మీ రాజకీయ పబ్బం గడువు కోవడం కోసం గిరిజనుల భుజాలపై తుపాకి పెట్టి కాల్చే ప్రయత్నం బీజేపీ నేతలు మానుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆమె బీజేపీ పై నిప్పులు చెరిగారు. ఇకనైనా రాష్ర్ట బీజేపీ నేతలు దివాల కోరు మాటలను మానుకోవాలని హితవు పలికారు. రాజ్యాంగ బద్ధంగా గిరిజనులకు రావాల్సిన హక్కులను కల్పించాలన్నారు. సమ్మక్క- సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్ల నిధులు వెచ్చిస్తే.. కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల…
ఏపీలో ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాడుతుందని పురందేశ్వరి అన్నారు. అమిత్ షాతో భేటీ అనంతరం మీడియాతో పురందేశ్వరి మాట్లాడారు. బీజేపీ ప్రజావాణి కావాలని అమిత్ షా దిశా నిర్దేశం చేశారన్నారు. ఏపీలో బీజేపీ బలోపేతం, రాష్ట్రంలో తాజా పరిస్థితులపై అమిత్ షాతో సుధీర్ఘంగా చర్చించినట్టు పురందేశ్వరి తెలిపారు.ఏపీ విభజన బిల్లు అంశాలపై అమిత్ షాతో చర్చించామని తెలిపింది. విభజన బిల్లులోని 80 శాతానికి పైగా అంశాలు ఇప్పటికే కేంద్రం నెరవేర్చిందని మిగిలిన అంశాలపై కూడా చర్చించామని…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బండి సంజయ్ అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గొర్రెల పంపిణీకి కేంద్రం వెయ్యి కోట్లు ఇస్తామని ఎగొట్టిందని ఆయన అన్నారు.ఆ వెయ్యి కోట్లు కూడా తెలంగాణ అప్పు తీసుకుని గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు. బండి సంజయ్ చెప్పినట్టు కేంద్రం వెయ్యి కోట్లు సబ్సిడీ ఇవ్వ…
తిరుపతిలో కేంద్ర హోం మంత్రి అమిత్షా ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన దక్షిణాది రాష్ర్టాల సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరు కాకపో వడం చర్చనీయాంశం అయింది. అతి ముఖ్యమైన ఈ సమావే శానికి కేసీఆర్ హాజరు కాకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ర్టాల సాగునీటి ప్రాజెక్టులు, అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాలపై ముఖ్యంగా చర్చించనున్నారు. దక్షిణాది రాష్ర్టాల నుంచి అందరూ సీఎంలు హాజరవుతున్నారు. తెలంగాణ నుంచి కేసీఆర్ స్థానంలో తెలంగాణ హోం మంత్రి మహమూద్…
ఆదివారం భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా పార్లమెంట్లో జరిగిన కార్యక్రమానికి కేంద్ర మంత్రు లెవరూ హాజరు కాలేదని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు. “ఈరోజు పార్లమెంట్లో అసాధారణ దృశ్యం… లోక్సభ స్పీకర్ గైర్హాజరు. చైర్మన్ రాజ్యసభ గైర్హాజరు. ఒక్క మంత్రి కూడా హాజరు కాలేదు” పరిస్థితి అసాధారణంగా ఉందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు. “ఇది ఇంతకంటే దారుణం కాగలదా?” అని రాజ్యసభ ఎంపీ అన్నారు. అని రమేష్…
హన్మకొండ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మీడియా సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన బీజేపీ- కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీల నేతలు ఇష్టం వచ్చి నట్లు మాట్లాడుతున్నారని, టీఆర్ఎస్ నాయకులపై అనవసర ఆరో పణలు చేస్తే ఊరుకోబోమని దాస్యం వినయ్ భాస్కర్ హెచ్చరిం చారు. ఇకనైనా బీజేపీ నేతలు పిచ్చి కూతలు మానుకోవాలన్నారు. మా 60 లక్షల మంది టీఆర్ఎస్ కార్యకర్తలు తుమ్మితే ఆ తుంపర్లలో బీజేపీ- కాంగ్రెస్ పార్టీలు కొట్టుకుపోతాయని,…
ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడుపై కేంద్ర హోం మంత్రి అమి త్షా ప్రశంసల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టు 20వ వార్షికోత్సవానికి కేంద్ర హోం మంత్రి అమిత్షా హాజరయ్యారు. ఉపరాష్ర్టపతి వెంకయ్య నాయుడితో కలిసి ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెంకయ్య స్వస్థలంలో ఆయన గురించి మాట్లాడాలన్న నా అభిలాష ఇప్పటికి నేరవేరిందని హోం మంత్రి అమిత్ షా అన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు…
రేపు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్. ఈ పర్యటనలో అర్జాలబావి ఐకేపీ సెంటర్ (నల్గొండ రూరల్ మండలం) ను సందర్శించనున్నారు బండి సంజయ్ కుమార్. అలాగే… మిర్యాలగూడ, నేరేడుచర్ల, గడ్డిపల్లి ప్రాంతాల్లో పర్యటించి రైతులను కలవనున్నారు బండి సంజయ్ కుమార్. అలాగే… రేపు రాత్రి సూర్యాపేటలోనే బస చేయనున్నారు. ఇక ఎల్లుండి (16.11.2021) తిరుమలగిరి, తుంగతుర్తి, దేవరుప్పల, జనగామ మండలాల్లో పర్యటించనున్నారు బండి సంజయ్ కుమార్. మార్కెట్ లో…
ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ లో కొంత గ్రూప్ వార్ నడిచిన విషయం తెలిసిందే. నాయకులూ రెండు గ్రూపులుగా విడిపోయి మరి విమర్శించుకున్నారు. కానీ ఇప్పుడు అంత సద్దుమణిగినట్లు తెలుస్తుంది. అయితే తాజాగా సమావేశంలో హుజరాబాద్ ఎన్నికల ఫలితం, సంబంధిత ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది అని సి.ఎల్.పి నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 2023 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అందరం కలిసికట్టుగా పోరాడుతాం అని తెలిపారు. 2023 ఎన్నికలకోసం “యాక్షన్ ప్లాన్” సిధ్దం…
ఎయిమ్స్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరో మారు తప్పుడు ప్రచారం అని రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు. బీబీ నగర్ ఎయిమ్స్ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాస్తవాలు వక్రీకరించి మాట్లాడుతున్నారు. మొన్ననేమో ఎయిమ్స్ కి భూమి ఇవ్వలేదని ఆరోపణ చేశారు. సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్ చూపించాం. ఇప్పుడేమో బిల్డంగ్ డాక్యుమెంట్స్, ఎన్విరాన్ మెంటల్ క్లియరెన్స్ అంటున్నారు. రోజుకో తీరుగా మాట్లాడుతున్నారు. ఎయిమ్స్ విషయంలో ఈ ఏడాది అక్టోబర్9 న రాష్ట్ర ప్రభుత్వ…