పనామా పేపర్స్ లీక్ కేసులో ఐష్… 5 గంటలు ఈడీ విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పనామా పేపర్ లీక్ కేసుకు సంబంధించి విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన ఆరోపణలపై బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. వాస్తవానికి నవంబర్ 9, 2021న ఈడీ ముందు హాజరు కావాల్సిందిగా ఐశ్వర్యను అడిగారు. కానీ ఆమె వ్యక్తిగత కారణాలను చూపుతూ విచారణను దాటవేశారు. అయితే మళ్లీ ఈడీ నోటీసులు అందజేసి డిసెంబర్ 20న విచారణకు పిలిచింది. నిన్న ఉదయం న్యూఢిల్లీలో దిగిన ఐశ్వర్య నేరుగా ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకుంది. ఫారెక్స్ నిబంధనలను ఉల్లంఘించి విదేశాల్లో సంపదను దాచుకున్నారనే ఆరోపణలను ఆమె ఎదుర్కొంటున్నారు.
దాదాపు ఐదు గంటల పాటు ఈడీ ఐశ్వర్యను ప్రశ్నించింది. ఆమె విదేశీ ప్రయాణ చరిత్రపై ఈడీ విచారణ చేపట్టింది. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)ని ఉపయోగించి తన భర్త అభిషేక్ బచ్చన్ విదేశీ బ్యాంకు ఖాతాలో చేసిన పెద్ద డిపాజిట్పై కూడా ఐష్ ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మరి ఈ విచారణలో ఈడీ ఎలాంటి వివరాలు రాబట్టింది అనేది ఆసక్తికరంగా మారింది. 2016లో పనామా పేపర్లు లీక్ కాగా అందులో 500 మంది భారతీయ ప్రముఖుల పేర్లు ఉన్నాయి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పేరు కూడా అందులో భాగమైంది. అయితే సీనియర్ బచ్చన్ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని ఖండించారు.
Also Read
- PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
- Money Heist: 'మనీ హెయిస్ట్' ఫ్యాన్స్కు నెట్ఫ్లిక్స్ సర్ప్రైజ్.. ప్రొఫెసర్ ప్రయాణం ఇంకా ముగియలేదు!
- CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. 'జన నాయగన్' సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
- Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?