Tirumala Laddu Ghee Adulteration Case: కల్తీ నెయ్యి వ్యవహారం కీలక పరిణామం.. ఏకసభ్య కమిటీ నియామకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Laddu Ghee Adulteration Case: తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై సమగ్ర విచారణ కోసం ఏక సభ్య కమిటీని నియమించింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ను విచారణ కమిషనర్గా నియమించారు. ఆయన ఆధ్వర్యంలో వన్ మెన్ కమిటీ ఈ వ్యవహారంపై లోతైన అధ్యయనం చేపట్టనుంది. తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి నాణ్యత, సరఫరా ప్రక్రియ, టెండర్ విధానం, అలాగే జరిగిన లోటుపాట్లపై కమిటీ సమగ్రంగా పరిశీలించనుంది. ముఖ్యంగా టెండర్ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరిగాయా..? నాణ్యత తనిఖీలలో ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగిందా..? అనే అంశాలను ప్రత్యేకంగా అధ్యయనం చేయనుంది. ఇక, ప్రభుత్వం కమిటీకి 45 రోజుల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశముంది. తిరుమల లడ్డూ ప్రపంచవ్యాప్తంగా భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన నేపథ్యంలో ఈ వ్యవహారం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. పారదర్శక విచారణ ద్వారా వాస్తవాలు వెలుగులోకి రావాలని భక్తులు ఆశిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు కొనసాగుతోన్న తరుణంలో.. తాజా పరిణామం ఆసక్తికరంగా మారింది..
Also Read
- Potti Sriramulu's Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
- Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
తాజావార్తలు
-
Potti Sriramulu’s Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
-
Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
-
Abhijeet Dipke: సోనమ్వాంగ్చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్.. సెలెక్టర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు!
-
PV Sindhu: సెమీస్లో అదరగొట్టిన పీవీ సింధు.. జపాన్ ఓపెన్ టైటిల్కు ఒక్క అడుగు దూరంలో
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!