Sheikh Hasina: షేక్ హసీనా అప్పగింతపై కేంద్రం కీలక ప్రకటన
- షేక్ హసీనా అప్పగింతపై కేంద్రం కీలక ప్రకటన
- అభ్యర్థనను పరిశీలిస్తున్నట్లు వెల్లడి
- తారిఖ్ రెహమాన్ భారత్ పర్యటన నేపథ్యంలో పరిశీలన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింతపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. దాదాపు రెండేళ్ల నుంచి షేక్ హసీనా భారత్లో తలదాచుకుంటున్నారు. త్వరలోనే బంగ్లాదేశ్కు వెళ్లబోతున్నట్లుగా ఇప్పటికే షేక్ హసీనా ప్రకటించారు.
అయితే ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్.. షేక్ హసీనాను అప్పగిస్తేనే భారత్లో పర్యటిస్తానని షరతు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షేక్ హసీనా అప్పగింత అంశంపై మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. షేక్ హసీనాను అప్పగించాలన్న అభ్యర్థనను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అభ్యర్థనలను స్థిరీకరించిన విధానాల ప్రకారం పరిశీలిస్తున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ మరోసారి డిమాండ్ చేసిన మరుసటి రోజే భారత్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ భారత్లో పర్యటించాలంటే హసీనాను అప్పగించడం కూడా కీలక షరతుగా ఉండొచ్చని సమాచారం.
Also Read
- Supreme Court: వైవాహిక అత్యాచారం కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Central Cabinet Decision: తెలుగు రాష్ట్రాల్లో 4 లేన్ల రైల్వే ట్రాక్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- CNR Rao: భారతరత్న శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్. రావుకు ఎస్ఐఆర్ నోటీసు.. కారణం ఇదే!
బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఏకేఎం షాహిదుల్ కరీం మాట్లాడుతూ.. తారిఖ్ రెహమాన్ ప్రతిపాదిత ద్వైపాక్షిక పర్యటనపై భారత్, బంగ్లాదేశ్ కొన్ని వారాలుగా సంప్రదింపులు జరుపుతున్నాయని తెలిపారు. అయితే ఈ పర్యటన జరగాలంటే ముందుగా ‘‘అనుకూలమైన వాతావరణం’’ ఏర్పడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హసీనాను అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని భారత్ను కోరినట్లు కరీం తెలిపారు. అలాగే బంగ్లాదేశ్లో ఉన్న ఇతర పరారీలో ఉన్న నిందితులను కూడా అప్పగించాలని కోరినట్లు చెప్పారు. రాజకీయ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరిని కూడా తమకు అప్పగించాలని ఢాకా కోరినట్లు వెల్లడించారు.
ఇదే సందర్భంగా ఉగ్రవాదంపై భారత్ వైఖరిని కూడా రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ‘‘ఉగ్రవాదానికి సంబంధించిన అంశాలు చాలా తీవ్రమైనవి. వాటిని మేం అత్యంత తీవ్రంగా పరిగణిస్తాం. ఇలాంటి చర్యల తీవ్రతను అంతర్జాతీయ సమాజం అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. భారత్ ఉగ్రవాదం వల్ల తీవ్రంగా ప్రభావితమైంది’’ అని ఆయన అన్నారు. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదంపై సమష్టి పోరాటాన్ని బలోపేతం చేసేందుకు భారత్ అనేక ప్రయత్నాలు చేసిందని జైస్వాల్ తెలిపారు. సరిహద్దులు దాటి జరిగే ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ‘‘ఉగ్రవాదాన్ని ఓడించేందుకు అవసరమైన ఎలాంటి చర్యలైనా తీసుకోవడంలో భారత్ వెనుకడుగు వేయదు. ఈ ముప్పును నిర్మూలించే వరకు మా పోరాటం కొనసాగుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Supreme Court: వైవాహిక అత్యాచారం కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Dussehra: శ్రీశైలం భ్రమరాంబికాదేవి క్షేత్రంలో దసరా మహోత్సవాలు.. అక్టోబర్ 11 నుంచి ప్రారంభం..
-
TPCC Mahesh Goud : కేసీఆర్ ఆరోగ్యంపై మహేష్ గౌడ్ ఫైర్.. ‘చిల్లర రాజకీయం వద్దు’.!
-
Oppo A7 Pro 5G: ఒప్పో A7 Pro 5G లాంచ్.. 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!