ప్రతిపక్షాలపై వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..ఇది వైసీపీకి అభివృద్ధి, సంక్షేమ నామ సంవత్సరమని, బీజేపీకి మద్యపాన సంవత్సరమని, జనసేనకు ప్యాకేజీ నామ సంవత్సరం అని మొత్తంగా విపక్షాలకు ఏడుపునామ సంవత్సరమని అంబటి వ్యాఖ్యానించారు. అమరావతి ఇక్కడే ఉంటుందన్నారు. బీజేపీ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీ పార్టీనా జూదం పార్టీనా? జిన్నా టవర్ను పేల్చేస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో బుద్ధుడి విగ్రహాన్ని కూల్చేసిన తాలిబన్లకు, బీజేపీ నేతలకు తేడా ఏముంది? అద్వానీ స్వయంగా పాకిస్తాన్ వెళ్లి జిన్నా సమాధిని సందర్శించారు. అద్వానీ చర్యను బీజేపీ నేతలు ఖండిస్తారా? దేశ స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీ, జిన్నా తమ వంతుగా కృషి చేశారు.
Read Also:ఫస్ట్ రేవంత్ను పిలిచి.. నన్ను పిలవండి: జగ్గారెడ్డి
ఆ సమయంలో దేశంలో అనేక చోట్ల ఈ ఇద్దరు నాయకుల పేర్లు పెట్టారు. 1943లో జిన్నా టవర్ను నిర్మించారు. ఇన్నేళ్లు బీజేపీ ఏం చేస్తుంది.. గుడ్డి గుర్రం పల్లు తోముంతుందా అంటూ విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలన్నారు. చీప్ లిక్కర్తో ఓట్లు సంపాదించాలనుకుంటున్న చీప్ పార్టీగా బీజేపీ మారిందన్నారు. మద్యంపై ప్రభుత్వ విధానాలు మారుతుంటాయి. దానిలో తప్పేముందని ప్రశ్నించారు. హత్యా రాజకీయాలు చేసే ఖర్మ వైసీపీకి పట్టలేదన్నారు. వంగవీటి రంగను ఎవ్వరూ హత్య చేశారో అందరికి తెలుసునని అంబటి అన్నారు.