సామాజిక పోరాటంలో ఒక ప్రధాని మోడీ పాల్గొనడం చరిత్రలో స్థిర స్థాయిలో నిలిచి పోతుంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మోడీ మాదిగల సమస్యను అర్థం చేసుకుని కమిట్ మెంట్ తో మాట్లాడారు.. వాళ్ళ పోరాటం ఎవరికో వ్యతిరేకం కాదు.
నవంబర్ 17న చత్తీస్గఢ్లో రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి ముందు బీజేపీ సీనియర్ నేతలు రాష్ట్రంలో ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగిస్తున్నారు. ఈ రోజు(సోమవారం) విజయ్ సంకల్ప్ మహార్యాలీలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడానికి ప్రధాని మోడీ ఛత్తీస్గఢ్లోని మహాసముంద్కు చేరుకున్నారు. భూపేష్ బఘేల్ ప్రభుత్వాన్ని ఆయన టార్గెట్ చేశారు.
Tension is tension in Nizamabad: బీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగాలతో బీజేపీ అభ్యర్థి బహిరంగ చర్చకు అంగీకరించడంతో నిజామాబాద్లో ఉద్రిక్తత నెలకొంది. దీనికి అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు.
తాను గజ్వేల్ వస్తున్నా అని తెలవగానే కేసీఆర్ కామారెడ్డి పోయారని గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక (మం) దుద్దెడలో ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. తన భార్య అన్నీ అమ్ముకుందాం, అవసరం అయితే మళ్ళీ కొంగు నడుంకి కట్టి పనిచేస్తా.. నువ్వు మాత్రం కేసీఆర్ మీద కొట్లాట ఆపవద్దు అని చెప్పిందని ఈటల తెలిపారు.
Bandi Sanjay: ప్రశ్నించే గొంతుకను నేను.. కాపాడుకుంటారా? పిసికేస్తారా? అంటూ బీజేపీ కరీంనగర్ అభ్యర్ధి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ మహాశక్తి దేవాలయంలో నిర్వహించి.. శ్రీ లక్ష్మీ కుబేర హోమంలో పాల్గొన్నారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈ దీప కాంతుల వెలుగులు మీకు అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, సుఖ సంతోషాలను అందించాలని అన్నారు. మీ జీవితం ఆనందమయం అవ్వాలని మనసారా కోరుకుంటూ హిందూ బంధువులకు దీపావళి…
తెలంగాణలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఏ పార్టీ నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారో లెక్క తేలింది. మూడు పార్టీలు కూడా బడుగుల ప్రతినిధి తామేనని చెప్పుకునే ప్రయత్నం చేశాయి. ఇంతకీ ఏ పార్టీ ఏ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లిందో తెలుసా?. ఎన్నికల్లో గెలవాలంటే ఏ ఒక్క వర్గమో ఓటేస్తే సరిపోదు. అందరి మద్దతు కావాల్సిందే. అందుకే అన్ని పార్టీలు కులాలను, వర్గాలను అక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
CM Pinarayi Vijayan: కేరళలో పాలక సీపీఎం, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా పాలస్తీనా సంఘీభావం ర్యాలీలను చేపడుతున్నాయి. శనివారం కోజికోడ్ వేదికగా అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పాలస్తీనా మద్దతు ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో కేరళ సీఎం పినరయి విజయన్ పాల్గొన్నారు.
వేములవాడ రాజకీయాలు వేడెక్కాయి. వేములవాడలో బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన తులా ఉమకు టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకపోవడంతో అక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది. వేములవాడ బరి నుంచి వికాస్ రావు బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో తుల ఉమ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.