కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు టీర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిరిసిల్ల నియోజకవర్గంలో టీఆర్ఎస్ శ్రేణులు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ధర్న నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలును కేంద్రం అపొద్దన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం శీతకన్న ప్రదర్శిస్తోందని ఆయన అన్నారు. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదని.. తెలంగాణ రైతు సమితి అంటూ.. టీఆర్ఎస్…
టీఆర్ఎస్ ధర్నాలు చేయాల్సింది రాష్ర్టంలో కాదని ఢీల్లీలోని జంతర్మంతర్ వద్ద చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిన బీజే పీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో మాత్రం ధర్నాలు చేయడం సిగ్గు చేటన్నారు. ముందు వడ్లు కొనుగోలు చేయడానికి రాష్ట్ర బీజేపీ నాయ కులు కేంద్రం పై ఒత్తిడి పెంచాలని ఆయన కోరారు. రాష్ట్రంలో బీజే పీ,…
గెలిచే అవకాశం లేకపోయినా.. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బీజేపీ ఎందుకు దిగుతోంది? అన్ని చోట్లా పోటీ చేస్తుందా.. కేవలం కొన్ని స్థానాలకే పరిమితం అవుతుందా? ఈ విషయంలో కమలనాథుల లెక్కలేంటి? బలం లేని చోట బరిలో బీజేపీ..! తెలంగాణలో మళ్లీ ఎన్నికల వేడి నెలకొన్నా.. వార్ ఏకపక్షం కావడంతో పెద్దగా చర్చ లేదు. ఎన్నికలు జరిగే 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ప్రస్తుతం టీఆర్ఎస్వే. ఈ ఎన్నికల్లో ఓటేసే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్ల…
ఉత్తర ప్రదేశ్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. ఈ ఎన్నికలకు బీజేపీ సమాయత్తమవుతోంది. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్ షా ఇవాళ వారణాసి వెళ్తనున్నారు. ఆయన తూర్పు యూపీలోనే రెండు రోజులపాటు పర్యటించనున్నారు. బీజేపీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో అమిత్ షా పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా పాల్గొనే అవాకశముంది. బీజేపీ సోషల్ మీడియా వాలంటీర్లు,…
బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వరిపై మొదలైన మాటల యుద్ధం సవాళ్లు విసురుకునే దాకా వెళుతోంది. యాసంగి ధాన్యం సంగతేంటని ప్రశ్నించిన టీఆర్ఎస్.. రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలకు పిలుపు ఇచ్చింది. నేడు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నాకు ప్లాన్ చేశారు. రాష్ట్రం పట్ల మోడీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని టీఆర్ఎస్ విమర్శిస్తోంది. పంజాబ్ రాష్ట్రం తరహాలోనే తెలంగాణలోనూ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. కేంద్రం నుంచి స్పష్టత వచ్చే…
తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. కిషన్రెడ్డి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని తీసుకురావాలన్నారు. పచ్చి అబద్ధాలతో కిషన్ రెడ్డి రాష్ర్ట ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారన్నారు. బీబీనగర్ ఎయి మ్స్కు స్థలం ఇవ్వడంతోపాటు బిల్డింగ్ కూడా ఇచ్చాం. ఎయిమ్స్కు స్థలం ఇవ్వలేదని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎయిమ్స్ అనేది విభజన చట్టం ద్వారా తెలంగాణకు…
ఎప్పుడు వార్తల్లో ఉండే కంగనా రనౌత్పై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తీవ్ర స్థాయిలో ఆమె పై ధ్వజమెత్తారు. కంగనా ఎప్పుడు వివాదాలతోనే అంట కాగుతుందన్న విషయం తెల్సిందే.. ఇప్పటికే ఆమె పోస్టులు విద్వేష పూరితంగా ఉన్నాయని, వాట్సాప్, ట్విట్టర్ లాంటి ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ఫారమ్లు సైతం ఆమెను బ్యాన్ చేశారు. అయి తే ఆమెకు తాజాగా పద్మశ్రీ పురస్కారాన్ని భారత ప్రభుత్వం అందజే సింది. దీనిపై ఇప్పటికే నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ మొదలు…
బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసిన కొనుగోళ్లు ఆపమని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. బీజేపీ ధాన్యం కొనుగోళ్లపై రాష్ర్టంలో అలజడి సృష్టిస్తుందన్నారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో ఆయన మాట్లాడారు. బీజేపీ, టీఆర్ఎస్పై అనవసర విమర్శలు చేస్తుందని, విమర్శలు ఆపి కేంద్రాన్ని ధాన్యం కొనేలా ఒప్పించాలని ఆయన అన్నారు. ఇప్పటికే రాష్ర్టంలో 6,600 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అవసరమైతే వీటి సంఖ్యను ఇంకా పెంచుతామని ఆయన తెలిపారు. రాష్ర్టంలో వరి ధాన్యం…
అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్కడ అంతా బీజేపీ వైపు చూశారు.. ఆ తర్వాత ఇప్పుడు ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు.. అదే పశ్చిమబెంగాల్.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వానేనా అంటూ సాగిన సమరంలో.. మరోసారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది.. మళ్లీ బెంగాల్ సీఎం పీఠాన్ని అధిరోహించారు మమతా బెనర్జీ.. అయితే, ఎన్నికలకు ముందు టీఎంసీ లీడర్లను ప్రలోభాలకు గురిచేసి.. బీజేపీ కొంతమందిని ఆ పార్టీలో చేర్చుకున్నాయనే విమర్శలు…
మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అవుతుందని చెబుతారు. అక్కడ మాత్రం మంది ఎక్కువై.. ప్రొటోకాల్ సమస్యలు వస్తున్నాయి. ముందొచ్చిన చెవులు కంటే.. వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా మారింది సీన్. ఇంకేముంది.. ముందు నుంచీ జెండాలు మోసిన పాతకాపులు కుతకుతలాడుతున్నారట. పాత నేతలు వెనక బెంచీలకే పరిమితం..! తెలంగాణ బీజేపీలో ఒకప్పుడు చెప్పుకోదగ్గ నాయకులు నలుగురో.. ఐదుగురో ఉండేవారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చాక.. కాషాయ శిబిరంలో నేతల జాబితా పెరిగింది. వలస నాయకుల సంఖ్య ఎక్కువైంది.…