండు రోజుల తర్వాత స్పందించిన ప్రీతి జింటా.. ఏమన్నారంటే..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!