Home
Bjp
Bjp News
-
పార్టీ ఆదేశిస్తే కేసీఆర్ మీద పోటీకి సిద్ధం: ఈటల
నాకు హుజురాబాద్ నియోజకవర్గం ఉందని, ఒకవేళ పార్టీ ఆదేశిస్తే కేసీఆర్ మీద పోటీకి సిద్ధమని ఈటల రాజేందర్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్పై విమర్శలు చేశారు. ధాన్యం విషయంలో కేసీఆర్ తన వైఫల్యాన్ని కేంద్రం పై మోపుతున్నాడని ఈటల అన్నారు. కేసీఆర్, హరీష్ రావు, వాళ్ల మంత్రుల మాటలను తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితిలో లేదన్నారు. ఇంత నీచంగా హరీష్రావు ప్రవర్తిస్తారని తెలంగాణ ప్రజలకు తెల్సింది. ప్రాంతీయ పార్టీల్లో వారసులే సీఎంలు అవుతారు. బీజేపీ… -
హుజురాబాద్ ప్రజలకు ఉన్న సోయి నాయకులకు లేదు: ఈటల
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శల దాడికి దిగారు. గురువారం ఈటల మీడియాతో మాట్లాడుతూ… టీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. హుజురాబాద్ ప్రజలకు ఉన్న సోయి రాజకీయ నాయకులకు లేకుండా పోయిందన్నారు. ప్రగతి భవన్కు కేసీఆర్ మముల్ని రానియలేదు…. ఆ రోజు నాతో పాటు ఉన్న ఎమ్మెల్యే.. ఇప్పుడు కేబినెట్ మినిస్టర్ అయ్యారు. మళ్ళీ ఉద్యమం కరీంనగర్ నుండే పుడుతుందని ఈటల అన్నారు. రైతుబంధుఉన్నోళ్లకు ఇవ్వొద్దని అన్న… డబ్బులు చెట్లకు కాయవు. రైతు కూలీలకు,… -
నరసరావుపేటపై బీజేపీ ఎంపీ జీవీఎల్కు ప్రేమ పుట్టుకొచ్చిందా…?
నరసరావుపేట పార్లమెంట్పై ఈ మధ్య ఓ నేతకు కొత్త ప్రేమ పుట్టుకొచ్చింది. పార్టీలు పక్కనపెట్టి ప్రజాసేవ చేద్దాం రండి అంటూ ఎమ్మెల్యేలను, స్థానికులు కలుపుకొని హల్చల్ చేస్తున్నారు. ఉంటే ఢిల్లీలో.. లేదంటే నరసరావుపేటలో.. ఇదే నా టార్గెట్..! నేను మీ వాడినే అంటూ ఊరూరు తిరుగుతున్నారట. ఇంతకీ ఢిల్లీ నుంచి నరసరావుపేటపై ప్రేమ కురిపిస్తున్న నేత ఎవరు? జీవీఎల్ ముందస్తుగా ఇల్లు సర్దుకుంటున్నారా? GVL నరసింహారావు. ఏపీ రాజకీయాలకు ముఖ్యంగా బీజేపీకి పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం… -
బీహార్కు పాకిన బహిరంగ్ నమాజ్…!
