పెట్రోలు, డీజిల్పై వ్యాట్ తగ్గించేదాకా…. బీజేపీ దశల వారీ ఉద్యమం ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం పార్టీ మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పదాధికారులు, వివిధ మోర్చాల అధ్యక్షులతో బండి సంజయ్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలపై చర్చించారు. నేడు, రేపు అన్ని మండల కేంద్రాల్లో ఎద్దుల బండ్లపై బీజేపీ కార్యకర్తల ధర్నాలు ఉంటాయన్నారు. డిసెంబర్ 1న బీజేవైఎం ఆధ్వర్యంలో…
వరి కుప్పల పై రైతుల చావులకు కేసీఆర్ బాధ్యత వహించాల్సిదేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. రైతుల కోసం నిర్వహించిన దీక్షలో ఆయన మాట్లాడుతూ… కేసీఆర్పై, బీజేపీ పైనా తీవ్ర విమర్శలను గుప్పించారు. వరి ధాన్యం కుప్పలపై రైతులు చనిపోవడంపై స్పందిస్తూ.. ఇవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలన్నారు. కేసీఆర్కు దమ్ము, ధైర్యం ఉంటే ప్రధాని అపాయింట్మెంట్ లెటర్ చూపెట్టాలన్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను అరిగోస పెడతున్న కేసీఆర్కు ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే…
సొంత స్థలం ఉన్న వారికి రెండు పడక గదుల ఇళ్లను వెంటనే మంజూరు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా సూర్యపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురింపించారు. 2014లో రాష్ర్ట అప్పులు రూ.65వేల కోట్లు ఉండగా.. ఏడున్నరేళ్లలో ఆ అప్పును రూ.4 లక్షలకు కోట్లకు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్దేనని ఆయన ఆరోపించారు. ప్రతి నెల రూ.65 వేల కోట్లు వడ్డీ చెల్లించాల్సిన దుస్థితికి…
హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత ఒక్కసారి తెలంగాణాలో రాజకీయ సమీకరణాలు మారాయి. దుబ్బాక ఉప ఎన్నికతో టీఆర్ఎస్ అలర్ట్ అయినా జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చేసరికి జరగాల్సిన నష్టం టీఆర్ఎస్ జరిగింది. దుబ్బాక ఎన్నికతో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు సింహభాగాన గెలిచి మళ్లీ హైదరాబాద్ పీఠంపై గులాబీ జెండాను ఎగరవేశారు. అయితే ఆ తరువాత జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నిక ఈటల రాజేందర్తో పోటీ కారణంగా ప్రత్యేకతను సంతరించుకుంది. హుజురాబాద్ లో…
శీతాకాల పార్లమెంట్ సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు పార్లమెంటీరీ సమావేశాలు నిర్వహించుకుంటూ సమావేశాల్లో ప్రత్యర్థులపైన పన్నాల్సిన వ్యూహాలను రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బేజేపీ కూడా పార్లమెంటరీ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనుంది. ఈ సమావేశంలో పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలను పార్టీ నేతలు ఖరారు చేయనున్నారు. అంతేకాకుండా విపక్షాలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు నేతలు సమాయత్తం అవుతున్నారు. దీనితో పాటు సాయంత్రం 5గంటలకు రాజ్యసభ…
సోషల్ మీడియాలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వార్ నడుస్తోంది. యూపీలోని జెవార్లో నిర్మించ తలపెట్టిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 25న శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు బీజేపీ నేతలు షేర్ చేసిన ఫొటోలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. సోషల్ మీడియాలో ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. నోయిడాలో నిర్మించబోతున్న ఈ విమానాశ్రయం ఆసియాలోనే అతిపెద్దదని, దీని ద్వారా ఈ ప్రాంతానికి రూ. 35 వేల కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు లక్షమందికి ఉపాధి…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. కర్షకులకు అండగా కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్ పార్టీ వరి దీక్షలు చేపట్టింది. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో రాజకీయ క్రీడ ఆడుతున్నాయని, కార్పొరేట్ లకు భూముల అమ్మేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. ఖమ్మం జిల్లాలో వరి రైతుల పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్న చందంగా తయారైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.…
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. నియంత, అవినీతి, కుటుంబ పాలనను తెలంగాణ ప్రజలు సహించరు. హుజూరాబాద్ ఉప ఎన్నిక అదే నిరూపించింది అని అన్నారు. బీజేపీ ని బద్నం చేయాలని కేసీఆర్ చూస్తున్నాడు… ప్రజల దృష్టిని మరల్చేందుకే కేసీఆర్ ఢిల్లీ టూర్ అని తెలిపారు. ప్రజలు ఛీత్కరించిన పరవాలేదు బీజేపీ ని బ్లెమ్ చేయాలని తెగించాడు. కేసీఆర్ కు రాజకీయ పతనం ప్రారంభం అయిందని…
కేసీఆర్ కుటుంబంలో ముఖ్యమంత్రి స్థానంకోసం యుద్ధం మొదలైందన్నారు బీజేపీ నేత విజయశాంతి.. టీఆర్ఎస్పై విమర్శలు గుప్పించిన ఆమె.. ప్రగతి భవన్లో కుస్తీ ఫైటింగ్ జరుగుతుందన్నారు. కుటుంబ పంచాయతీలతో కేసీఆర్ తల పట్టుకున్నాడని విజయశాంతి అన్నారు. భవిష్యత్లో తెలంగాణలో టీఆర్ఎస్ ఉండబోదని జోస్యం చెప్పిన రాములమ్మ.. కేసీఆర్ మోసపు విధానాలు అవలంభిస్తున్నారన్నారు. కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. కుటుంబ కొట్లాటల నుంచి రిలీఫ్ కోసం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ గురించి…
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు.. అధికార టీఆర్ఎస్కు అసలైన ప్రత్యామ్నాయం తామేనంటున్నారు.. అయితే, బీజేపీకి అంత సీనేలేదంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు… కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి సామాన్య ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదన్న ఆయన.. రాష్ట్రంలో ఎప్పటికీ బీజేపీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. Read Also: ఈటల సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్ ఆరిపోయే దీపం..! బీజేపీకి 80 సీట్లు కాదు…