బహిరంగ ప్రదేశాలలో నమాజ్ అంశం కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఓపెన్ ప్లేస్లో ముస్లింలు శుక్రవారం ప్రార్థనలను సహించేది లేదన్న హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్ ప్రకటన వివాదాస్పదమైంది. గురుగ్రామ్లో ముస్లింలకు గతంలో కేటాయించిన ప్రార్థనా ప్రదేశాలన్నిటిని హర్యానా ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. నిర్దేశిత ప్రదేశాలలో ముస్లింలు ప్రార్థనలు చేయటాన్ని ఆర్ఎస్ఎస్ సహ హిందూ సంస్థల కార్యకర్తలు అడ్డుకోవటం ఈ నిర్ణయానికి దారితీసింది. ఐతే, ఇది రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఖట్టర్ నిర్ణయంపై… -
రేపే ఎమ్మెల్సీ కౌంటింగ్.. సర్వం సిద్ధం : శశాంక్ గోయల్
తెలంగాణలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే రేపు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ మాట్లాడుతూ.. రేపు ఎమ్మెల్సీ కౌంటింగ్ కోసం 5 నియోజకవర్గాలలో ఉదయం 8 గంటలకు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తారని తెలిపారు. బ్యాలెట్ బాక్స్ లను ఏజెంట్ల మధ్య తెరుస్తారని ఆయన తెలిపారు. కౌంటింగ్ హాల్స్ లలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.… -
విశాఖ ఉక్కు.. ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు : టీటీడీ చైర్మన్ వైవీ
విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. విశాఖ ఉక్కును నిలబెట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు వస్తామని సీఎం జగన్ గతంలోనే చెప్పారని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఢిల్లీ లో కేంద్రంతో మాట్లాడే విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదన్నారు. గతంలో వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన సమయంలో టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు.. బీజేపీ ఆంధ్ర ప్రదేశ్… -
యూపీలో టోపీ పాలిటిక్స్…
యూపీ సమరానికి సమయం దగ్గర పడుతోంది. పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రకటనకు ప్రచారం హోరెత్తుతోంది. ప్రస్తుతం యూపీలో టోపీ రాజకీయం నడుస్తోంది. సమాజ్వాద్ పార్టీ ఎర్ర టోపీ కేంద్రంగా రాజకీయ చర్చ నడుస్తోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ ప్రసంగానికి ఎర్ర టోపీ ధరించిన ఎస్పీ ఎమ్మెల్యేలు అడ్డుకోవటంతో వివాదం మొదలైంది. క్యాప్ పెట్టుకున్న సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు గుండాలు అనే అర్థం వచ్చేలా యోగీ ఎగతాళి చేయటంతో వారు సభలో అలజడి సృష్టించారు. ఇక,… -
నారాయణస్వామి, ప్రకాష్రెడ్డిల వ్యాఖ్యలు అర్ధరహితం: విష్ణు వర్ధన్ రెడ్డి
డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితమని బీజేపీ నేత విష్ణు వర్ధన్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సోమవారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ…. వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. సీఎంను హత్య చేస్తారని వైసీపీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే ఆరోపిస్తున్న దాంట్లో నిజం లేదన్నారు. Also read: రేణిగుంటలో అమరావతి రైతులకు ఘన స్వాగతం… సీఎం ను కాపాడుకోలేని వాళ్లు ప్రజలను ఎలా కాపాడుతారని ఆయన ఎద్దేవా చేశారు. ఏపీలో శాంతి భద్రతలు… -
మూడు రోజుల సమ్మె జీతాన్ని ప్రతి కార్మికుడికి చెల్లించాలి: సత్యనారాయణ
మూడు రోజుల సమ్మె జీతాన్ని ప్రతి కార్మికుడికి చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ అన్నారు. సోమవారం గోదావరిఖనిలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణిలో జరిగిన సమ్మె రాష్ర్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన సమ్మెగా ఆయన అభివర్ణించారు. సింగరేణిలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి సమ్మెలో బొగ్గు ఉత్పత్తి జరిగిందన్నారు. కానీ ఈ మూడు రోజుల సమ్మెలో బొగ్గు ఉత్పత్తి జరగలేదంటే యాజమాన్యం, రాష్ర్ట ప్రభుత్వ తీరును… -
రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్
రెండు రోజుల తర్వాత ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు ఇవాళ కూడా కొనసాగాయి. ఇన్నాళ్లు రైతు సమస్యలపై దద్దరిల్లిన ఉభయ సభలు.. ప్రస్తుతం 12 మంది ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటి రోజే నిబంధనలు ఉల్లంఘించినందుకు 12 మంది విపక్ష ఎంపీలను సభను నుంచి సస్పెండ్ చేస్తూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఎంపీల సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధం అంటూ .. తమ…
తాజావార్తలు
-
Google Maps: గూగుల్ మ్యాప్స్లో ఈ చిన్న సెట్టింగ్ మార్చండి.. పెట్రోల్ ఖర్చు తగ్గించుకోండి!
-
Pawan Kalyan: 21 సీట్లతో రాజీపడలేదు.. ఏపీ కోసం మేం త్యాగం చేశాం!
-
China Robot: చైనా రోబోలు.. భారత్కు పొంచి ఉన్న ముప్పు..! డ్రాగన్ టార్గెట్ అదేనా?
-
Nara Lokesh: ‘రప్పారప్పా’ అంటే చూస్తూ ఊరుకోము.. నారా లోకేష్ మాస్ వార్నింగ్!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
ట్రెండింగ్
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!